మరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మరణం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మానవునికి ధాన్యపు గింజ నేర్పే బోధ

 

 


మన్నైన మానవ శరీరం మరల మట్టి కి మారుతుంది. మానవుడు మట్టి నుండి చెయ్యబడ్డాడు కాబట్టి మరల మన్నుకు మారుతున్నాడు. ఇది సత్యం. అయితే పుట్టిన నాటి నుండి మరణించే వరకు మానవునికి కొంత ఆయుష్షు దేవుడు ఇస్తున్నాడు. కొంత మందికి దీర్గ ఆయుష్షు, కొంత మందికి అల్ప అయుస్శును ఇస్తారు. కాని ప్రతి మనిషి ఈ భూమి మీద నిర్వర్తించవలసిన కర్తవ్యం ఒకటి ఉంటుంది. అది పూర్తి చేస్తున్నామా ? అసలు నీ జన్మకు సార్ధకత ఉందా?

 

రైతు పండించే ప్రతి ధాన్యపు గింజ మట్టినుండి పుట్టి మరల మట్టికే చేరుతుంది. కాని అది పుట్టిన నాటి నుండి మట్టికి చేరే లోపు రైతుకు ఆదాయం, ప్రతి మనిషికి ఆహారం, ఆరోగ్యం, వ్యాపార వేత్తకు లాబాన్ని, ఇలా చెప్పుకు పోతే అది మరల మన్నుకు చేరే సరికి ఎన్నో రూపాలలో సమస్త మానవాళికి ఉపయోగపడి తిరిగి మన్నుకు చేరుతుంది. ఆహారం గా మారిన ధాన్యం శరీరం లో ఆరోగ్యానికి అవసరమయిన రక్తాన్ని, ప్రోటిన్స్ ఇంకా అందించి కరిగి మలినమై మట్టికి చేరుతుంది. కొంత ధాన్యం మరల పురుత్పత్తి చేసి మరింత ధాన్యం కొరకు విత్తనం గా మారుతుంది. అల్ప ఆయుష్షు ఉన్న ధాన్యం పక్షులకు ఆహరం గా మారుతుంది, కొంత ధాన్యం చేలోనే రాలి మరల పెరిగి పశువులకు ఆహారం అవుతుంది.

 

అయితే మానవునిగా పుట్టిన నీవు మరనించే లోపు ఎంత మందికి ఉపయోగ కరంగా ఉన్నావు, నీ వలన దేవుని ఉద్దేశ్యం నెరవేరిందా? నీ ఆయుష్షు ఎంతో నీకు తెలియదు కదా మరి ఎందుకు సమయాన్ని పాడు చేస్తూ రేపు రేపు చేద్దాం అని వాయదాలు వేస్తావు. నీ జన్మ కు సార్ధకత చేసుకో....... సమయాన్ని వృద్ధా పరచకు.....

 

దేవుడు నిన్ను ప్రయోజన కరునిగా మార్చును గాక....

 

మీ సహోదరుడు

అపోస్తులు నెల్లి నాని బాబు


దీప స్తంభం

 




ఒక వేసవి కాలములో పిల్లలకు సెలవు రోజుల్లో, మేము మా పిల్లలతో అంతర్వేది బీచ్ కు వెళ్ళాము. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. దానిని చూడటానికి వెళ్ళాము, పిల్లలు దాని గురించి చెప్పండి నాన్న అని అడిగారు. అప్పుడు దాని గురించి చెప్పడం మొదలు పెట్టాను. సముద్రం లో ప్రయాణం చేసే ఓడలుకి, చేపల వేటకు వెళ్లే మత్యకారులకు ఒడ్డుకు చేరడానికి ఒక దిక్షుచి అని చెప్పాను. ఎందుకలా వాళ్లకు తెలియదా? అన్నారు. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం కణపడదు, అలాంటప్పుడు ఈ దీపం వెలుగు వారికి తీరం ఎటువైపు ఉందో చూపిస్తుంది అని చెప్పాను. నిజమే కదా, సువిశాలమైన సముద్రం లో ఓడలు, పడవలు, నావలు ఒడ్డుకు నడిపించే దీపం, వెలుగు తీరాన్ని ఉండాలి. అప్పుడే తీరానికి చెరగలరు.

అలాగే యేసు వారు మనకు దీపం, వెలుగై ఉండి, మనకంటే ముందుగా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి, తీరానికి చేరి మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ జీవన సముద్రం లో మన జీవిత పడవ ప్రయాణం వెలుగై, దీప స్తంభం అయ్యి ఉన్న యేసు వైపు చూస్తూ నడిస్తే మనం కూడా యేసు వారి వలె పాపం, మరణం, లోకం జయించ గలము. నిత్య తీరమయిన పరముకు చెరగలం. మరణమును, నరకనును తప్పించు కొగలము.

ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక!


రేమిడిసివర్ ఇంజక్షన్



ప్రస్తుతం బాగా వినపడుతున్న మాట రిమిడిసేవిర్. కొవిడ్ వచ్చిన వారికి ఇచ్చే ఇంజక్షన్. ఇధి ఒకోసారి లక్షలలో పలుకుతుంది. ఎందుకంటే అది లోపల ఉన్న వైరస్ పెరగకుండా ఆపుతుంది. అయితే కొన్ని కేసులలో ఆ ఇంజిక్షన్ ఇచ్చినా చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే వైరస్ వంటి నిండా వ్యాప్తి చెందిన తరువాత దానిని వాడుతున్నారు. దానిని వైరస్ సోకిన వెంటనే ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దాని పని సక్రమంగా చెయ్యగలిగుతుంది.

అలాగే, చాలా మంది చనిపోయిన వారి పేరున దాన ధర్మాలు చేస్తారు. మనిషి చనిపోయిన తరువాత ఆ వ్యక్తి పేరున ఏమి చేసినా తనకు ప్రతిఫలం దక్కదు. కానీ అది చేసే వ్యక్తి అకౌంట్ లో ఉంటాయి. ఒకటి అలోసించండి,  ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోయిన తరువాత పరలోకం వెళ్తాడు, తీర్పు ఉంటుంది. అక్కడ దేవుడు బహుమానాలు ఇస్తారు. కానీ అవి ఎవరికి, ఎలా ఇస్తారు, భూమి మీద ఒక మనిషి చేసిన క్రియలను ఆధారం చేసుకుని ఇస్తారు. అంటే మనం రేమిడిసిర్ ఇంజక్షన్ వాడినట్లే. కాబట్టి బ్రతికి వుండగానే నీవు సంపాదించిన దాంట్లో కొంత అయిన అవసరతలో ఉన్నవాడికి దానం చెయ్యండి.   నీవు చనిపోయాక నీ కొడుకు ఎంత దానం చేసిన నీకు ప్రయోజనం ఉండదు. నీవు చేసి నీ జాబితాలో వేసుకో…. ఇక్కడ ధనాన్ని పరలోక ధనం గా మార్చుకోడానికి ఇదే మంచి సమయం. వదులుకోకుండా వాడుకో….

2కోరింథీయులకు 5: 10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

మరణం తరువాత మనతో ఏమీ వస్తుందో తెలుసా?






అందరం అనుకుంటూ ఉంటాం మనం ఎంత సంపాదించినా చనిపోయాక అన్నింటిని వదిలి వెళ్లిపోవాలి అని. అందుకు ఎందుకు సంపాదించుకోవడం అనుకుని నిరాశ పడుతుంటాం. కాని వాక్యం చెపుతున్నది ఏంటి అంటే. నిన్ను ఇలోకం లో ఉన్నవాటిని సంపాదించు కోవద్దు అని ఏనాడూ చెప్పలేదు. భాగ్యం సంపాదించు కొనుటకై మీకు సామార్ధ్యము కలుగ జేయువాడు ఆయనే ( ద్వితి 8:18 ) అని వాక్యం చెపుతుంది. ఇలోకం లో మనలను ధనవంతులుగా చూడాలని మన తండ్రి కోరిక. అయితే మరో మాటలో " మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు ( మత్తయి 6:24 ) " అని, ఇదియు గాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దురుట సులభమని మీతో చెప్పుచున్నాను ( మత్తయి 19:24 ) అని ధనముకు వ్యతిరేకముగా మాట్లాడినట్లు మనకు కనపడుతుంది. భాగ్యం ఇచ్చి పరలోకానికి దూరం చెయ్యడం దేవుని ప్రణాలికా? ఇక్కడ బాగా అర్ధం చేసుకోగలిగితే నీకు భాగ్యం యిస్తారు అయన కాని నీవు దానికి బానిసావు కాకుండా అదే నీకు భానిసగా ఉండాలి అని అయన ఉద్దేశ్యం. ఒకవేళ నీవే దానికి బానిసవు అయితే నీవు పరలోకానికి వెళ్ళలేవు అని అయన హెచ్చరిక. ఎలా? చనిపోయినప్పుడు ఇదేమి రాదు కాదా అనుకుంటున్నాము మనం. కాని దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం తో నీవు ఏమేమి చేసావో అవన్నీ, నీ క్రియలు నీ వెంట వస్తాయి అని వాక్యం చెప్పుతుంది.( ప్రకటన 14:13 ). ఉదాహరనకు ఫోన్ కొనుకోడానికి దేవుడు సమార్ధ్యాన్ని ఇచ్చారు, నీవు చని పోయాక ఫోన్ ఇక్కడే ఉండిపోతుంది, కాని ఫోన్ తో నీవేమి చేసావో అది వస్తుంది. అందుకే జాగ్రత్త నిధగ్గరకు ధనం వచ్చినప్పుడు దాన్ని నీ బానిసగా చేసుకో, అది చేయ్యమన్నట్టు నీవు చెయ్యకు.

ప్రభువు నీకు విస్తారమైన ధన సమృద్ధిని అనుగ్రహించును గాక!

మీ సహోదరుడు

అపోస్తులు నాని బాబు నెల్లి