స్తుతి ప్రార్ధన శక్తి నిరూపణ

ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.

ఒక యదార్ధ విషయాన్ని  మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే  20%  పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది.  CBN NEWS ప్రకారం  2017  లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు  2016  లో మొత్తం  జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది.  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు  ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.

మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్  ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో,  ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన  హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.

ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.
ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.

పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం  ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి  స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి  నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.

ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు  మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె  ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు  జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి  ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే  ఒక రోజు లేక  వ్యక్తి గతం గా అయితే  ఒక గంట / అర గంట  సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.

ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.

ప్రభువు సేవలో,
అపొస్తులు నాని బాబు నెల్లి,
స్థాపితులు,

ఇండియా ప్రేయర్ లీగ్,




దీప స్తంభం

 




ఒక వేసవి కాలములో పిల్లలకు సెలవు రోజుల్లో, మేము మా పిల్లలతో అంతర్వేది బీచ్ కు వెళ్ళాము. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. దానిని చూడటానికి వెళ్ళాము, పిల్లలు దాని గురించి చెప్పండి నాన్న అని అడిగారు. అప్పుడు దాని గురించి చెప్పడం మొదలు పెట్టాను. సముద్రం లో ప్రయాణం చేసే ఓడలుకి, చేపల వేటకు వెళ్లే మత్యకారులకు ఒడ్డుకు చేరడానికి ఒక దిక్షుచి అని చెప్పాను. ఎందుకలా వాళ్లకు తెలియదా? అన్నారు. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం కణపడదు, అలాంటప్పుడు ఈ దీపం వెలుగు వారికి తీరం ఎటువైపు ఉందో చూపిస్తుంది అని చెప్పాను. నిజమే కదా, సువిశాలమైన సముద్రం లో ఓడలు, పడవలు, నావలు ఒడ్డుకు నడిపించే దీపం, వెలుగు తీరాన్ని ఉండాలి. అప్పుడే తీరానికి చెరగలరు.

అలాగే యేసు వారు మనకు దీపం, వెలుగై ఉండి, మనకంటే ముందుగా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి, తీరానికి చేరి మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ జీవన సముద్రం లో మన జీవిత పడవ ప్రయాణం వెలుగై, దీప స్తంభం అయ్యి ఉన్న యేసు వైపు చూస్తూ నడిస్తే మనం కూడా యేసు వారి వలె పాపం, మరణం, లోకం జయించ గలము. నిత్య తీరమయిన పరముకు చెరగలం. మరణమును, నరకనును తప్పించు కొగలము.

ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక!


దేవుని అద్భుతం

 



ఒకసారి ఒక వృద్ధుడు దేవుడు తనకు ఇచ్చిన పిలుపు, బారాన్ని బట్టి రైలు లో సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి కంపార్ట్మెంట్ లోకి వెళ్లి నిలువబడి యేసు రక్షకుడు, మన పాపముల కొరకు చనిపోయి, తిరిగి లేచారు, ఆయన మరల వస్తున్నారు, మారుమనస్సు పొందండిఅంటూ గట్టిగ అరుస్తూ చెపుతున్నాడు. ఇంతలో అక్కడ ఉన ఒకావిడ అతని మీద కేకలు వేస్తూ, నోరుమూయి, నీ చెప్పే యేసు అసలు లేరు అని గట్టిగ అరిచింది. ఆ ముసలాయన ఏమి చెయ్యలేని పరిస్థితిలో, భయపడి కూర్చుండి పోయాడు.

 

గానీ దేవుడు తనను బలవంతం చేస్తున్నారు, సువార్త ప్రకటించడం అపవద్దు అని. దేవునికి భయపడి, లోబడి మరల నిలువబడి వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడు. మరల ఆ స్త్రీ తనమీద కోపం తో విరుచుకు పడి, దాడి చెయ్యడం మొదలు పెట్టింది. ఇంతలో తనకుడ కూడా వచ్చిన తన కుమారుడు గట్టిగా అమ్మ, తనను ఏమీ చెయ్యొద్దు, అతను దేవుని చేత పంపబడిన వాడుఅని చెప్పాడు అంట.

వెంటనే ఆ స్త్రీ మోకాళ్ళ మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, తన పాపాలను ఒప్పుకుంటూ, యేసు ను అంగీకరించడం మొదలు పెట్టింది.

ఆ వృద్ధుడు ఏమైదీ  అని అడిగితే, “ నా కుమారుడు పుట్టి మూగవాడుఅని ఏడ్చింది.

 

 ప్రియ చదువరి, యేసు నీ జీవితం లో అనేక అద్భుతాలు చేస్తూనే ఉన్నారు గానీ నీ మనసును ప్రభువుకు ఇవ్వలేక పోతున్నావు. ఆయన మరల రాబోతున్నారు, మారుమనస్సు పొంది రక్షణ పొందు. సమయం వుండగానే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు.

ప్రభువు మిమ్మును దీవించి, అంగీకరించును గాక!

 


రేమిడిసివర్ ఇంజక్షన్



ప్రస్తుతం బాగా వినపడుతున్న మాట రిమిడిసేవిర్. కొవిడ్ వచ్చిన వారికి ఇచ్చే ఇంజక్షన్. ఇధి ఒకోసారి లక్షలలో పలుకుతుంది. ఎందుకంటే అది లోపల ఉన్న వైరస్ పెరగకుండా ఆపుతుంది. అయితే కొన్ని కేసులలో ఆ ఇంజిక్షన్ ఇచ్చినా చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే వైరస్ వంటి నిండా వ్యాప్తి చెందిన తరువాత దానిని వాడుతున్నారు. దానిని వైరస్ సోకిన వెంటనే ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దాని పని సక్రమంగా చెయ్యగలిగుతుంది.

అలాగే, చాలా మంది చనిపోయిన వారి పేరున దాన ధర్మాలు చేస్తారు. మనిషి చనిపోయిన తరువాత ఆ వ్యక్తి పేరున ఏమి చేసినా తనకు ప్రతిఫలం దక్కదు. కానీ అది చేసే వ్యక్తి అకౌంట్ లో ఉంటాయి. ఒకటి అలోసించండి,  ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోయిన తరువాత పరలోకం వెళ్తాడు, తీర్పు ఉంటుంది. అక్కడ దేవుడు బహుమానాలు ఇస్తారు. కానీ అవి ఎవరికి, ఎలా ఇస్తారు, భూమి మీద ఒక మనిషి చేసిన క్రియలను ఆధారం చేసుకుని ఇస్తారు. అంటే మనం రేమిడిసిర్ ఇంజక్షన్ వాడినట్లే. కాబట్టి బ్రతికి వుండగానే నీవు సంపాదించిన దాంట్లో కొంత అయిన అవసరతలో ఉన్నవాడికి దానం చెయ్యండి.   నీవు చనిపోయాక నీ కొడుకు ఎంత దానం చేసిన నీకు ప్రయోజనం ఉండదు. నీవు చేసి నీ జాబితాలో వేసుకో…. ఇక్కడ ధనాన్ని పరలోక ధనం గా మార్చుకోడానికి ఇదే మంచి సమయం. వదులుకోకుండా వాడుకో….

2కోరింథీయులకు 5: 10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

శత్రువుల బయమా?


ప్రతి మనిషికి శత్రువు ఉంటాడు, కొంతమంది తెల్లవారితే బూతులు తిడుతూ ఉంటారు ఎదో ఒకదానిని వంక పెట్టుకుని, కొంతమంది బయటకు కనపడకుండా ప్రత్యర్థిని ఎలా దెబ్బ కొట్టాలా అని ప్రయత్నాలు చేస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఎదో రీతిగా ప్రత్యర్థిని పడగొట్టడానికి,మరికొంత మంది చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు.ఒకొక్కసారి వాటిని ఎదుర్కోగల శక్తి ఉంటుంది, ఒకొక్కసారి ఎదుర్కోలేక పతనం కావలసి ఉంటుంది. అనుకోని సమయం లో మెరుపు దాడి చెయ్యొచ్చు, దానికి సిద్ధంగా ఇందాక పోవొచ్చు. ఒకవేళ నీవు అలాంటి శత్రువును కలిగి ఉంటే,నీకు ఒక జరుగుతున్న ఒక విషయాన్ని తెలియ జేస్తాను.

పాలస్తీనా కు ఇశ్రాయేల్ దేశాలకు చాలా భయంకర శతృత్వం ఉందిి. ఇజ్రాయిల్ దేశ శత్రువులు అనుకోని సమయం లలోవారి మీద బాంబులు వేస్తూ ఉండేవారు. కానీ అవి ఇశ్రాయేల్ దేశం మీద పడేవి కావు, కొన్ని సార్లు అవి ప్రయోగించిన వారి మీదే పడుతూ ఉండేవి. శతృవు కు అర్ధం అయ్యింది. ఇశ్రాయేలీయుల దేవుడు వారికి సహాయం చేస్తున్నడు అని. పైన అది వాళ్ళు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్. “ ఇశ్రాయేలీయుల దేవుడు మేము పంపించే రాకెట్ల దారిని మళ్లిస్తున్నారు”.

తన ప్రజలు నిద్రపోతుంటే, బలహీనుడు గా ఉంటే, మెరుపు దాడిలో,దొంగ చాటున, సిద్ధం గా లేని సమయాన శతృవు నుండి తానే కాపాడుకుంటున్నారు. అలాంటి దేవుడు మనకంటే ఎంత బాగుణ్ణు. ఆయన వాళ్లకు మాత్రమే దేవుడు కాదు, ఆయనను అంగీకరించిన ప్రతిఒక్కరికి సర్వసృష్టికి దేవుడే, నీవు అంగీకరిస్తే నీకును ఆయన తన కాపుధల ఇవ్వగలరు.

రండి ఆయన దగ్గరకు యేసు ఒక్కడే మార్గం. యేసును అంగీకరించి దీవించ బడుదుము.
ప్రభువు మిమ్మును దేవించును గాక.

కీర్తనలు 121, హబకుకు 2:9, అపోస్తులూ 10:34-36, ద్వితి 11:12

బెతనియలో క్రైస్త్వవ్యం మార్కు 14 : 3 -10


బెతనియ లో క్రైస్తవ్యం?

బెతనియలోని సిమోను?

 విలువయిన అత్తరు ఎలా ఇవ్వగలిగింది?

దేవుని దృష్టిలో ఆమె తెచ్చిన అత్తరు ఎలా కనిపించింది?

6డిసెంబర్ 2020 ఆదివారం ఆరాధనలో అందించిన వాక్యం లైవ్ ...



పట్టుకున్న దానిని కూడా వదిలేయ్






వర్షా కాలం లో ఒక వ్యక్తి ఏటిగట్టున నడుకుంటూ వెళ్తుండగా కాలు జారి ఏటిగట్టుకు క్రిందన ఉన్న నేల నూతిలో పడిపోసాగాడు, ప్రాణబయంతో అక్కడ చేతికి అందిన ఒక మొక్కను పట్టుకున్నాడు. అయితే కురుస్తున్న వార్షానికి నెల మెత్తన పడి అది కుడా ఒకో వేరు ఒకో వేరు తెగిపోవడం మొదలు పెట్టింది. వేర్లు తెగుతున్న కొలది వాని ప్రాణాలు జారిపోతున్నాయి. ఎంత కేకలు పెట్టిన ఎవ్వరు రావడం లేదు. ఇక ప్రాణ భయంతో ఉండగా దేవుడు గుర్తుకు వచ్చారు, వెంటనే ప్రార్ధన చెయ్యడం మొదలు పెట్టాడు. కాపాడమని అడగడం మొదలు పెట్టాడు. అయితే అది అత్యవసర పరిస్థితి గనుక దేవుని ప్రత్యక్షత దొరికింది. ఏమికావాలని ప్రభువు అడగగా? నన్ను కాపాడు అన్నాడు. నేను నిన్ను కాపాడగలనని నమ్ముతున్నావా? అడిగారు ఆయన, నమ్ముతున్నాను అన్నాడు, నిజంగా నమ్ముతున్నావా? నీవు మాత్రమె కాపడగలవు అన్నాడు. అప్పుడు దేవుడు నా మీద అంత నమ్మకం ఉంటె నీవు పట్టుకున్న చెట్టు వద్దిలేయ్ అన్నారు......

 

నిజమయిన, ధృడ మయిన  నమ్మకం ఉంటె అప్పటివరకు పట్టు కున్నదాన్ని వదిలివేయ గలుగుతాడు? లేక పోతే దేవున్ని వదులుకోవలసి వస్తుంది.

ఈరోజుల్లో కుడా ప్రతి క్రైస్తవుడు కుడా దేవుని మీద నమ్మకం అంటారు కాని లోక సంప్రాదాయాలు( సంస్కృతి కాదు, అది వేరు ), కట్టు బాట్లు, ముహూర్తాలు, ఎదురులు, శకునాలు, తాయిత్తులు, మంత్రాలు, ఎలా చాలా ఉన్నాయి వాటిని వదలడం లేదు, వాళ్లకు తెలియకుండానే దేవున్ని వదులుకుంటున్నారు, కాని దేవునిలోనే ఉన్నాము అనుకుంటున్నారు. దేవుని శక్తి పరిపూర్ణంగా చూడాలి అంటే పరిపుర్ణమయిన నమ్మకం ఆయనమీద పెట్టగలగాలి.  

 

క్రియలు లేని విశ్వాసం మృతము యాకోబు 2: 26

 

మీ కొరకు ప్రార్ధించు

అపోస్తులు నాని బాబు నెల్లి

990882316

క్రమ శిక్షణ


 

దేవుడు నాకు ఇద్దరు బిడ్డలను ఇచ్చారు. వారు దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు అప్పుడప్పుడు నేను వాడే కంప్యుటర్ వాడుతుంటారు. నేను నా లాప్టాప్ కి బ్లుటూత్ కీ బోర్డ్, మౌస్ వాడుతున్నాను. రెండు సంవత్సరాల క్రితం వాళ్లకు ఒక మాట చెప్పాను. ఏంటంటే ఎప్పుడైనా మీరు కంప్యుటర్ వాడటం అయిపోయాక  కీ బోర్డ్ మౌస్ స్విచ్ లు ఆఫ్ చెయ్యండి అని చెప్పాను. నేను అయిన అప్పుడప్పుడు మరచి పోతాను. నేను కంప్యుటర్ ఆన్ చేసి మౌస్, కీ బోర్డ్ పని చెయ్యడం లేదు ఏంటి అనుకుంటాను. కాని అంతకు ముందు నా పిల్లలు వాడి అఫ్ చేసి ఉంటారు. వాళ్ళు కంప్యూటర్ వాడినప్పుడు నాకు తెలిసి పోతుంది. అదే వాక్యం కుడా చెపుతుంది. బాలుడు నడువవలసిన మార్గం వాడికి నేర్పు అని. మనం మరి ఏమి చేస్తున్నాము. దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చారు అది ఒక మంచి పౌరిడిని, ఒక మంచి అన్నను, తమ్ముడిని, అక్కను, అమ్మను, చెల్లిని, స్నేహితురాలును, ఒక మంచి బర్తను, బార్యను తయారు చేయాల్సిన బాధ్యత. నీవు చిన్న నాటి నుండి వారిని ఎలా పెంచావో అలానే వారు పెద్ద వారు అయ్యాక ఉంటారు. వాళ్ళు ఎవరి మాట వినరు నీ మాట తప్ప. అలాంటిది నీవు ఏమి నేర్పిస్తున్నావు. రేపటికి, బవిష్యత్ కు ఆలోసించి వారిని సిద్ధం చెయ్యి.

 

సామెతలు 22:6; 23:13; 29:15; ఎపేసి 6:1 ; తప్పక చదవండి

 

ప్రభువు మిమ్మును మీ పిల్లలను దీవించును గాక.

 

మీ సహోదరుడు,

అపోస్తులు నాని బాబు నెల్లి 

విదేశీ ప్రయాణం - పరమ ప్రయాణం

 




మా సంగములొ చాలా మంది విస్వాసులు విదేశాలలో ఉన్నారు. వారి కొరకు అనుధినము ప్రార్ధన చేస్తూ ఉంటాము. అయితే వాళ్లు ఇక్కడ నుండి వెళ్లేటప్పుడు ప్రార్ధన సహకారం అడుగుతూ ఉంటారు, పాస్పోర్ట్ త్వరగా రావాలని, మెడికల్ లో పాస్ అవ్వాలని, ఇమిగ్రేషన్ అవ్వాలని, టికెట్ ధొరకాలని ఇలా... ఇవన్నీ ఎందుకు వేరే దేశం లోనికి ప్రవెసించడానికి కావలసిన అర్హతలు. పాస్పోర్ట్ తీసుకోవడానికి కేసులు ఉండకూడదు - అంటె మంచి స్వభావం ఉండాలి, రెండవది కనీస చదువు ఉండాలి, స్థిర నివాసం కలిగి ఉండాలి. ఎ లోపం లేని మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి.   ఒక రెండు సంవత్సరాలు ఉండే దానికే ఇంత జాగ్రత్త లు తీసుకుంటే చిరకాలం ఉండే పరలోకానికి అనుమతి ఇవ్వడానికి దేవుడు ఇంకెన్ని జాగ్రత లు తీసుకుంటారు. నీ శరీర ఆరోగ్యం ఆయన పట్టించుకోరు గాని, నీ స్వభావాన్ని, గుణాన్ని, నీ హృదయ స్థితి, విశ్వాసం లో స్థిరత్వమును కచ్చితంగా చూస్తారు. 

2కోరింథీయులకు 5: 10

ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.


మీ సహోదరుడు 

అపొస్తులు నాని బాబు నెల్లి


క్రొత్త పరీక్షా విధానం..


జులై 1, 2020 నుండి డిల్లీ యూనివర్సిటీ వాళ్లు నుతన పరీక్షా విధానం ప్రవేశపెట్టారు. అదే ఓపెన్ బుక్ ఎక్సామినేషన్ అంటే పుస్తకాలు చూసి  పరిక్ష వ్రాయడం. ప్రశ్న లు వాళ్లే వేసి దానిని వ్రాసుకొడానికి వాళ్లే పుస్తకాలు అనుమతిస్తారు. అయితే ఇవ్వబడిన  అవకాశంలో వారి ప్రతిభ ప్రశ్నకు సమాధానం కనుగొనె ప్రతిభను బట్టి మార్కులు ఇవ్వబడథాయి. ఇది చదివినప్పుడు నాకు బైబిల్ ఒక సందర్భం గుర్తుకు వచ్చింది. 

అప్పుడే అర్దం అయ్యింది ధీని నిర్మానికుడు మన దేవుడే అని. విస్వాసికి శ్రమల ద్వారా పరీక్షించు వాడు ఆయనే, ఆ శ్రమలలొ తప్పించుకొను మార్గమును సిధ్ధ పరచువాడు ఆయనే అట. అంటె మన శ్రమలలొ మన గెలవడం అంటె అయన మనకు సిధ్ధపరచిన మార్గమును కనిపెట్టడమె మన విధి. దాని ద్వారానే మన ఫలితం ఆధారపడి ఉంటుంది. మరి శ్రమలు కలిగినప్పుడు దేవుడు ఎర్పరచిన మార్గాన్ని కనుగుంటున్నవా? లేకా సొంత మార్గములొ నడచి దేవుని దృష్టిలో విఫల విస్వాసిగా మిగిలిపొథున్నవా? దేవుని మార్గం తెలుసుకోడానికి విశ్వాసం, ప్రార్ధన అవసరం. 

1కోరింథీయులకు 10: 13


https://www.google.com/amp/s/m.timesofindia.com/home/education/news/open-book-examination-what-does-it-mean/amp_articleshow/76112795.cms


అంతుచిక్కని రహస్యం 🤔


కొబ్బరికాయలు అంధరికి తెలుసు గాని కొబ్బరికాయలు లోనికి నీరు ఎలా వెల్తుందో ఎవరికీ తెలియదు, చివరికి శాస్త్రవేత్తల కు సహితం అంతుచిక్కని రహస్యం అది. అధి దైవ కార్యం మానవుని ఆలోచన కు అందదు. అలాంటివి సృష్టిలో, ఈ భూమి మీద మన చుట్టు వున్నాయి. 

అలాంటి వాటిలో ఒకటి, దేవుని యంధు సంపూర్ణ విశ్వాసంతో జీవించే వారి జీవితాలు, సేవకుల జీవితాలు. వీరు లోకుల కంటె, స్నేహితుల కంటె, శత్రువుల కంటె ధీనులుగా ఉండవచ్చు. కాని శ్రమల కాలంలో, ఆపద కాలంలో, కరువు సమయాలలో ఎలా పోషింప బడుతున్నారో, వారి అవసరాలు ఎలా తీర్చబడుతున్నాయో ఎవరికీ అంతుచిక్కని రహస్యం గా ఉంటుంది, చివరికి అనుభవించే వారికి కుడా ఆశ్చర్యం గానే మిగిలి పోతుంది. 

దేవుడు తన ప్రజలను ఆకలి గొననియ్యడు. ( సామెతలు 10:3), వారికి ఆశ్చర్య కరమయిన సహాయం అందిస్తారు ( 2 దిన 26:15 ), అధి మనుష్యుని అలోచన కు అందదు ( 1 కోరింది 2:9). 

ఎలియాకు కాకులు ఆహారం తేవడం ఎంటి? సారెపతు వెధవరాలి ఇంట్లో నునె, పిండి ప్రతిరోజు సిధ్ధం గా ఉండటం ఎంటి? సముద్రం లోనుండి పురెల్లు రావడం ఎంటి? ఆకాశం నుండి మన్నా రావడం ? 5రొట్టెలు 2 చిన్న చేపలు 5000 మంది తినడం? అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి... మన జీవితం లో కూడా కధా.. 
సదా మనలకు పోషణకర్త గా, యెహోవా యీరె గా ఉన్న ఆయనకే మహిమ కలుగును గాక

మీ సహోదరుడు
అపొస్తులు నాని బాబు నెల్లి
9908823196 

అన్నీ పట్టించుకోకండి



క్రోధం మనిషిని అవివేకి గా మార్చివేస్తుంది

అన్నీ పట్టించుకోకండి

ఒక పాము వడ్రంగి దుకాణంలో లోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపై ఎదురు దాడి చేస్తోందనుకుని వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా వుపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకొంది మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై యిలానే స్పందించి, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరుగుతుంది. జీవితంలో ప్రశాంతంగా వుండలంటే కొన్నిసార్లు అనవసరమైన కొన్ని పరిస్థితుల్ని మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలు అసూయలను మరియు ద్వేషాలను పట్టించుకోకుండా చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు అసలు ప్రతిస్పందించకపోవడమే మంచిది..

సామెతలు 14: 17
త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును. 


సామెతలు 16: 18
నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును

సామెతలు 17: 14
కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట వివాదము అధికము కాకమునుపే దాని విడిచిపెట్టుము. దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు

సామెతలు 11: 27
మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయును కీడుచేయ గోరువానికి కీడే మూడును.

పెస్బుక్ లో ప్రెండ్ ని తొలగించుట? మనకు ఒక పాటం...


ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం సమాజం మీద చాలా ఉంది. సోషల్ మీడీయా అనగానే ఫేస్బుక్ గుర్తుకువస్తుంది. ఇందులో అకౌంట్ లేని వారు ఇంచుమించు ఉండరు. కాని దానిని వాడటం లో కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎధుర్కుంటారు. ధాని వల్ల కొంత మంది అకౌంట్స్ లో జంక్ ప్రెండ్స్ ఎక్కువ ఉంటారు. అంటే... ఒక వ్యక్తీ ఎక్కువ అకౌంట్స్ థిసుకుని మనకు రిక్వెస్ట్ పెట్టి ధానిని మనం అంగీకరించిన తరువాత మరల మరొ అకౌంట్ తిసుకుని మరల రిక్వెస్ట్  పెట్టడం అలా ఎక్కువ సార్లు చెయ్యడం వలన మన అకౌంట్ లో మనుగడలో లేని ఫ్రెండ్స్ అకౌంట్ లు ఎక్కువ గా ఉంటాయి. అయిథె నాకు ఒక అలావటు ఉంది. ప్రతి రోజు పుట్టిన రోజు ల నోటిఫికేషన్ వస్తుంధి. అప్పుడు ప్రతి ఒక్కరి అకౌంట్ లో ప్రొఫైల్ చూస్తాను. ఒకవేళ ఆ వ్యక్తి కొన్ని నెలలుగా ఆ అకౌంట్ లో ఆక్టివ్ గా లేక పోతే, అంటె ఎవిధయిన పోస్ట్ లేకపోతే ఆ వ్యక్తిని నా ప్రెండ్ లిస్ట్ నుండి తీసేస్తాను. చాల మంది కొన్ని సంవత్సరాలుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టారు. అంటే అప్పుడప్పుడన్న ఒక పొస్ట్ పెడతా వుంటే ఆ వ్యక్తి ఆ అకౌంట్ ని వాడుతున్నట్టు. 

అలాగే మన దేవుడు మనం ఏదైన అడిగినప్పుడు, మనం ఏదైన ప్రభువు దగ్గర ఆశించినప్పుడు మన గతాన్ని చూస్తారు. అందులొ నీవు ఏదైన చేసినట్లు ఉంటె నీవు జివించుచున్న క్రైస్తవుడవు. ఒకవేళ ఆయన నీ గతాన్ని చూసినప్పుడు నీవు చలించుచున్నట్టు కనిపింఛక పోతే నిన్ను మృత క్రైస్తవ జాబితాలో వేస్తాడు. 

మరి దేవునికొరకు ఈ మధ్య కాలంలొ ఏదైన చెసావా... గుర్తు వచ్చినప్పుడు చెయ్యడం, గుర్తు వచినప్పుడు మందిరానికి వేల్లడం.... ఆపద వచ్చినప్పుడు మొర్ర పెట్టడం... జీవ క్రైస్ఠవ్యం కాదు.... ఎలాంటి పరిస్థితి అయిన క్రైస్తవ జీవితాన్ని, పరిశుద్ద జీవితాన్ని జీవించాలి. 

లూకా 13: 6 -9

చనిపొయిన తరువాత కూడా నీ డబ్బు నీతోనే...


ఒక మంచి జ్ఞానోదయo కలిగించే  ఉదాహరణ లాంటి నిజం  :-


 ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని ,

చాలా కస్టపడి సుమారు 1,000 కోట్లు రూపాయిలు సంపాదించాడు.


ఒకరోజు , తాను  ఎంతో కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన ధనం ,  తాను చనిపోయినా సరే ఎవరికీ , ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని , బాగా ఆలోచించి , 


 పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు, ఏమని అంటే , ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువు (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు. నెల గడిచినా ఎవరు రాలేదు. మల్లీ 100, 200 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో , చిక్కి సగం అయిపోయి ఉండగా......


ఈలోగా అకస్మాత్తుగా  ఒక  జ్ఞాని వచ్చి 


నేను మీ డబ్బు మీరు చనిపోయిన  తరువాత కూడా మీకు  ఉపయోగపడే సులువు టెక్నిక్  చెపుతాను అని అన్నాడు.


 ఎలా ?  అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు.


దానికి ఆ జ్ఞాని కోటీశ్వరునికి మీరు అమెరికా , ఇంగ్లండ్ , జపాన్ వెళ్ళారా ? అని అడిగేడు.

 Ans :-Yes.

 Q ;-   అమెరికాలో మీరు ఎన్ని  రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు 

   Ans: - నా Indian currency అమెరికాలొ చెల్లదు. 


కనుక నా రూపాయలను డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను ,  అదే England ఆయితే pounds , జపాన్ ఆయితే Yens ఇలా ఏదేశం వెళ్తే , ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి ,  ఖర్చుకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు..     


 ఇప్పుడు జ్ఞాని ఇచ్చిన సలహా


ఓ కోటీశ్వరుడా..


 అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా  , నీడబ్బు నీతో రావాలంటే , ఒకవేళ నీవు నరకానికి వెల్లాలి అని అనుకుంటే నీడబ్బును   పాపము " లోనికి  మార్చు. అంటే దుర్వినియోగం ,చెడు వ్యసనాలకి , పాపపు పనులలోనికి మార్చు.


 లేదా ..... ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే , నీ డబ్బును  దాన , ధర్మములు చేసి పుణ్యంగా Exchange   చేయు అని  చెప్పగానే .........


 ఆ ధనవంతునికి  జ్ఞానోదయం కలిగి , ఆ జ్ఞానికి 100 కోట్లు  తీసుకోమంటాడు. 


దానికి జ్ఞాని నేను కస్టపడి

 పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు.


 అప్పుడు జ్ఞానోదయం ఆయిన ఆ ధనవంతుడు , తన ఆస్తికి ఆ జ్ఞానినే  Maneger గా నియమించి , తగిన జీతం ఇచ్చి , తన సంపద అంతా సన్మార్గంలోనికి , పుణ్యo లోనికి , జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా ,


అయ్యా..... ఇదండీ సంగతి  


మన సంపదలు మనతో వచ్చే విధానం


ఇక మన ఇష్టమే .


మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ  మార్గం లో  ఖర్చు చేసి ,  పుణ్యం గా మార్చి  మనతో తీసుకొని వెల్దామా ?


     లేక


మన తలనొప్పిని కూడా తీసుకోలేని వారికి వదిలి వెల్దామా ?


మత్తయి 6: 20

పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు.

విశ్రాంతి

విశ్రాంతి

బైబిల్ గ్రంధం లొ అన్నింటి గురించి బాహాటంగా, సవివరంగా వ్రాయడం జరిగింది. బైబిలె మానవాళికి ఒక మాన్యువల్ బుక్ లాంటిది అని చాలా మార్లు చెపుథుంటాను. ప్రభువు మానవాళికి ఇచ్చిన క్రమ బరిత జీవితం లొ విశ్రాంతి అనేది కూడా ఒక భాగం. అయితే  మానవుడు విశ్రాంతి లేకుండ ప్రయాస పడుతుంటున్నడు. విశ్రాంతి అనేది రాత్రి వేళ తీసుకునేది మాత్రమే కాదు. అంతకు మించినది అని నా భావన. సృష్ఠి నిర్మానం లొ యెడవ దినాన విశ్రాంతి తీసుకున్నారు ( ఆది 2:2). అంతె కాదు వారంలొ ఒక రోజు మనలను విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు( నిర్గ 20:9 ). యెసువారు ఒక రోజు పడవ ప్రయాణం చేస్తునపుఢు చాల పెద్దతుపాను సముద్రం లొ అలజడి గా ఉంది శరీరానికివిశ్రాంతి అవసరం గనుక అయన నావ అమరమున నిద్రించు చున్నారు ( లూకా 8: 22 ). అంతటి పరిస్థితులు ఆగిన శరీరానికి ఇవ్వవలసిన విశ్రాంతి ఇవ్వాలని ప్రభువు వారి సూచన అయి ఉండవచ్చు అని నా ఉధ్దేశ్యం. ఎందుకంటె శ్రమలలొ ఆయన మనలను విడచి పెట్టు వాడు కాదు. మన చింత యవత్తూ ఆయన మొస్తున్నారు ( 1పెతురు 5:7,8)  దేవుడు విశ్రాంతిని ఎంత నిష్పత్తి లొ ఉంచారు అంటె 6:1. ప్రభువు వారు పెట్టిన క్రమంలో  విశ్రాంతికి ఎంత బలము చదరపు ఉంది అంటే కరొనా వలన ప్రపంచ మంథ లాక్ డౌన్ పాటించడం జరిగింది. ప్యాక్రటరిలు, ప్రయాణ వాహనాలు అని రెండు నెలలు నిలిపి వేసారు. ఇది ఒక విశ్రాంతి గా భూమి స్వీకరించి మానవ అవసరలకు పెరుతున్న వాయు కాలుష్యం వలన పాడయిన ఒజొను పొరను భూమి తనకు తాను బాగుచేసు కుంది. అధి పది లక్షల చదరపు కిలో మీటర్ల. ప్రభువు పెట్టిన క్రమం వెనుక ఒక రహస్యం అధి. బైబిల్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మీరు కూడ మీ శరీరానికంతటికీ, మీరు పండించే భూమికి, వాడే వస్తువుకు, ప్రతి దానికి విశ్రాంతి ఇవ్వడం మరచి పొకండి. 6:1 నిష్పత్తి. ప్రభువు మిమ్మును ధివించును గాక.

మీ సహోదరుడు,
అపొస్తులు నాని బాబు నెల్లి,