ఆరాధన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆరాధన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

రోడ్డు నిర్మాణం లో మనకు ఒక పాఠం





ఒకరోజు నేను రోడ్డు నిర్మాణం పనులు జరిగే స్థలం మీదుగా వెళ్ళవలసి వచ్చింది. ప్రభువు నన్ను ఒక్క నిముషం ఇక్కడ ఆగి చూడు అన్నారు. ఏమి చూడాలి? సరే అని ఆగి రోడ్డు నిర్మాణం కొరకు వాడే మెటీరియల్ ని చూడటం మొదలు పెట్టాను. అక్కడ ఉన్న వన్ని రాళ్ళు, కానీ అవి ఒకొట్టి ఒకో పరిమాణం లో ఉన్నాయి. బాగా పెద్ద రాళ్ళు మొదట వేసి తరువాత చిన్న రాళ్ళు తరువాత బాగా చిన్న రాళ్ళు, మధ్యలో మట్టి, ఇసుక, లాంటివి వాడతారు. ఒకవేళ అవే రాళ్ళను తారు మారుగా వాడితే పరిస్థితి ఏమిటి? సాపిగా రావాల్సిన రోడ్డు ప్రయాణానికి అనువుగాని రోడ్డు గా ఉంటుంది. క్రింద వెయ్యవలసిన పెద్ద రాళ్ళు పైన వేసి పైన వేయ వలసిన చిన్న చిన్న రాళ్ళు క్రింద వేస్తే ?

అప్పుడు దేవుడు మనం జీవితం లో ఇవ్వవలసిన ప్రాధాన్యత లను గురుంచి నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. చాలా మంది మొదట ఇవ్వ వలసిన వాటికి చివ్వరిలో, చివర ఇవ్వవలసిన వాటికి మొదటిలో ప్రాధాన్యత లను ఇస్తూ ఉంటారు.

మనం మొదట దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వ గలిగితే అధి మన జీవితం లో బలమయిన పునాదిగా, స్థిరత్వం కొరకు మూల రాయిగా ఉంటుంది.

కయీను, హెబెలు ల అర్పన లలో దేవుడు హేబెలు అర్పనను లక్ష్య పెట్టడానికి గల కారణం ఇదే. తను తోలుచులిలో, కొవ్విన వాటిని దేవుని యొద్ధకు తెచ్చాడు. అక్కడ దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, విలువ, స్థానం కనపడుతున్నాయి.

మీ జీవితం లో దేవునికి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నారు.

ప్రభువు మిమ్మును దీవించు ను గాక!

అపొస్తులు నాని బాబు నెల్లి

9908823196


మన దేశంలో దేవుని సింహాసనం! ఎలా?


భూత,వర్తమాన,భవిష్యత్ కాలములలో ఉన్న ఎల్ - రోయి, ఎల్ - షద్ధయీ దేవునికే మహిమ,

ప్రభువు నామమున మీకు శుభాలు,

ప్రతి ఒక్కరికీ తెలుసు ప్రార్ధన శక్తి వంతమయింది అని, కొంత మందికి తెలుసు గొలుసు ప్రార్ధన మరింత శక్తివంతమైనది అని. గొలుసు ప్రార్ధన వలన జరగని కార్యం అంటూ లేదు. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. ఇధి కొంతమంది తెలియక పోవచ్చు. ఎలా అంటారా? యెషయా 6:1-3, ప్రకటన 4:8;5:9-14; 8: 1 లోని వాక్యాల ఆధారంగా, పరలోకం లో దేవుని సింహాసనం ఎదుట నిలచున్న దేవుని దూతలు, సెరాపులు, కేరాపులు నిత్యం ప్రభువుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు. అంటే పరలోకంలో నిత్య స్తుతి జరుగుతుంది.

 అదే నిత్య స్తుతి భూమి మీద రాజైన దావీదు సీయోను పర్వతం మీద, దేవుని ప్రత్యక్ష గుడారం నందు ఏర్పాటు చేశాడు.(  1దిన 16 ). అందుకోసమే దేవుడు అప్పటివరకు ఏ ప్రాంతాన్ని కూడా నా నివసస్థలం అని చెప్పలేదు, గానీ సీయోను తన నివాసముగా, అయన సీయోను వాసిగా చెప్పుకున్నారు. యెషయా 8:18, కీర్తనలు 74:2. అందుకోసమే దావీదును నా హృదయ అనుసారుడు అని సాక్ష్యం, బిరుదు ఇచ్చారు. అప్పుడు మొదలైనది నిత్య ఆరాధన, ప్రార్ధన భూమిమీద. అది కాస్త మార్పు చెందుతూ ఇప్పుడు గొలుసు ప్రార్ధన గా పిలువబడుతుంది. 

అంటే భూమి మీద ఎక్కడైతే నిత్య స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ ఆయన నివాసముంటారు. దానిని తన నివాస స్థలము గా చేసుకుంటారు. ఆ స్థలం నుండి తన పరిపాలన చేస్తారు. 


వాక్యం లో ఆయన నివాసం ఉన్న చోట స్తుతులు ఆయన సింహాసనం ( కీర్తనలు 22:3 ) అయితే ఆయన పాద పీఠం తన శత్రువులు ( కీర్తనలు 110:1 ) అని ఉంది. తన బిడ్డలం అయిన మన శత్రువు తన శత్రువు ( రోమా 12:19 ) ఇప్పుడు మనను బాధించు వారు, మనను శ్రమ పెట్టువారు, నిందించు వారు, మనలను బాధించు రోగములు, శాపములు, తెగులు దేవుని పాదముల క్రింద ఉంటే మనకు విడుదల, విజయం, సమాధానం, రక్షణ. 

అయితే ఆయనకు మనం సింహాసనం వెయ్యాలి కదా.... అలా ఆయనకు మన దేశం లో సింహాసనం వెయ్యడానికి దీర్ఘకాల, నిత్య గొలుసు ప్రార్థన చెయ్యాలని దర్శనం తో మా పరిచర్య జరుగుతుంది. 

ఇప్పటికే 70+ సేవకులు, మరికొంత మంది విశ్వాసులు కలసి ప్రతి నెల 1 వ తారీకు నుండి 5 వ తారీకు వరకు గొలుసు ప్రార్ధన జరుగుతుంది. మా ప్రాణాలిక దర్శనం ప్రాకారం ఈ ప్రార్ధన 30 రోజులు ఆగకుండా జరగాలి. 

అయితే మిమ్ములను కూడా ఇందులో పాలి బాగాస్తులు గా ఉండుటకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సంఘ, సిద్ధాంతం, ప్రాంతం, మిషన్ బేధం లేదు, పెంతుకొస్తు నుండి రోమన్ కేథలిక్, బిషప్ లనుండి సువార్తికుని వరకు అందరు రండి మనం అందరం కలసి మన సర్వలోక నిర్మానకుడు, ఆదిసంబుతుడు, సర్వశక్తుడు అయిన దేవునికి ఒక బలమైన సింహాసనం మన దేశం లో వెద్ధం..... 

ఈ సహవాసం లో  నెలకు ఒకరు  ఒక గంట, సంఘ ముగా ఒక రోజు గొలుసు ప్రార్ధన లో ఏకీభవించ గలిగితే చాలు... 



మరిన్ని సహవాస వివరాలు, కోసం
మీ వివరాలు, ఇష్టత  మాతో పంచుకోండి..... 

𝐈𝐍𝐃𝐈𝐀 𝐏𝐑𝐀𝐘𝐄𝐑 𝐋𝐄𝐀𝐆𝐔𝐄,

9908823196



మన గ్రూప్ లి జాయిన్ అవ్వండి. వాటిపై క్లిక్ చెయ్యండి.




విశ్రాంతి

విశ్రాంతి

బైబిల్ గ్రంధం లొ అన్నింటి గురించి బాహాటంగా, సవివరంగా వ్రాయడం జరిగింది. బైబిలె మానవాళికి ఒక మాన్యువల్ బుక్ లాంటిది అని చాలా మార్లు చెపుథుంటాను. ప్రభువు మానవాళికి ఇచ్చిన క్రమ బరిత జీవితం లొ విశ్రాంతి అనేది కూడా ఒక భాగం. అయితే  మానవుడు విశ్రాంతి లేకుండ ప్రయాస పడుతుంటున్నడు. విశ్రాంతి అనేది రాత్రి వేళ తీసుకునేది మాత్రమే కాదు. అంతకు మించినది అని నా భావన. సృష్ఠి నిర్మానం లొ యెడవ దినాన విశ్రాంతి తీసుకున్నారు ( ఆది 2:2). అంతె కాదు వారంలొ ఒక రోజు మనలను విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు( నిర్గ 20:9 ). యెసువారు ఒక రోజు పడవ ప్రయాణం చేస్తునపుఢు చాల పెద్దతుపాను సముద్రం లొ అలజడి గా ఉంది శరీరానికివిశ్రాంతి అవసరం గనుక అయన నావ అమరమున నిద్రించు చున్నారు ( లూకా 8: 22 ). అంతటి పరిస్థితులు ఆగిన శరీరానికి ఇవ్వవలసిన విశ్రాంతి ఇవ్వాలని ప్రభువు వారి సూచన అయి ఉండవచ్చు అని నా ఉధ్దేశ్యం. ఎందుకంటె శ్రమలలొ ఆయన మనలను విడచి పెట్టు వాడు కాదు. మన చింత యవత్తూ ఆయన మొస్తున్నారు ( 1పెతురు 5:7,8)  దేవుడు విశ్రాంతిని ఎంత నిష్పత్తి లొ ఉంచారు అంటె 6:1. ప్రభువు వారు పెట్టిన క్రమంలో  విశ్రాంతికి ఎంత బలము చదరపు ఉంది అంటే కరొనా వలన ప్రపంచ మంథ లాక్ డౌన్ పాటించడం జరిగింది. ప్యాక్రటరిలు, ప్రయాణ వాహనాలు అని రెండు నెలలు నిలిపి వేసారు. ఇది ఒక విశ్రాంతి గా భూమి స్వీకరించి మానవ అవసరలకు పెరుతున్న వాయు కాలుష్యం వలన పాడయిన ఒజొను పొరను భూమి తనకు తాను బాగుచేసు కుంది. అధి పది లక్షల చదరపు కిలో మీటర్ల. ప్రభువు పెట్టిన క్రమం వెనుక ఒక రహస్యం అధి. బైబిల్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు కూడ మీ శరీరానికంతటికీ, మీరు పండించే భూమికి, వాడే వస్తువుకు, ప్రతి దానికి విశ్రాంతి ఇవ్వడం మరచి పొకండి. 6:1 నిష్పత్తి. ప్రభువు మిమ్మును ధివించును గాక.

మీ సహోదరుడు,
అపొస్తులు నాని బాబు నెల్లి,

మందిరానికి వెళ్తే ఏమి దొరుకుతుంది.?



ప్రియ సహోదరి సహోదరుడ,
 
మానవుడు తృప్తి లేని జీవి. ఎంత చేసిన, ఎంత అనుభవించిన, ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా, ఇంకా ఏదో కవాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి అని తాపత్రయ పడుతూ సమదానం లేకుండా, తృప్తి లేకుండా జీవితాన్ని కొనసిగించేస్తున్నాడు. తృప్తి లేకుండా సమాధానం ఉండదు, సమాధానం లేకుండా సంతోషం ఉండదు, సంతోషం లేకుండా ఎన్ని ఉంటె ఉపయోగమేంటి? ఎన్ని సాధిస్తే మాత్రం ఏంటి? తృప్తి అనేది మనసులోనుండి కలిగేది. ఆత్మలో కలిగేది. అందుకే సర్వశక్తి కలిగిన దేవుని ఆలయముని గూర్చి దావీదు
  ఎలా పాడుతున్నాడు నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత  మేము తృప్తిపొందెదముకీర్తనలు 65:4 Psalms .  అందుకే క్రైస్తవుడు ఏమి ఉన్న లేకున్నా సంతోషం గా, ఆనందం గా బ్రతుగ గలుగుతున్నాడు. సంఘముగా చేసే స్తుతి ఆరాధన, దైవ సేవకుడు అందించే దైవ ఉపిరి అయిన వాక్యం, ఒకరి కొరకు చేసుకునే ప్రార్ధనా ఇంకా ఆత్మీయ సహవాసం ధనం, హోదా, బంధువులు ఇవ్వలేని అనుభూతులను మిగులుస్తు నీకు ఒక కొత్త అనుభవం కలుగ చేస్తాయి.  బీద లాజారు భిక్షమెత్తుకునే టప్పుడు కుడా సంతోషం గా ఉన్నాడు..... ఈరోజు ఆరధాన దినం, సంఘముగా దేవుని ఆరాదించే రోజు, మందిరపు మేలులతో నింపబడే రోజు... ఒకవేళ నీవు తృప్తి లేని జీవితాన్ని అనుబవిస్తున్నట్టు నీకు అని పిస్తే ఇరోజు తప్పనిసరిగా మందిరానికి వెళ్ళు...... సమస్త మనసులను పరిసోధించ గలిగిన పరమ తండ్రి నీకు సంతృప్తి ని ఇచ్చి నీకు సంతోషము, సమాధానము అనుగ్రహించును గాకా?
 
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి
 

source

మందిరానికి వెళ్ళకుండా వేసే సాతాను తంత్రం




ప్రియా సహోదరి సహోదరుడా, నీ హృదయం లో సాతాను  ఒక చేదు విత్తనం వేసి ఉంటాడు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఇంట్లో కూర్చుని ప్రార్ధన చేసుకున్న దేవుడు వింటాడు అని.  ఆలా ఎందుకు నీకు వాడు చెప్పాడో తెలుసా నిన్ను అసలు విషయం లో నుండి బయటకు లాగడానికి.  ఇంట్లో కూర్చుని ప్రార్ధించిన కొన్నాళ్ళకు మరల నీ దగ్గరకు వచ్చి ఎంత ప్రార్ధన చేస్తున్నావు , ఎంత భక్తి చేస్తున్నావు మరి నీ ప్రార్ధన దేవుడు వింటున్నాడా ? ప్రతిఫలం దక్కిందా? నీవు కోరుకున్నది నీకు దొరికిందా? అంటాడు. అప్పుడు అని పిస్తుంది నిజమే ఎంత ప్రార్ధన చేసినా  మారడం లేదు, ఎందుకొచ్చిన దేవుడు అని చేసే ప్రార్థనకు కూడా దూరం అయిపోతావ్. ఆల నిన్ను మెల్లగా లోకం లోకి, లోక అసలలోకి, లాగి తన పంజాలో నిన్ను చిత్తుచేసి చిత్తూ కాంగీతం ల మార్చేస్తాడు. అసలు వాడు మొదటి ప్రయాతం ఎందుకు చేస్తాడో తెలుసా వాక్యం ఒక మాట ఉంది. అది నీవు చదివి ఉండవు. కానీ మన శత్రువు అది చదివి ధ్యానం చేసి ఆ వాగ్దానమునకు నిన్ను దూరం చేస్తున్నాడు. 
కీర్తనలు18:6 Ps నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్ధన చేసితిని , అయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్ధన నంగీకరించెను. ఈ వచనం రెండు మూడు సార్లు చదువు నీకే అర్ధం అవుతుంది. సాతాను ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అని నీకు ఎందుకు చెప్పాడో.నీవు మందిరానికి వెళ్తే ప్రార్ధన ఆలకించే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడేమో, అది నీవు పొందుకుంటే బలపడిపోతావేమో అని నిన్ను వెళ్లనివ్వడం లేదు. చదవడానికి చిన్నపిల్లల స్టోరీ లా ఉన్న ఇది వాక్య సత్యం.   అర్ధం అయితే బయలు దేరు ఈరోజు పరిశుద్ధ ఆరాధన దినం. ప్రభువు నీ ప్రార్ధన తన ఆలయంలో విని ప్రతిఫలం ఇచ్చును గాక!

షలొమ్. 
 
మీ కొరకు ప్రార్ధించే
 
అపోస్తులు నెల్లి నాని బాబు

మందిరానికి ఎందుకేల్లాలి?





ఒక సహోదరుడు న్యూస్ పేపర్ వారికి ఒక లేఖ వ్రాసాడు. అందులో తన ఆవేదనను వెళ్లగక్కుతూ " నేను 30 సంవత్సరాలుగా ఆరాధనకు మందిరానికి వెళ్తున్నాను, 3 వేల ప్రసంగాలు వినివుంటాను, కాని అందులో ఒక్క ప్రసంగం కూడా గుర్తు లేదు. నీను ఇప్పటివరకు సమయమంతా వ్రుదాపరచుకున్నాను, పాస్టర్ గారు తన సమయాన్ని కుడా ప్రసంగాలు సిద్ధపడటం లోను, ప్రసంగాలు చేయడానికి సమయాన్ని వృధా పరచుకుంటున్నారు. అందువల్ల మందిరానికి వెళ్ళడం ప్రయోజన కరం కాదు" అని వ్రాసాడు.  దానికి పత్రిక సంపాదకుడు తిరిగి ఒక ఉత్తరం వ్రాసాడు. నాకు వివాహం అయ్యి 30 సంవత్సరాలు అయ్యింది. నా భార్య నాకు ఇప్పటివరకు ౩౦ వేల పర్యాయాలు వంట చేసి పెట్టింది. కాని అందులో ఏవొక్కటి కూడా నేను ఇప్పుడు చెప్పలేను. కాని ఇరోజు నేను ఇలా ఆరోగ్యంగా, నా పని ని నేను చేసుకే శక్తీ కలిగి  ఉన్నాను అంటే తను నాకోసం చేసి పెట్టిన ఆహారమే కారణం. ఆ ఆహారం లేక పోతే నేను ఇరోజు ఉండే వాడిని కాదు, శారీరకంగా మరణించి ఉండేవాడిని. అని వ్రాస్తు  అలాగే నేను ప్రతి వారం వాక్యం వినక పోయిన యెడల నేను ఈరోజు ఆత్మీయంగా మరణించి ఉండేవాడిని. నీవు కుడా... అని తిరిగి జాబు పంపాడట.
అందుకే పరిశుద్ధాత్ముడు మన కొరకు ఒక వాక్యాన్ని వ్రాయించి ఉంచాడు. హెబ్రీ 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినోకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చుపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని నొకడు పురికోల్పవలేనని అలోచింతము. కొందరు మానెయ్యడం వలన ఆత్మీయ ఆహారం లేక ఆత్మీయ మరణం పొందుతున్నారు, దేవునికి, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. మీరైతే అలా కాక అన్నింటిలోను సంపుర్ణులు గా ఉండి, ఆత్మీయ ఆహారమును భుజిస్తూ ఆత్మీయ శక్తీ మంతులు అగుదురు గాక!

షలోమ్

మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు 



మందిరానికి ఎలా వెళ్ళాలి?







ఈరోజు మందిరానికి వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారా? చాల మంచి పని చేస్తున్నారు. అయితే మందిరానికి ఎలా వెళ్ళాలి అనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు నిలిచి ఉండు స్థలమునకు మనం వెళ్తున్నాము. ఇశ్రాయేలియులు ఐగుప్తు నుండి కానా యాత్రలో సైన్యములకు అధిపతి యగు యెహోవా వారితో ఉండుటకు ఒక పర్ణశాల కట్టమని మోషే కు ప్రభువు వారు సుసించారు. అయితే పర్ణశాల చుట్టూ ప్రాకారము తెరలతో కట్టబడింది. దానికి తూర్పుగా ప్రవేశ ద్వారము ఉంచబడింది. లోపలి వెళ్ళే ప్రవేశ ద్వారము కూడా వ్రేలాడుతున్న తెరలతో ఉంది. అయితే ద్వారానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమీలేవు కాని వ్రేలాడుతున్న తెరల గుండానే లోపలి వెళ్ళాలి. అయితే అలా వెళ్ళాలి అంటే ప్రతివారు వ్రేలాడుతున్న తెరను వంగుని తెరను లేపి వంగి వెళ్ళవలసి ఉండేది. అదే విధానం అందరికి, చిన్న, పెద్ద, ధనిక, పేద, బేధం లేదు. ఈరోజు నీవు వెళ్ళేది అయన నిలఛి ఉండే స్థలానికే, నీవు ధనికుడవు అయివుండవచ్చు, బిద వాడవు అయివుండవచ్చు, ఉద్యోగస్తుడవు అయివుండవచ్చు, నీవు ఎవరివైన పర్ణశాలలో దేవుని కలచుటకు దేవుడు నిర్ణయించిన మాదిరి దీనత్వం కలిగి, నీవు నిలిచి ఉండే స్థలము సర్వసృష్టి కథ నిలిచి ఉండే స్థలమని, ఆయన నీన్ను సృజించిన వాడని, నీకంటే అధికుడని, బలవంతుడని గమనించి జీవిస్తే నీకు దివేనకరముగా ఉంటుంది. సోలోమోను అంటాడు " నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రతగా చూచుకొనుము ప్రసంగి 5:1 "  అయన తన  సన్నిధిలో దీనులను లేవనేత్తువాడు, గర్విష్టులను అనగ ద్రొక్కు వాడు. మోషే దినత్వాన్ని కలిగి సాత్వికుడై ఉన్నాడు గనుకనే దేవుని చూడగలిగాడు. నీవును అటువంటి మనసు కలిగి దీవింప బడుధువు గాక!


 షలోమ్
మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు 


ఎమీ వింటున్నావు?



ఒక రోజుఇద్దరు వృద్ధులు మాట్లాడుకుంటున్నారు. మందిరానికి వెళ్ళడం అనవసరం పాస్టర్ గారు అసలు వాక్యం సరిగా చెప్పడం లేదు, సమయమంత వృధ అవుతుంది అని ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. అయితే ఇంతలో మద్యలో వీరి మాటలు వింటున్న ఒక యోవనస్తుడు కలుగ చేసుకుని " అసలు మందిరానికి వెళ్లి దేవుని మాటలు వినడం మానేసి పాస్టర్ గారి మాటలు ఎందుకు వింటున్నారు" అన్నాడు అంట. మందిరం లో సేవకుడు మాట్లాడే మాట తనదిగా కాకుండా దేవుని నుండి వచ్చింది అని వింటే అందులో నీకు ఉపయోగకరమైన మాటలు, ఆత్మీయ అభివృద్ధికి శ్రేష్టమైన మాటలు, నీకు వినపడతాయి. సముయేలు, ఏలి మందిరంలో పడుకుని ఉన్నారు. సముయేలు దేవుని స్వరమును వినగాలిగాడు. మరి నీవు ఏలి స్వరమును కాదు దేవుని స్వరమును వినుటకు సిద్ధముగా ఉండు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని స్వరమును నీవు విందువు గాక. అది నీకు జీవహరముగా ఉందును గాక.,,

షలోమ్

మీ కొరకు ప్రార్ధించే.
అపోస్తులు నాని బాబు నెల్లి


source

జీవజల నది






యేహెజ్కేలు 47 వ అధ్యాయం లో ఒక నది ఉన్నది. ఆ నది ప్రవహించే చోటల్ల 4 విషయాలు జరుగుతున్నాయి. మొదటిది జీవం కలుగుతుంది, రెండవది ఆహారము మూడవది ఆరోగ్యము నాల్గవది ఆశీర్వాదం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ అవసరమే కదా! అయితే ఆ నది ఎక్కడి నుండి ప్రవహిస్తుందో తెలుసా మొదటి వచనం లో చదివితే అది మందిరపు గవిని నుండి ప్రవహిస్తున్నట్లు తెలుస్తుంది. నీకు పై ఆసిర్వధాలు కావాలంటే మందిరమునుండి ప్రవహించే జీవ వాక్యమును నీ జీవితం లో ప్రవహించనివ్వాలి. సమరయ స్త్రీ ఆ నీటిని ఆస్వాదించింది కాబట్టి రోత జీవితం మారి  గొప్ప సాక్తిగా మారింది. మరి నీవు మందిరానికి వెళ్తావా? వెళ్లి దీవెనలు పొంధగాలవా? అయితే ఇంకెందుకు ఆలస్యం... ప్రభువు మందిరం లోని పైన ఉన్న దివేనలతో నింపును గాక! 

షలోమ్

మీకోరకు ప్రార్ధించే
              


source