మందిరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మందిరం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

మందిరానికి వెళ్తే ఏమి దొరుకుతుంది.?



ప్రియ సహోదరి సహోదరుడ,
 
మానవుడు తృప్తి లేని జీవి. ఎంత చేసిన, ఎంత అనుభవించిన, ఎంత సంపాదించినా, ఎన్ని సాధించినా, ఇంకా ఏదో కవాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో సంపాదించాలి అని తాపత్రయ పడుతూ సమదానం లేకుండా, తృప్తి లేకుండా జీవితాన్ని కొనసిగించేస్తున్నాడు. తృప్తి లేకుండా సమాధానం ఉండదు, సమాధానం లేకుండా సంతోషం ఉండదు, సంతోషం లేకుండా ఎన్ని ఉంటె ఉపయోగమేంటి? ఎన్ని సాధిస్తే మాత్రం ఏంటి? తృప్తి అనేది మనసులోనుండి కలిగేది. ఆత్మలో కలిగేది. అందుకే సర్వశక్తి కలిగిన దేవుని ఆలయముని గూర్చి దావీదు
  ఎలా పాడుతున్నాడు నీ ఆవరణములలో నివసించునట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు నీ పరిశుద్ధాలయముచేత నీ మందిరములోని మేలుచేత  మేము తృప్తిపొందెదముకీర్తనలు 65:4 Psalms .  అందుకే క్రైస్తవుడు ఏమి ఉన్న లేకున్నా సంతోషం గా, ఆనందం గా బ్రతుగ గలుగుతున్నాడు. సంఘముగా చేసే స్తుతి ఆరాధన, దైవ సేవకుడు అందించే దైవ ఉపిరి అయిన వాక్యం, ఒకరి కొరకు చేసుకునే ప్రార్ధనా ఇంకా ఆత్మీయ సహవాసం ధనం, హోదా, బంధువులు ఇవ్వలేని అనుభూతులను మిగులుస్తు నీకు ఒక కొత్త అనుభవం కలుగ చేస్తాయి.  బీద లాజారు భిక్షమెత్తుకునే టప్పుడు కుడా సంతోషం గా ఉన్నాడు..... ఈరోజు ఆరధాన దినం, సంఘముగా దేవుని ఆరాదించే రోజు, మందిరపు మేలులతో నింపబడే రోజు... ఒకవేళ నీవు తృప్తి లేని జీవితాన్ని అనుబవిస్తున్నట్టు నీకు అని పిస్తే ఇరోజు తప్పనిసరిగా మందిరానికి వెళ్ళు...... సమస్త మనసులను పరిసోధించ గలిగిన పరమ తండ్రి నీకు సంతృప్తి ని ఇచ్చి నీకు సంతోషము, సమాధానము అనుగ్రహించును గాకా?
 
షలోం.
మీ కొరకు ప్రార్ధించే
అపొస్తులు నాని బాబు నెల్లి
 

source

మందిరానికి వెళ్ళకుండా వేసే సాతాను తంత్రం




ప్రియా సహోదరి సహోదరుడా, నీ హృదయం లో సాతాను  ఒక చేదు విత్తనం వేసి ఉంటాడు. ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఇంట్లో కూర్చుని ప్రార్ధన చేసుకున్న దేవుడు వింటాడు అని.  ఆలా ఎందుకు నీకు వాడు చెప్పాడో తెలుసా నిన్ను అసలు విషయం లో నుండి బయటకు లాగడానికి.  ఇంట్లో కూర్చుని ప్రార్ధించిన కొన్నాళ్ళకు మరల నీ దగ్గరకు వచ్చి ఎంత ప్రార్ధన చేస్తున్నావు , ఎంత భక్తి చేస్తున్నావు మరి నీ ప్రార్ధన దేవుడు వింటున్నాడా ? ప్రతిఫలం దక్కిందా? నీవు కోరుకున్నది నీకు దొరికిందా? అంటాడు. అప్పుడు అని పిస్తుంది నిజమే ఎంత ప్రార్ధన చేసినా  మారడం లేదు, ఎందుకొచ్చిన దేవుడు అని చేసే ప్రార్థనకు కూడా దూరం అయిపోతావ్. ఆల నిన్ను మెల్లగా లోకం లోకి, లోక అసలలోకి, లాగి తన పంజాలో నిన్ను చిత్తుచేసి చిత్తూ కాంగీతం ల మార్చేస్తాడు. అసలు వాడు మొదటి ప్రయాతం ఎందుకు చేస్తాడో తెలుసా వాక్యం ఒక మాట ఉంది. అది నీవు చదివి ఉండవు. కానీ మన శత్రువు అది చదివి ధ్యానం చేసి ఆ వాగ్దానమునకు నిన్ను దూరం చేస్తున్నాడు. 
కీర్తనలు18:6 Ps నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవునికి ప్రార్ధన చేసితిని , అయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్ధన నంగీకరించెను. ఈ వచనం రెండు మూడు సార్లు చదువు నీకే అర్ధం అవుతుంది. సాతాను ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అని నీకు ఎందుకు చెప్పాడో.నీవు మందిరానికి వెళ్తే ప్రార్ధన ఆలకించే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడేమో, అది నీవు పొందుకుంటే బలపడిపోతావేమో అని నిన్ను వెళ్లనివ్వడం లేదు. చదవడానికి చిన్నపిల్లల స్టోరీ లా ఉన్న ఇది వాక్య సత్యం.   అర్ధం అయితే బయలు దేరు ఈరోజు పరిశుద్ధ ఆరాధన దినం. ప్రభువు నీ ప్రార్ధన తన ఆలయంలో విని ప్రతిఫలం ఇచ్చును గాక!

షలొమ్. 
 
మీ కొరకు ప్రార్ధించే
 
అపోస్తులు నెల్లి నాని బాబు

మందిరానికి ఎందుకేల్లాలి?





ఒక సహోదరుడు న్యూస్ పేపర్ వారికి ఒక లేఖ వ్రాసాడు. అందులో తన ఆవేదనను వెళ్లగక్కుతూ " నేను 30 సంవత్సరాలుగా ఆరాధనకు మందిరానికి వెళ్తున్నాను, 3 వేల ప్రసంగాలు వినివుంటాను, కాని అందులో ఒక్క ప్రసంగం కూడా గుర్తు లేదు. నీను ఇప్పటివరకు సమయమంతా వ్రుదాపరచుకున్నాను, పాస్టర్ గారు తన సమయాన్ని కుడా ప్రసంగాలు సిద్ధపడటం లోను, ప్రసంగాలు చేయడానికి సమయాన్ని వృధా పరచుకుంటున్నారు. అందువల్ల మందిరానికి వెళ్ళడం ప్రయోజన కరం కాదు" అని వ్రాసాడు.  దానికి పత్రిక సంపాదకుడు తిరిగి ఒక ఉత్తరం వ్రాసాడు. నాకు వివాహం అయ్యి 30 సంవత్సరాలు అయ్యింది. నా భార్య నాకు ఇప్పటివరకు ౩౦ వేల పర్యాయాలు వంట చేసి పెట్టింది. కాని అందులో ఏవొక్కటి కూడా నేను ఇప్పుడు చెప్పలేను. కాని ఇరోజు నేను ఇలా ఆరోగ్యంగా, నా పని ని నేను చేసుకే శక్తీ కలిగి  ఉన్నాను అంటే తను నాకోసం చేసి పెట్టిన ఆహారమే కారణం. ఆ ఆహారం లేక పోతే నేను ఇరోజు ఉండే వాడిని కాదు, శారీరకంగా మరణించి ఉండేవాడిని. అని వ్రాస్తు  అలాగే నేను ప్రతి వారం వాక్యం వినక పోయిన యెడల నేను ఈరోజు ఆత్మీయంగా మరణించి ఉండేవాడిని. నీవు కుడా... అని తిరిగి జాబు పంపాడట.
అందుకే పరిశుద్ధాత్ముడు మన కొరకు ఒక వాక్యాన్ని వ్రాయించి ఉంచాడు. హెబ్రీ 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినోకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చుపుటకును సత్కార్యములు చేయుటకును ఒకని నొకడు పురికోల్పవలేనని అలోచింతము. కొందరు మానెయ్యడం వలన ఆత్మీయ ఆహారం లేక ఆత్మీయ మరణం పొందుతున్నారు, దేవునికి, దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. మీరైతే అలా కాక అన్నింటిలోను సంపుర్ణులు గా ఉండి, ఆత్మీయ ఆహారమును భుజిస్తూ ఆత్మీయ శక్తీ మంతులు అగుదురు గాక!

షలోమ్

మీకోరకు ప్రార్ధించే           
అపోస్తులు నెల్లి  నాని బాబు 



మందిరానికి ఎలా వెళ్ళాలి?







ఈరోజు మందిరానికి వెళ్ళడానికి సిద్ధ పడుతున్నారా? చాల మంచి పని చేస్తున్నారు. అయితే మందిరానికి ఎలా వెళ్ళాలి అనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. దేవుడు నిలిచి ఉండు స్థలమునకు మనం వెళ్తున్నాము. ఇశ్రాయేలియులు ఐగుప్తు నుండి కానా యాత్రలో సైన్యములకు అధిపతి యగు యెహోవా వారితో ఉండుటకు ఒక పర్ణశాల కట్టమని మోషే కు ప్రభువు వారు సుసించారు. అయితే పర్ణశాల చుట్టూ ప్రాకారము తెరలతో కట్టబడింది. దానికి తూర్పుగా ప్రవేశ ద్వారము ఉంచబడింది. లోపలి వెళ్ళే ప్రవేశ ద్వారము కూడా వ్రేలాడుతున్న తెరలతో ఉంది. అయితే ద్వారానికి ప్రత్యేక ఏర్పాట్లు ఏమీలేవు కాని వ్రేలాడుతున్న తెరల గుండానే లోపలి వెళ్ళాలి. అయితే అలా వెళ్ళాలి అంటే ప్రతివారు వ్రేలాడుతున్న తెరను వంగుని తెరను లేపి వంగి వెళ్ళవలసి ఉండేది. అదే విధానం అందరికి, చిన్న, పెద్ద, ధనిక, పేద, బేధం లేదు. ఈరోజు నీవు వెళ్ళేది అయన నిలఛి ఉండే స్థలానికే, నీవు ధనికుడవు అయివుండవచ్చు, బిద వాడవు అయివుండవచ్చు, ఉద్యోగస్తుడవు అయివుండవచ్చు, నీవు ఎవరివైన పర్ణశాలలో దేవుని కలచుటకు దేవుడు నిర్ణయించిన మాదిరి దీనత్వం కలిగి, నీవు నిలిచి ఉండే స్థలము సర్వసృష్టి కథ నిలిచి ఉండే స్థలమని, ఆయన నీన్ను సృజించిన వాడని, నీకంటే అధికుడని, బలవంతుడని గమనించి జీవిస్తే నీకు దివేనకరముగా ఉంటుంది. సోలోమోను అంటాడు " నీవు దేవుని మందిరానికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రతగా చూచుకొనుము ప్రసంగి 5:1 "  అయన తన  సన్నిధిలో దీనులను లేవనేత్తువాడు, గర్విష్టులను అనగ ద్రొక్కు వాడు. మోషే దినత్వాన్ని కలిగి సాత్వికుడై ఉన్నాడు గనుకనే దేవుని చూడగలిగాడు. నీవును అటువంటి మనసు కలిగి దీవింప బడుధువు గాక!


 షలోమ్
మీకోరకు ప్రార్ధించే               
అపోస్తులు నెల్లి  నాని బాబు 


జీవజల నది






యేహెజ్కేలు 47 వ అధ్యాయం లో ఒక నది ఉన్నది. ఆ నది ప్రవహించే చోటల్ల 4 విషయాలు జరుగుతున్నాయి. మొదటిది జీవం కలుగుతుంది, రెండవది ఆహారము మూడవది ఆరోగ్యము నాల్గవది ఆశీర్వాదం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ అవసరమే కదా! అయితే ఆ నది ఎక్కడి నుండి ప్రవహిస్తుందో తెలుసా మొదటి వచనం లో చదివితే అది మందిరపు గవిని నుండి ప్రవహిస్తున్నట్లు తెలుస్తుంది. నీకు పై ఆసిర్వధాలు కావాలంటే మందిరమునుండి ప్రవహించే జీవ వాక్యమును నీ జీవితం లో ప్రవహించనివ్వాలి. సమరయ స్త్రీ ఆ నీటిని ఆస్వాదించింది కాబట్టి రోత జీవితం మారి  గొప్ప సాక్తిగా మారింది. మరి నీవు మందిరానికి వెళ్తావా? వెళ్లి దీవెనలు పొంధగాలవా? అయితే ఇంకెందుకు ఆలస్యం... ప్రభువు మందిరం లోని పైన ఉన్న దివేనలతో నింపును గాక! 

షలోమ్

మీకోరకు ప్రార్ధించే
              


source