క్రొత్త పరీక్షా విధానం..


జులై 1, 2020 నుండి డిల్లీ యూనివర్సిటీ వాళ్లు నుతన పరీక్షా విధానం ప్రవేశపెట్టారు. అదే ఓపెన్ బుక్ ఎక్సామినేషన్ అంటే పుస్తకాలు చూసి  పరిక్ష వ్రాయడం. ప్రశ్న లు వాళ్లే వేసి దానిని వ్రాసుకొడానికి వాళ్లే పుస్తకాలు అనుమతిస్తారు. అయితే ఇవ్వబడిన  అవకాశంలో వారి ప్రతిభ ప్రశ్నకు సమాధానం కనుగొనె ప్రతిభను బట్టి మార్కులు ఇవ్వబడథాయి. ఇది చదివినప్పుడు నాకు బైబిల్ ఒక సందర్భం గుర్తుకు వచ్చింది. 

అప్పుడే అర్దం అయ్యింది ధీని నిర్మానికుడు మన దేవుడే అని. విస్వాసికి శ్రమల ద్వారా పరీక్షించు వాడు ఆయనే, ఆ శ్రమలలొ తప్పించుకొను మార్గమును సిధ్ధ పరచువాడు ఆయనే అట. అంటె మన శ్రమలలొ మన గెలవడం అంటె అయన మనకు సిధ్ధపరచిన మార్గమును కనిపెట్టడమె మన విధి. దాని ద్వారానే మన ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి శ్రమలు కలిగినప్పుడు దేవుడు ఎర్పరచిన మార్గాన్ని కనుగుంటున్నవా? లేకా సొంత మార్గములొ నడచి దేవుని దృష్టిలో విఫల విస్వాసిగా మిగిలిపొథున్నవా? దేవుని మార్గం తెలుసుకోడానికి విశ్వాసం, ప్రార్ధన అవసరం. 

1కోరింథీయులకు 10: 13


https://www.google.com/amp/s/m.timesofindia.com/home/education/news/open-book-examination-what-does-it-mean/amp_articleshow/76112795.cms


అంతుచిక్కని రహస్యం 🤔


కొబ్బరికాయలు అంధరికి తెలుసు గాని కొబ్బరికాయలు లోనికి నీరు ఎలా వెల్తుందో ఎవరికీ తెలియదు, చివరికి శాస్త్రవేత్తల కు సహితం అంతుచిక్కని రహస్యం అది. అధి దైవ కార్యం మానవుని ఆలోచన కు అందదు. అలాంటివి సృష్టిలో, ఈ భూమి మీద మన చుట్టు వున్నాయి. 

అలాంటి వాటిలో ఒకటి, దేవుని యంధు సంపూర్ణ విశ్వాసంతో జీవించే వారి జీవితాలు, సేవకుల జీవితాలు. వీరు లోకుల కంటె, స్నేహితుల కంటె, శత్రువుల కంటె ధీనులుగా ఉండవచ్చు. కాని శ్రమల కాలంలో, ఆపద కాలంలో, కరువు సమయాలలో ఎలా పోషింప బడుతున్నారో, వారి అవసరాలు ఎలా తీర్చబడుతున్నాయో ఎవరికీ అంతుచిక్కని రహస్యం గా ఉంటుంది, చివరికి అనుభవించే వారికి కుడా ఆశ్చర్యం గానే మిగిలి పోతుంది. 

దేవుడు తన ప్రజలను ఆకలి గొననియ్యడు. ( సామెతలు 10:3), వారికి ఆశ్చర్య కరమయిన సహాయం అందిస్తారు ( 2 దిన 26:15 ), అధి మనుష్యుని అలోచన కు అందదు ( 1 కోరింది 2:9). 

ఎలియాకు కాకులు ఆహారం తేవడం ఎంటి? సారెపతు వెధవరాలి ఇంట్లో నునె, పిండి ప్రతిరోజు సిధ్ధం గా ఉండటం ఎంటి? సముద్రం లోనుండి పురెల్లు రావడం ఎంటి? ఆకాశం నుండి మన్నా రావడం ? 5రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మంది తినడం? అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి... మన జీవితం లో కూడా కధా.. 
సదా మనలకు పోషణకర్త గా, యెహోవా యీరె గా ఉన్న ఆయనకే మహిమ కలుగును గాక

మీ సహోదరుడు
అపొస్తులు నాని బాబు నెల్లి
9908823196 

అన్నీ పట్టించుకోకండి



క్రోధం మనిషిని అవివేకి గా మార్చివేస్తుంది

అన్నీ పట్టించుకోకండి

ఒక పాము వడ్రంగి దుకాణంలో లోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపై ఎదురు దాడి చేస్తోందనుకుని వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా వుపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై యిలానే స్పందించి, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరుగుతుంది. జీవితంలో ప్రశాంతంగా వుండలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలు అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు అసలు ప్రతిస్పందించకపోవడమే మంచిది..

సామెతలు 14: 17
త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. 


సామెతలు 16: 18
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును

సామెతలు 17: 14
కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

సామెతలు 11: 27
మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.

పెస్బుక్ లో ప్రెండ్ ని తొలగించుట? మనకు ఒక పాటం...


ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం సమాజం మీద చాలా ఉంది. సోషల్ మీడీయా అనగానే ఫేస్బుక్ గుర్తుకువస్తుంది. ఇందులో అకౌంట్ లేని వారు ఇంచుమించు ఉండరు. కాని దానిని వాడటం లో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎధుర్కుంటారు. ధాని వల్ల కొంత మంది అకౌంట్స్ లో జంక్ ప్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అంటే... ఒక వ్యక్తీ ఎక్కువ అకౌంట్స్ థిసుకుని మనకు రిక్వెస్ట్ పెట్టి ధానిని మనం అంగీకరించిన తరువాత మరల మరొ అకౌంట్ తిసుకుని మరల రిక్వెస్ట్  పెట్టడం అలా ఎక్కువ సార్లు చెయ్యడం వలన మన అకౌంట్ లో మనుగడలో లేని ఫ్రెండ్స్ అకౌంట్ లు ఎక్కువ గా ఉంటాయి. అయిథె నాకు ఒక అలావటు ఉంది. ప్రతి రోజు పుట్టిన రోజు ల నోటిఫికేషన్ వస్తుంధి. అప్పుడు ప్రతి ఒక్కరి అకౌంట్ లో ప్రొఫైల్ చూస్తాను. ఒకవేళ ఆ వ్యక్తి కొన్ని నెలలుగా ఆ అకౌంట్ లో ఆక్టివ్ గా లేక పోతే, అంటె ఎవిధయిన పోస్ట్ లేకపోతే ఆ వ్యక్తిని నా ప్రెండ్ లిస్ట్ నుండి తీసేస్తాను. చాల మంది కొన్ని సంవత్సరాలుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టారు. అంటే అప్పుడప్పుడన్న ఒక పొస్ట్ పెడతా వుంటే ఆ వ్యక్తి ఆ అకౌంట్ ని వాడుతున్నట్టు. 

అలాగే మన దేవుడు మనం ఏదైన అడిగినప్పుడు, మనం ఏదైన ప్రభువు దగ్గర ఆశించినప్పుడు మన గతాన్ని చూస్తారు. అందులొ నీవు ఏదైన చేసినట్లు ఉంటె నీవు జివించుచున్న క్రైస్తవుడవు. ఒకవేళ ఆయన నీ గతాన్ని చూసినప్పుడు నీవు చలించుచున్నట్టు కనిపింఛక పోతే నిన్ను మృత క్రైస్తవ జాబితాలో వేస్తాడు. 

మరి దేవునికొరకు ఈ మధ్య కాలంలొ ఏదైన చెసావా... గుర్తు వచ్చినప్పుడు చెయ్యడం, గుర్తు వచినప్పుడు మందిరానికి వేల్లడం.... ఆపద వచ్చినప్పుడు మొర్ర పెట్టడం... జీవ క్రైస్ఠవ్యం కాదు.... ఎలాంటి పరిస్థితి అయిన క్రైస్తవ జీవితాన్ని, పరిశుద్ద జీవితాన్ని జీవించాలి. 

లూకా 13: 6 -9

చనిపొయిన తరువాత కూడా నీ డబ్బు నీతోనే...


ఒక మంచి జ్ఞానోదయo కలిగించే  ఉదాహరణ లాంటి నిజం  :-


 ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని ,

చాలా కస్టపడి సుమారు 1,000 కోట్లు రూపాయిలు సంపాదించాడు.


ఒకరోజు , తాను  ఎంతో కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన ధనం ,  తాను చనిపోయినా సరే ఎవరికీ , ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని , బాగా ఆలోచించి , 


 పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు, ఏమని అంటే , ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువు (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు. నెల గడిచినా ఎవరు రాలేదు. మల్లీ 100, 200 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో , చిక్కి సగం అయిపోయి ఉండగా......


ఈలోగా అకస్మాత్తుగా  ఒక  జ్ఞాని వచ్చి 


నేను మీ డబ్బు మీరు చనిపోయిన  తరువాత కూడా మీకు  ఉపయోగపడే సులువు టెక్నిక్  చెపుతాను అని అన్నాడు.


 ఎలా ?  అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు.


దానికి ఆ జ్ఞాని కోటీశ్వరునికి మీరు అమెరికా , ఇంగ్లండ్ , జపాన్ వెళ్ళారా ? అని అడిగేడు.

 Ans :-Yes.

 Q ;-   అమెరికాలో మీరు ఎన్ని  రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు 

   Ans: - నా Indian currency అమెరికాలొ చెల్లదు. 


కనుక నా రూపాయలను డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను ,  అదే England ఆయితే pounds , జపాన్ ఆయితే Yens ఇలా ఏదేశం వెళ్తే , ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి ,  ఖర్చుకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు..     


 ఇప్పుడు జ్ఞాని ఇచ్చిన సలహా


ఓ కోటీశ్వరుడా..


 అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా  , నీడబ్బు నీతో రావాలంటే , ఒకవేళ నీవు నరకానికి వెల్లాలి అని అనుకుంటే నీడబ్బును   పాపము " లోనికి  మార్చు. అంటే దుర్వినియోగం ,చెడు వ్యసనాలకి , పాపపు పనులలోనికి మార్చు.


 లేదా ..... ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే , నీ డబ్బును  దాన , ధర్మములు చేసి పుణ్యంగా Exchange   చేయు అని  చెప్పగానే .........


 ఆ ధనవంతునికి  జ్ఞానోదయం కలిగి , ఆ జ్ఞానికి 100 కోట్లు  తీసుకోమంటాడు. 


దానికి జ్ఞాని నేను కస్టపడి

 పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు.


 అప్పుడు జ్ఞానోదయం ఆయిన ఆ ధనవంతుడు , తన ఆస్తికి ఆ జ్ఞానినే  Maneger గా నియమించి , తగిన జీతం ఇచ్చి , తన సంపద అంతా సన్మార్గంలోనికి , పుణ్యo లోనికి , జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా ,


అయ్యా..... ఇదండీ సంగతి  


మన సంపదలు మనతో వచ్చే విధానం


ఇక మన ఇష్టమే .


మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ  మార్గం లో  ఖర్చు చేసి ,  పుణ్యం గా మార్చి  మనతో తీసుకొని వెల్దామా ?


     లేక


మన తలనొప్పిని కూడా తీసుకోలేని వారికి వదిలి వెల్దామా ?


మత్తయి 6: 20

పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

విశ్రాంతి

విశ్రాంతి

బైబిల్ గ్రంధం లొ అన్నింటి గురించి బాహాటంగా, సవివరంగా వ్రాయడం జరిగింది. బైబిలె మానవాళికి ఒక మాన్యువల్ బుక్ లాంటిది అని చాలా మార్లు చెపుథుంటాను. ప్రభువు మానవాళికి ఇచ్చిన క్రమ బరిత జీవితం లొ విశ్రాంతి అనేది కూడా ఒక భాగం. అయితే  మానవుడు విశ్రాంతి లేకుండ ప్రయాస పడుతుంటున్నడు. విశ్రాంతి అనేది రాత్రి వేళ తీసుకునేది మాత్రమే కాదు. అంతకు మించినది అని నా భావన. సృష్ఠి నిర్మానం లొ యెడవ దినాన విశ్రాంతి తీసుకున్నారు ( ఆది 2:2). అంతె కాదు వారంలొ ఒక రోజు మనలను విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు( నిర్గ 20:9 ). యెసువారు ఒక రోజు పడవ ప్రయాణం చేస్తునపుఢు చాల పెద్దతుపాను సముద్రం లొ అలజడి గా ఉంది శరీరానికివిశ్రాంతి అవసరం గనుక అయన నావ అమరమున నిద్రించు చున్నారు ( లూకా 8: 22 ). అంతటి పరిస్థితులు ఆగిన శరీరానికి ఇవ్వవలసిన విశ్రాంతి ఇవ్వాలని ప్రభువు వారి సూచన అయి ఉండవచ్చు అని నా ఉధ్దేశ్యం. ఎందుకంటె శ్రమలలొ ఆయన మనలను విడచి పెట్టు వాడు కాదు. మన చింత యవత్తూ ఆయన మొస్తున్నారు ( 1పెతురు 5:7,8)  దేవుడు విశ్రాంతిని ఎంత నిష్పత్తి లొ ఉంచారు అంటె 6:1. ప్రభువు వారు పెట్టిన క్రమంలో  విశ్రాంతికి ఎంత బలము చదరపు ఉంది అంటే కరొనా వలన ప్రపంచ మంథ లాక్ డౌన్ పాటించడం జరిగింది. ప్యాక్రటరిలు, ప్రయాణ వాహనాలు అని రెండు నెలలు నిలిపి వేసారు. ఇది ఒక విశ్రాంతి గా భూమి స్వీకరించి మానవ అవసరలకు పెరుతున్న వాయు కాలుష్యం వలన పాడయిన ఒజొను పొరను భూమి తనకు తాను బాగుచేసు కుంది. అధి పది లక్షల చదరపు కిలో మీటర్ల. ప్రభువు పెట్టిన క్రమం వెనుక ఒక రహస్యం అధి. బైబిల్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు కూడ మీ శరీరానికంతటికీ, మీరు పండించే భూమికి, వాడే వస్తువుకు, ప్రతి దానికి విశ్రాంతి ఇవ్వడం మరచి పొకండి. 6:1 నిష్పత్తి. ప్రభువు మిమ్మును ధివించును గాక.

మీ సహోదరుడు,
అపొస్తులు నాని బాబు నెల్లి,

దేవుని దగ్గర కోరికల చిట్టా పెడుతున్నావా? ఒకసారి ఇది చదువు






సోదోమ గోమేర్ర ల పాపం అధికం కావడం వలన ఆ ప్రాంతాలను పాప శిక్షకు అప్పగించడానికి దాని స్థితిని చూసి రావడానికి దేవుడు తన దూతలను పంపగా వారిని లోతు చేర్చుకున్నాడు. ఆదిత్యం ఇవ్వడం అలవాటుగా అబ్రహాము నుండి నేర్చుకోవడం వలన దేవుని దుతలకు ఆదిత్యాన్ని ఇచ్చాడు లోతు. ఆ రాత్రి ఆ పట్టణపు వారు లోతు ఇంటికి వచ్చిన వారిని బయటకు పంపమని గొడవచేయగా దేవుని కోపం ఆ దేశం మీద రేగింది. ఆ దూతలు లోతును తన కుటుంబాన్ని రక్షించాలని ఆసపడగా లోతు యొక్క అల్లుళ్ళు, కుమారులు తన మాట వినలేదు, కుమార్తెలను భార్యను తీసుకుని బయటకు తీసుకురాగ భార్య వెనుక తిరిగి ఉప్పు స్థంభం అయ్యింది. అయితే దేవుడు లోతు పట్ల ఒక ఉద్దేశ్యం కలిగి ఉండి కనపడుచున్న పర్వతానికి వెళ్ళమని చెపితే తను మాత్రం దగ్గరగా ఉంది కదా అని సోయరు కు వెళ్తానని అడుగుతాడు, దానిని దేవుడు అంగీకరించాడు. మనం కూడా దేవుని అడుగుచున్నప్పుడు అయన కాదనలేక అంగీకరిస్తాడు, కాని మనం ఎన్నుకున్నది దేవుడు మన కోసం దానికి చాల వత్యాసం ఉంటుంది. కొన్ని రోజులు లోతు అక్కడ నివాసం చేసాక అక్కడ అతనికి భయం వెంబడించింది, సోయారు కూడా సోదోమతో నాశనం కావలసింది కాని లోతు వాళ్ళ దానిని కాల్చలేదు, లోతు అక్కడ ఉండలేదు. మరల అక్కడ నుండి ముందు దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెల్లవలసి వచ్చింది. కాని అప్పుడు అక్కడ తన కుమార్తెలు పాపం లో పడిపోయారు. తన సంతానం సపగ్రస్తులయ్యారు. దేవుడు వెల్లమన్నపుడు వెళ్తే దేవుడు తనకోసం అక్కడ ఏమి సిద్ధపరిచాడో కదా... పాప భుయిష్టమయిన ప్రజల మధ్య పవిత్రతను కాపాడుకునిన పిల్లలు ఆ ప్రాంతములో పాపములో పడిపోయారు. ఒక్కసారి అలోసించు దేవుడు నీకొరకు నీకంటే ఎక్కువగా అలోసిస్తున్నారు, నీ భవిష్యత్తు గురుంచి  నీకంటే ఎక్కువగా అల్లోసిస్తున్నారు అయన. అందుకే నీ చిట్టా అయన దగ్గర పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించు. ఆయన చిత్తానికి లోబడితే అంతా మేలే జరుగుతుంది కొంచెం ఆలస్యం అయిన. దేవుడు చేయమనిన పనిని చేయ్యమన్నప్పుడే చెయ్యి ఇప్పుడు వేరే ఆలోచనలు ఆయనకు చెప్పి తరువాత మరల అక్కడికే రావలసి వస్తే మిగిలేది శూన్యం.

ప్రభువు చిత్తము నీయెడల నెరవేరును గాక..
మీ సహోదరుడు
అపోస్తులు నాని బాబు నెల్లి

మందిరానికి వెళ్తే ఏమి దొరుకుతుంది.?



ప్రియ సహోదరి సహోదరుడ,
 
మానవుడు తృప్తి లేని జీవి. ఎంత చేసిన, ఎంత అనుభవించిన, ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా, ఇంకా ఏదో కవాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి అని తాపత్రయ పడుతూ సమదానం లేకుండా, తృప్తి లేకుండా జీవితాన్ని కొనసిగించేస్తున్నాడు. తృప్తి లేకుండా సమాధానం ఉండదు, సమాధానం లేకుండా సంతోషం ఉండదు, సంతోషం లేకుండా ఎన్ని ఉంటె ఉపయోగమేంటి? ఎన్ని సాధిస్తే మాత్రం ఏంటి? తృప్తి అనేది మనసులోనుండి కలిగేది. ఆత్మలో కలిగేది. అందుకే సర్వశక్తి కలిగిన దేవుని ఆలయముని గూర్చి దావీదు
  ఎలా పాడుతున్నాడు నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత  మేము తృప్తిపొందెదముకీర్తనలు 65:4 Psalms .  అందుకే క్రైస్తవుడు ఏమి ఉన్న లేకున్నా సంతోషం గా, ఆనందం గా బ్రతుగ గలుగుతున్నాడు. సంఘముగా చేసే స్తుతి ఆరాధన, దైవ సేవకుడు అందించే దైవ ఉపిరి అయిన వాక్యం, ఒకరి కొరకు చేసుకునే ప్రార్ధనా ఇంకా ఆత్మీయ సహవాసం ధనం, హోదా, బంధువులు ఇవ్వలేని అనుభూతులను మిగులుస్తు నీకు ఒక కొత్త అనుభవం కలుగ చేస్తాయి.  బీద లాజారు భిక్షమెత్తుకునే టప్పుడు కుడా సంతోషం గా ఉన్నాడు..... ఈరోజు ఆరధాన దినం, సంఘముగా దేవుని ఆరాదించే రోజు, మందిరపు మేలులతో నింపబడే రోజు... ఒకవేళ నీవు తృప్తి లేని జీవితాన్ని అనుబవిస్తున్నట్టు నీకు అని పిస్తే ఇరోజు తప్పనిసరిగా మందిరానికి వెళ్ళు...... సమస్త మనసులను పరిసోధించ గలిగిన పరమ తండ్రి నీకు సంతృప్తి ని ఇచ్చి నీకు సంతోషము, సమాధానము అనుగ్రహించును గాకా?
 
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి
 

source

మందిరానికి వెళ్ళకుండా వేసే సాతాను తంత్రం




ప్రియా సహోదరి సహోదరుడా, నీ హృదయం లో సాతాను  ఒక చేదు విత్తనం వేసి ఉంటాడు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఇంట్లో కూర్చుని ప్రార్ధన చేసుకున్న దేవుడు వింటాడు అని.  ఆలా ఎందుకు నీకు వాడు చెప్పాడో తెలుసా నిన్ను అసలు విషయం లో నుండి బయటకు లాగడానికి.  ఇంట్లో కూర్చుని ప్రార్ధించిన కొన్నాళ్ళకు మరల నీ దగ్గరకు వచ్చి ఎంత ప్రార్ధన చేస్తున్నావు , ఎంత భక్తి చేస్తున్నావు మరి నీ ప్రార్ధన దేవుడు వింటున్నాడా ? ప్రతిఫలం దక్కిందా? నీవు కోరుకున్నది నీకు దొరికిందా? అంటాడు. అప్పుడు అని పిస్తుంది నిజమే ఎంత ప్రార్ధన చేసినా  మారడం లేదు, ఎందుకొచ్చిన దేవుడు అని చేసే ప్రార్థనకు కూడా దూరం అయిపోతావ్. ఆల నిన్ను మెల్లగా లోకం లోకి, లోక అసలలోకి, లాగి తన పంజాలో నిన్ను చిత్తుచేసి చిత్తూ కాంగీతం ల మార్చేస్తాడు. అసలు వాడు మొదటి ప్రయాతం ఎందుకు చేస్తాడో తెలుసా వాక్యం ఒక మాట ఉంది. అది నీవు చదివి ఉండవు. కానీ మన శత్రువు అది చదివి ధ్యానం చేసి ఆ వాగ్దానమునకు నిన్ను దూరం చేస్తున్నాడు. 
కీర్తనలు18:6 Ps నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్ధన చేసితిని , అయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్ధన నంగీకరించెను. ఈ వచనం రెండు మూడు సార్లు చదువు నీకే అర్ధం అవుతుంది. సాతాను ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అని నీకు ఎందుకు చెప్పాడో.నీవు మందిరానికి వెళ్తే ప్రార్ధన ఆలకించే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడేమో, అది నీవు పొందుకుంటే బలపడిపోతావేమో అని నిన్ను వెళ్లనివ్వడం లేదు. చదవడానికి చిన్నపిల్లల స్టోరీ లా ఉన్న ఇది వాక్య సత్యం.   అర్ధం అయితే బయలు దేరు ఈరోజు పరిశుద్ధ ఆరాధన దినం. ప్రభువు నీ ప్రార్ధన తన ఆలయంలో విని ప్రతిఫలం ఇచ్చును గాక!

షలొమ్. 
 
మీ కొరకు ప్రార్ధించే
 
అపోస్తులు నెల్లి నాని బాబు

మందిరానికి ఎందుకేల్లాలి?





ఒక సహోదరుడు న్యూస్ పేపర్ వారికి ఒక లేఖ వ్రాసాడు. అందులో తన ఆవేదనను వెళ్లగక్కుతూ " నేను 30 సంవత్సరాలుగా ఆరాధనకు మందిరానికి వెళ్తున్నాను, 3 వేల ప్రసంగాలు వినివుంటాను, కాని అందులో ఒక్క ప్రసంగం కూడా గుర్తు లేదు. నీను ఇప్పటివరకు సమయమంతా వ్రుదాపరచుకున్నాను, పాస్టర్ గారు తన సమయాన్ని కుడా ప్రసంగాలు సిద్ధపడటం లోను, ప్రసంగాలు చేయడానికి సమయాన్ని వృధా పరచుకుంటున్నారు. అందువల్ల మందిరానికి వెళ్ళడం ప్రయోజన కరం కాదు" అని వ్రాసాడు.  దానికి పత్రిక సంపాదకుడు తిరిగి ఒక ఉత్తరం వ్రాసాడు. నాకు వివాహం అయ్యి 30 సంవత్సరాలు అయ్యింది. నా భార్య నాకు ఇప్పటివరకు ౩౦ వేల పర్యాయాలు వంట చేసి పెట్టింది. కాని అందులో ఏవొక్కటి కూడా నేను ఇప్పుడు చెప్పలేను. కాని ఇరోజు నేను ఇలా ఆరోగ్యంగా, నా పని ని నేను చేసుకే శక్తీ కలిగి  ఉన్నాను అంటే తను నాకోసం చేసి పెట్టిన ఆహారమే కారణం. ఆ ఆహారం లేక పోతే నేను ఇరోజు ఉండే వాడిని కాదు, శారీరకంగా మరణించి ఉండేవాడిని. అని వ్రాస్తు  అలాగే నేను ప్రతి వారం వాక్యం వినక పోయిన యెడల నేను ఈరోజు ఆత్మీయంగా మరణించి ఉండేవాడిని. నీవు కుడా... అని తిరిగి జాబు పంపాడట.
అందుకే పరిశుద్ధాత్ముడు మన కొరకు ఒక వాక్యాన్ని వ్రాయించి ఉంచాడు. హెబ్రీ 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినోకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చుపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని నొకడు పురికోల్పవలేనని అలోచింతము. కొందరు మానెయ్యడం వలన ఆత్మీయ ఆహారం లేక ఆత్మీయ మరణం పొందుతున్నారు, దేవునికి, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. మీరైతే అలా కాక అన్నింటిలోను సంపుర్ణులు గా ఉండి, ఆత్మీయ ఆహారమును భుజిస్తూ ఆత్మీయ శక్తీ మంతులు అగుదురు గాక!

షలోమ్

మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు 



మందిరానికి ఎలా వెళ్ళాలి?







ఈరోజు మందిరానికి వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారా? చాల మంచి పని చేస్తున్నారు. అయితే మందిరానికి ఎలా వెళ్ళాలి అనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు నిలిచి ఉండు స్థలమునకు మనం వెళ్తున్నాము. ఇశ్రాయేలియులు ఐగుప్తు నుండి కానా యాత్రలో సైన్యములకు అధిపతి యగు యెహోవా వారితో ఉండుటకు ఒక పర్ణశాల కట్టమని మోషే కు ప్రభువు వారు సుసించారు. అయితే పర్ణశాల చుట్టూ ప్రాకారము తెరలతో కట్టబడింది. దానికి తూర్పుగా ప్రవేశ ద్వారము ఉంచబడింది. లోపలి వెళ్ళే ప్రవేశ ద్వారము కూడా వ్రేలాడుతున్న తెరలతో ఉంది. అయితే ద్వారానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమీలేవు కాని వ్రేలాడుతున్న తెరల గుండానే లోపలి వెళ్ళాలి. అయితే అలా వెళ్ళాలి అంటే ప్రతివారు వ్రేలాడుతున్న తెరను వంగుని తెరను లేపి వంగి వెళ్ళవలసి ఉండేది. అదే విధానం అందరికి, చిన్న, పెద్ద, ధనిక, పేద, బేధం లేదు. ఈరోజు నీవు వెళ్ళేది అయన నిలఛి ఉండే స్థలానికే, నీవు ధనికుడవు అయివుండవచ్చు, బిద వాడవు అయివుండవచ్చు, ఉద్యోగస్తుడవు అయివుండవచ్చు, నీవు ఎవరివైన పర్ణశాలలో దేవుని కలచుటకు దేవుడు నిర్ణయించిన మాదిరి దీనత్వం కలిగి, నీవు నిలిచి ఉండే స్థలము సర్వసృష్టి కథ నిలిచి ఉండే స్థలమని, ఆయన నీన్ను సృజించిన వాడని, నీకంటే అధికుడని, బలవంతుడని గమనించి జీవిస్తే నీకు దివేనకరముగా ఉంటుంది. సోలోమోను అంటాడు " నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రతగా చూచుకొనుము ప్రసంగి 5:1 "  అయన తన  సన్నిధిలో దీనులను లేవనేత్తువాడు, గర్విష్టులను అనగ ద్రొక్కు వాడు. మోషే దినత్వాన్ని కలిగి సాత్వికుడై ఉన్నాడు గనుకనే దేవుని చూడగలిగాడు. నీవును అటువంటి మనసు కలిగి దీవింప బడుధువు గాక!


 షలోమ్
మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు 


పచ్చిమ బెంగాల్ లో ఆచారం



తిరిగి మిమ్ములను కలచుటకు దేవుడు చూపిన కృపను బట్టి ఆయనకే మహిమ. నేను, నా భార్య గతించిన వారం పశ్చిమ బెంగాల్ పరిచర్య నిమిత్తము వెళ్ళాము. అక్కడ నా తమ్ముడు సేవ చేయుచున్నాడు. అక్కడ నేను గమనించిన ఒక విషయం నన్ను బాగా ఆకర్షించింది. అక్క ఉన్న స్నేహితులు వారి  స్నేహితులకు ఎక్కువ బహుమానాలు ఇచ్చుకుంటూ ఉంటారు. సంధర్బం అవ్వని కానియి, స్నేహితుని ఇంట్లో ఏదైనా కొరత ఉంది అంటే ఎవరో ఒక స్నేహితుడు ఆ కొరత తిరిస్తూ ఉంటారు. అయితే తీసుకున్న వారు కుడా ఏదో ఒకటి వారికి బహామానం ఇస్తూ ఉంటారు. మాకు కూడా బహుమానాలు ఇచ్చారు. మేము కుడా వారికి వచేటప్పుడు ఇచ్చి వచ్చాము. ఇలాంటి  సందర్భములో ఒక ఉన్నత మయిన బహుమానాన్ని గుర్తు కు వచ్చింది... మన సృష్టి కర్త అయిన దేవుడు, ఎల్-షద్దాయి యోహాను3:16 లో ఒక విలువయిన బహుమానము ఇచ్చినట్లు ఉంది. అదేంటో తెలుసా? తన కుమారున్నే నా కొరకు నీ కొరకు భాహుమనంగా ఇచ్చేసారు.....  అయన మన కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు.... సిలువ వెయ బడ్డాడు.. నిన్ను నన్ను పరిశుద్దున్ని చేసారు... అయితే బహుమానమునకు ప్రతి బహుమానము మనము ఇవ్వాలి కదా,... ఆయనకు మనం ఇచ్చే బహుమానము మన హృదయము.... వెండి బంగారము అడగలేదు నీ హృదయము ను మాత్రమే అయన కోరుకుంటున్నాడు. ఇచ్చి పుచ్చుకోవడం లో ఉన్న ఆనదం మరి దేనిలో మనం పొందలేము. ఇక్కడ మనం పొందే ఆనందం రక్షనానంధం. అటువంటి రక్షణ ఆనందముతో ప్రభువు నిన్ను దీవించును గాక !

షలోమ్,

మీకొరకుప్రార్ధించే
అపోస్తులునెల్లినానిబాబు


ఎమీ వింటున్నావు?



ఒక రోజుఇద్దరు వృద్ధులు మాట్లాడుకుంటున్నారు. మందిరానికి వెళ్ళడం అనవసరం పాస్టర్ గారు అసలు వాక్యం సరిగా చెప్పడం లేదు, సమయమంత వృధ అవుతుంది అని ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. అయితే ఇంతలో మద్యలో వీరి మాటలు వింటున్న ఒక యోవనస్తుడు కలుగ చేసుకుని " అసలు మందిరానికి వెళ్లి దేవుని మాటలు వినడం మానేసి పాస్టర్ గారి మాటలు ఎందుకు వింటున్నారు" అన్నాడు అంట. మందిరం లో సేవకుడు మాట్లాడే మాట తనదిగా కాకుండా దేవుని నుండి వచ్చింది అని వింటే అందులో నీకు ఉపయోగకరమైన మాటలు, ఆత్మీయ అభివృద్ధికి శ్రేష్టమైన మాటలు, నీకు వినపడతాయి. సముయేలు, ఏలి మందిరంలో పడుకుని ఉన్నారు. సముయేలు దేవుని స్వరమును వినగాలిగాడు. మరి నీవు ఏలి స్వరమును కాదు దేవుని స్వరమును వినుటకు సిద్ధముగా ఉండు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని స్వరమును నీవు విందువు గాక. అది నీకు జీవహరముగా ఉందును గాక.,,

షలోమ్

మీ కొరకు ప్రార్ధించే.
అపోస్తులు నాని బాబు నెల్లి


source

దేవునికి ఇచ్చి దివించబడిన కుటుంబం





ఒక సహోదరుడు తన కష్టార్జితాన్ని వ్యయపరచి మందిరం కొరకు ఒక జనరేటర్ కొన్నాడు. అది కొన్నప్ప్పుడు చాలా మంది వెనకకు లాగాలని ప్రయత్నించారు. కొంతమంది పాస్టర్ గారికే ఇస్తున్నవా? అది పాస్టర్ వాడుకుంటాడు అని చాల విధాలుగా నిధించడం, డబ్బులు చెల్లడం లేదా? అని తిట్టడం చేసారు. కాని ఆ  యోవనస్తుడు మాత్రం వెనకకు తిరగలేదు, నేను దేవునికి ఇవ్వాలనుకున్న, ఇస్తాను, దానిని క్రొత్త మందిరం దగ్గర పెట్టడానికి సరియయిన వసతులు లేక సేవకుని ఇంటిదగ్గర పాత మందిరం ఆఫీస్ దగ్గరే ఉంచి వాడుతున్నారు. అది సేవకుడు వాడుకున్న నాకు సంతోషమే, సేవకుడు దేవుని ప్రతినిధి అని సమర్దించుకుని విశ్వాసంతో ఉండేవాడు.  తను జెనరేటర్ కొన్న 628 రోజులకు దేవుడు తన జీవితంలో ఒక గొప్ప కార్యం చేసారు. తన కంటే ధనవంతులు, అధికులు పొటి పడినా, వారికి లేని ఒక గొప్ప అవకాసం ప్రభువు ఇచ్చారు. తాను సొంతంగా ఒక కొత్త క్రేన్ కొనుకోడానికి అందరికంటే ముందు దానిని పొందడానికి ప్రభువు మార్గాన్ని సుగమం చేసారు. తన స్నేహితులకంటే, బంధువుల కంటే, దేవునికి ఇచ్చేటప్పుడు హేళన చేసిన వారికంటే ఉన్నత స్థితిని ప్రభువు తనకు ఇచ్చారని ప్రభువును స్తుతించాడు సహోదరుడు. అపోస్తులుడు అయిన పౌలు తిమోతి తో అంటాడు, దేవుడు వెక్కిరింప బడడు, మషుడు ఏమివిత్తునో అదే పంట కోయును. సహోదరుడు విత్తిన విత్తనం మొలకెత్తి, ఫలించి తను పెట్టిన ఖర్చుకు 45 రెట్లు ప్రతిఫలాన్ని ప్రభువు ఇచ్చారు. ఈరోజు నేను కూడా అల దీవింప బడాలని ఆశా ఉంటె తనవలె దేవుని కోసరం, దేవుని పని కోసం సణుగుడు లేకుండా, బలవంతం కాకుండా విత్తడం నేర్చుకో, విత్తని వానికి పంట కోసే హక్కు లేదు. ప్రభువు నిన్ను దివించును గాక?  దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో సర్వసమృద్ధి గల వారై ఉత్తమమయిన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు; 2 కొరింది 9:7, 8

షలోమ్
మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు 

నీ భవిష్యత్తు శూన్యం అనుకుంటున్నావా ?






నీ జీవతం లో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడుతున్నావా? రాబోయే ఆర్ధిక ఇబ్బందులను బట్టి చింతుస్తున్నావా? రాబోయే రోజుల్లో ఎలా బ్రతకాలి? ఎలా జీవనాన్ని కొనసాగించాలి? మారుతున్న సమాజంలో ఎలా పోటి పడగలము? ఆర్ధిక పరమైన సమస్యలు ఎలా ఎదుర్కొన గలము ? మనకు ఎవరు సహాయం చేస్తారు అని దిగులు పడుతుంటే ఈ వాక్య భాగం నీకోసమే. ఇశ్రాయేలు దేశంలో దేవుని ఉగ్రత వలన గొప్ప కరువు ఏర్పడింది. అయితే దేవుడు పిలచుకున్న దైవ జనుని కొరకు ప్రభువు కొంత కాలం కాకులతో భోజనం పంపించారు. తరువాత తనను పోచించడానికి ఒక వెధవరాలను ఎన్నుకుని తన యొద్దకు సేవకున్ని పంపుతారు  ప్రభువు. సారేపతు గ్రామంలోకి రాగానే ఆమె పుల్లలు ఏరుకుంటూ కనపడింది. ఆమెను నీళ్ళు అడిగి, తేవడానికి వెళ్ళిన ఆవిడతో తినడానికి రొట్టె ముక్కను తెమ్మని చెపుతాడు దైవ జనుడైన ఏలియ. ఆమె తనదగ్గర పట్టెడు పిండి, కొంచెం నునే మాత్రమె ఉన్నాయి, వాటిని తిని చనిపోదాము అనుకుంటున్నాము నేను నా బిడ్డ అంటూ తన బాధను, భవిష్యత్తు లేదు నాకు, అంటూ నిరాశతో, మరణానికి దగ్గరగా ఉన్నాము అని బాధగా నిట్టూర్పుతో చెప్పింది. అయితే ఎలియ రెండు అప్పాలు అయ్యేదానిని ౩ అప్పాలుగా చేసి మొదట రొట్టెను నాకు ఇవ్వు అన్నాడు. ఆమె దైవ సేవకునికి లోబడి మొదటి అప్పమును ఎలియకు ఇచ్చింది, ఇక ఆ ఇంటిలో పండుగ, సమృద్ధి, దీవెన, మొదలయ్యింది. ఆ తోట్టేలోని పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనే తరిగిపోలేదు మరల వర్షం వచ్చి, పంటలు పండేవరకు ఆ ఇంటివారు బంధువులు అందరు సమ్రుది గా తిని పోషింప బడ్డారు. ఈరోజు నా దగ్గర ఏమిఉంది అని అనుకోకు, నీ దగ్గర ఉన్న చిన్న వాటిలో కూడా నమ్మకముగా ఉండటం మొదలు పెట్టు.... దేవునికి ఇవ్వడం ప్రారంబించు, అది నీకు ఉన్నదానిలోనే దేవుని సన్నిధిలో విత్తడం ప్రారంబించు. అది రెట్టింపు అయ్యి, తగిన సమయం లో నీ ముందు నిలిచి ఉంటుంది. ఆ కుటుంభాన్ని పోషించడానికి కాదు దేవుడు సేవకున్ని అక్కడకు పంపింది, సేవకున్ని పోషించుట ద్వారా వారు పోషింప బడటానికి దేవుడు సేవకున్ని పంపించాడు. ఈరోజు సేవకుల మీద స్వార్ధపడే విశ్వాసులు, ప్రజలు ఎక్కువ గా కనపడుతున్నారు. సేవకున్ని పోషించడం మొదలు పెడితే నీవు నీ కుటుంభము ఉన్నత రీతోలో పోషింప బడతారు. మిగుల సంపదను నీకు అనుగ్రహిస్తాడు. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే రోమ 11:16,  మీ కుటుంబములకు ఆశీర్వాదము కులునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికియ్యవలెను. యెహేజ్కెలు 44: 31. సారేపతి లోని కుటుంభము వలె మీరును పోషింపబడుదురు గాక!  

 షలోమ్
మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు