యేసు వారు ఎందుకు స్వస్థత లు ప్రకటింప వద్దు అన్నారు?
నీవు ఏమి కలిగి ఉండవు , కాని సంతోషంగా ఉంటావు - ప్రపంచ ఎకానమీక్ ఫోరం, “ ది గ్రేట్ రీసెట్ “
నీవు ఏమి కలిగి ఉండవు , కాని సంతోషంగా ఉంటావు - ప్రపంచ ఎకానమీక్ ఫోరం, “ ది గ్రేట్ రీసెట్ “
ప్రస్తుత బయనిక తెగులు దేశాన్ని, ప్రపంచాన్ని
కుదిపేస్తుంది, అనేక మరణాలు, అనేక మంది అనాదులుగా, విధవరాండ్రు గా
మిగిలిపోతున్నారు. అనేక మంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం జీవితాంతం కస్టపడి
సంపాదించిన ఆస్తినంత హాస్పటల్ లో అప్పగించి పిల్లలకు అప్పులు మిగిల్చి వెళ్ళిపోతున్నారు.
మనం అంత బయనక స్థితి లో ఉన్నాము. ఎప్పుడు ఎవరికీ ఏమి అవుతుందో అని ప్రాణాలను
గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు ప్రజలు. అయితే ఇ భయాన్ని తెగులును అవకాశంగా
వాడుకుని ప్రజలను తప్పు త్రోవలో దేవునికి ఇష్టం లేని మార్గం లో నడిపించడానికి
మరోపక్క ప్రపంచ దేశాల నాయకులు కుట్రలు పన్నుతున్నారు.
“ ది గ్రేట్ రీసెట్ “
“ THE GREAT RESET” అనే నినాదం తో ప్రపంచ ఎకనామిక్ ఫోరం ఒకటి ఏర్పడింది.
దిని ప్రధాన ఉద్దేశ్యాలు, ప్రపంచ ఆర్ధిక పని తీరును మార్చుట, ప్రజలకు ఆరోగ్యం,
వసతి, విద్య అందించడం. అయితే ఇది కనిపించడానికి చేసే ప్రతిజ్ఞలు, కాని వారి
ఉద్దేశ్యాలు పెత్తందారి వ్యవస్థను, అంటే క్యాప్టలిసం మరియు మార్క్స్ వ్రాసిన
కమ్మునిసం ను ప్రపంచమంతా అమలు చేసేలా ఉంది అని చాల మంది తెలియ జేస్తున్నారు.
ప్రపంచ ధనవంతులు వారి గుర్తింపును కోల్పోవడం వలన తిరిగి ఇ
కోవిడ్ ను అడ్డం పెట్టుకుని మరల ఆర్ధిక వ్యవష్టలో ఉన్నత శిఖరాలు ఎక్కడం వారి
ఉద్దేశ్యం. ప్రపంచ ఎకానమీ ఫోరం యొక్క ఉద్దేశ్యం ప్రకారం 2030 నాటికి “ ది గ్రేట్ రీసెట్ “ అమలుకావడం. దానిలో ప్రముక్యంగా వినిపించే మాట “నీవు ఏమి కలిగి ఉండవు అయితే నీవు సంతోషంగా
ఉంటావు”. మన ఆస్తులు, వనరులు, ఏమి మన
సొంతం కాదు కాని మనం సంతోషం గా ఉంటాము అనేది వారి నినాదం. మన ఏమీ కలిగి ఉండనప్పుడు
మనము ఎలా సంతోషం గా ఉంటాము. అంటే మనకు కావలసినదంత వాళ్ళే ఇస్తారు. అంటే మనం ఏమి
తినాలి, ఏమి కలిగి ఉండాలి, ఏ బట్టలు ధరించాలి, అంతా వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే నియంత్రిస్తారు.
మనం అంత వాళ్ళ స్వాధీనం లోనే ఉంటాము. మనం
ఆ దనం ఆస్తి కలిగిఉండక పోతే మరి ఎవరు కలిగి ఉంటారు. అంటే నాయకులు, వ్యాపార వేత్తలు కలిగి ఉంటారు.
అంతేకాదు దేవుని వ్యతిరేక ఆలోచనలను అందులో ఉన్నాయి. స్త్రీ స్త్రీ వివాహాలు, పురుష
పురుష వివాహాలు, ప్రజల మనోభిస్తానికి స్వేచ్చగా వదిలేయడం వంటివి. ప్రపంచ దనం, అధికారం అంతా వారి చేతిలోకి తీసుకోవడం, వాళ్ళే
దేవుళ్ళుగా ఉండిపోవాలని ఆశ. ఎప్పుడైతే ఇది
ఏర్పడిందో ప్రజలలో కట్లు తెగిన జంతువుల వాలే ప్రవర్తించే అవకాసం ఎంతో ఎక్కువగా
ఉంది. ఒక రకంగా సోదోమ గోమేర్ర వంటి దేశాల వాలే దేవుని కోపాన్ని ఉగ్రతను కొని
తెచ్చుకున్న వారివలె ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వాక్సిన్ పాస్ పోర్ట్ అనేది అందులోని
బాగామనే కొంతమంది ఆలోచన.
ఒకవేళ ఇది గాక ఏర్పడితే దేశంలోని ప్రతి జాతి అనేక కస్టాలు
బరించక తప్పదు. ఇప్పటికే ౩౦౦౦ మందికి పైగా
అందులో బాగాస్తులై ఉన్నారు. దేశాల ప్రధానులు కుడా అటువైపు మొగ్గు చూపిస్తున్నారు. చైనా ప్రధానితో
పాటు మన దేశ ప్రధాని మోడీ గారు కుడా అందులో కనిపంచడం దురదృష్టకరం.
మనం కుడా రాబోయే రోజుల్లో మరల మన పూర్వికుల వలే కొత్త రకంగా
మరల ధాస్యత్వం లోకి వెళ్లి పోయే ప్రమాదం పొంచి ఉంది.
దిని విషయంలో మనం ప్రార్ధన చెయ్యాల్సిన వారమై ఉన్నాము.
కీర్తనలు 17:1. హగ్గాయి 1:3-10.
హగ్గాయి 2:4-7 లో ఆయన ఇచ్చిన వాగ్ధానము ను ఎత్తి బట్టి
ప్రార్ధన చేదం. ( కీర్తనలు 9:15-16 , యేహేజ్కేల్ 17:19-20., కీర్తనలు 35:1- 18, ద్వితి 8:18, సామెతలు
13:22.
ఇవన్ని అయన రాకడకు ముంగుర్తులు కాగా అనేక ఆత్మల రక్షణ కలిగి
దేవుని రాజ్యం కట్టబడునట్లు ప్రార్ధన చెద్దము.....
అపోస్తులు నాని బాబు నెల్లి,
ఇండియా ప్రార్ధన కూటమి
ఎరైజర్ నుండి పాఠం
నిన్నటి దినాన నా
కుమార్తె బొమ్మలు గీస్తూ ఉంది. అయితే తనకు నేను కొత్త ఎరైజర్ కొని ఇచ్చాను కానీ ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయింది. మామూలు విషయమే కదా అని వదిలేసాను. కానీ దేవుడు అదే విషయాన్ని పదే పదె గుర్తు చేస్తూ
వచ్చారు. ఇరోజటికి దేవుడు ఎదో చెప్ప
బోతున్నారు అని గ్రహించి, ధ్యానించడం, ఆలోసించడం , ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాను.
అప్పుడు తండ్రి నా
మనస్సు లో ఒక సాదృష్యాన్ని దానికి అన్వహించమన్నరు.
ఏరైజర్ ( పెన్సిల్ వ్రాతలను చేరుపునది ) ఎపుడెప్పుడు వాడతారు? ముఖ్యంగా పిల్లలు తప్పులు వ్రాసినప్పుడు వాటిని
చెరిపి మరల ప్రయతించ డానికి ఉపయోగిస్తారు. వాళ్ళు తప్పులు చెరపడానికి ఉపయోగించిన ప్రతిసారీ
ఎరైజర్ రా తప్పును చేరుపుతు అరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకు అంది పూర్తిగా అరిగిపోతుంది.
ఇక్కడ నమ్మకం ఒక ఎరైజర్
అయితే నీవు చేసే తప్పులు క్షమించేటప్పుడు అధి అరిగిపోతుంది. కొంత కాలానికి నీ తప్పులు సరిదిద్దు కోవడానికి ఎదుటవానిలోని
నమ్మకం పూర్తిగా కోలిపోతావు.
నమ్మకం ఉంచుతున్నారు
కదా అని కావాలని పొరపాట్లు చెయ్యకు, ఒకరోజు అనాధగా మిగిలిపోతారు.
యేసు వారు నీ కొరకు
నా కొరకు మరణించి సమాధి చెయ్యబడి, తిరిగి లేచి మనలను
క్షమించి దేవుని రాజ్యానికి వారసుడని చేశారు. మరలా తిరిగి పాపం చెయ్యకు, మరణమే గతి.
( హెబ్రి 10: 26,27 )
ప్రభువు మిమ్మును
మీ విశ్వాసమును బట్టి దీవించును గాక!
అపొస్తులు నాని బాబు
నెల్లి,
ఇస్త్రీ చేసేటప్పుడు
ప్రతి రోజు నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకోవడం నాకు అలవాటు. నిన్న సాయంత్రం బయటకు వెళ్ళాలి అని బట్టలు ఇస్త్రీ చేసుకునే బల్ల మీద వేసి, ఇస్త్రీ పెట్టి యొక్క ప్లగ్ పెట్టీ, వెడెక్కే లోపు మంచి నీళ్లు తాగి వద్దామని పక్కనే ఉన్న వంట గదిలోకి వెళ్ళాను. నీళ్ళు తాగి వచ్చి ఇస్త్రీ చేస్తుంటే చొక్కాయి ఇస్త్రీ అవ్వడం లేదు, ఎంటా అని చూస్తే ఇస్త్రీ పెట్టీ వెడెక్క లేదు. అయ్యో ఇస్త్రీ పెట్టీ పోయింది అని బాధపడుతూ, స్విచ్ వెయ్యలేదేమో అని అనుమానం వచ్చి స్విచ్ చూస్తే బాగానే ఉంది. చాలా సేపు బాధపడ్డాను, ఇస్త్రీ పెట్టీ పాడైపొయ్యింది, ఇప్పుడు బట్టలు ఇస్త్రీ ఎలా అని. ఎందుకో అసలు ప్లగ్ సరిగా పెట్టానో లేదో అని చూసాను అప్పుడు అర్ధం అయ్యింది. ప్లగ్ సరిగానే పెట్టాను, స్విచ్ వేసాను కానీ నిన్ను పెట్టిన ప్లగ్ ఇస్త్రీ పెట్టిధి కాదు ప్రక్కన ఉన్న వేరే వస్తువుది అని. మరి ఇలా అయితే ఇస్త్రీ పెట్టీ ఎందుకు, ఎలా పని చేస్తుంది?
క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని లోకానికి, లోక నటనకు, లోక సంప్రదాయాలు, అలవాట్లకు అప్పగించి, దేవునికి దూరంగా ఉంటూ, దగ్గరగా ఉన్నాము అనే బ్రమలో ఉంటూ, నా జీవితం మారడం లేదు, దేవుడు నన్ను దీవించడం లేదు అని బాధ పడితే ప్రయోజనం ఏమిటి?. నీ జీవితం దేవునితో లేదు! నీ అలవాట్లు దేవునికి ఇష్ట మయినవి కాదు! నీ జీవితాన్ని దేవునికి అనుసంధానం చెయ్యి అప్పుడు నిజ దీవెన నీలో ఫలిస్తుంది.
ప్లగ్ ఒక దానిది పెట్టీ వేరొకటి పనిచేయలనీ కొరువడం ఎంత మూర్ఖత్వమే, నీ జీవితం దేవునికి ఇవ్వకుండా దేవుడు దీవించడం లేదని అనడం కూడా అంతే…
మత్తయి 15:6-10
ప్రభువు మిమ్మును మీ విశ్వాస జీవితాన్ని బట్టి దీవించి ఆశీర్వదించును గాక!
అపొస్తులలు నాని బాబు నెల్లి
9908823196
పరీక్ష గదిలో
ఈరోజు ఉదయాన్నే ప్రార్థనలో మన తండ్రి నాకు నా డిగ్రీ కాలేజ్ లో పరీక్ష వ్రాస్తున్న సమయాన్ని గుర్తు చేశారు. నాకు కొంచెం ఆలోచనలో పడ్డాను. తండ్రి ఎప్పుడు అనవసరంగా గుర్తు చెయ్యరు దిని వెనుక
ఎదో ఒక విషయం ఉంది, దానిని చెప్పాలి అనుకుంటున్నారు
అని ధ్యానించడం మొదలు పెట్టాను.
కొంచెం సేపు ఆలోచనల
తరువాత నా మధి మా పరీక్ష గదిలో ఉన్న ఇన్విజిలేటర్ వైపు వెళ్ళింది. ఆయన చాలా కట్టినంగ వ్యవహరించే వారు. అసలు అతు ఇటు కధలనిచ్చే వారు కాదు. ఇంకొంచెం అలోసిస్తే ఆ ఇన్విజిలేటర్ మాకు తెలియని వారు కాదు, గడచిన సంవత్సరం అంతా మాకు బోధించిన సారే…
ఆయన సంవత్సరం అంతా
బోధించి, మమ్ములను ఎంతగానో ప్రేమించి, బరించి, అర్ధం కాకపోతే మరల
మరల అర్ధం అయ్యేవరకు వరకు చెప్పిన అధ్యాపకుడు. కానీ ఇప్పుడు ఆయన వేరే స్థానం లో ఉన్నారు. మేము పరీక్షలు వ్రాసేటప్పుడు ఆయన చెప్పినవన్నీ మేమే
వ్రాయాలి. ఆయన ఇప్పుడు ఒక్క మాట కూడా
చెప్పలేదు.
అలాగే దేవుడు బోధించినప్పడు, నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాలి, శ్రమలలో ఆ బోధలు మనకు సహాయంగా ఉంటాయి. ఆయన మనలను చూస్తూ ఉంటారు. మనం ఏవిధంగా నడుస్తున్నాము, ఏవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామో, ఆయన చెప్పిన మార్గం లో నడుస్తున్నాము లేనిది పరీక్షిస్తారు. ఇవన్నీ ముందుగానే మనకు బోధించారు కదా….
సూర్యుని నుండి పాఠం
మనకు సూర్యుని గురుంచి
చాలా విషయాలు తెలుసు కానీ ఇంకా తెలియాల్సిన వి కూడా చాలా ఉన్నాయి.
రెండు, అధి దేవుడు పెట్టిన క్రమం. ఎలా అంటే మనకు చీకటి కలగడం అంటే శ్రమలు, వేదనలు కలగడం వలన మనం నిరీక్షణ ను, విశ్వాసాన్ని అల్వరచుకుంటాము. సూర్యుడు ఉదయించక పోతాడా అని.
దేవుడు మిమ్మును దీవించును
గాక!
అపోస్తులు నెల్లి
నాని బాబు
9908823196
మన దేశంలో దేవుని సింహాసనం! ఎలా?
స్తుతి ప్రార్ధన శక్తి నిరూపణ
ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.
ఒక యదార్ధ విషయాన్ని మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే 20% పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది. CBN NEWS ప్రకారం 2017 లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు 2016 లో మొత్తం జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది. ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.
మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో, ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.
ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.
ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.
పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.
ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే ఒక రోజు లేక వ్యక్తి గతం గా అయితే ఒక గంట / అర గంట సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.
ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.
ప్రభువు సేవలో,
అపొస్తులు నాని బాబు నెల్లి,
స్థాపితులు,
ఇండియా ప్రేయర్ లీగ్,
దీప స్తంభం
ఒక వేసవి కాలములో పిల్లలకు సెలవు రోజుల్లో, మేము మా పిల్లలతో అంతర్వేది బీచ్ కు వెళ్ళాము. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. దానిని చూడటానికి వెళ్ళాము, పిల్లలు దాని గురించి చెప్పండి నాన్న అని అడిగారు. అప్పుడు దాని గురించి చెప్పడం మొదలు పెట్టాను. సముద్రం లో ప్రయాణం చేసే ఓడలుకి, చేపల వేటకు వెళ్లే మత్యకారులకు ఒడ్డుకు చేరడానికి ఒక దిక్షుచి అని చెప్పాను. ఎందుకలా వాళ్లకు తెలియదా? అన్నారు. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం కణపడదు, అలాంటప్పుడు ఈ దీపం వెలుగు వారికి తీరం ఎటువైపు ఉందో చూపిస్తుంది అని చెప్పాను. నిజమే కదా, సువిశాలమైన సముద్రం లో ఓడలు, పడవలు, నావలు ఒడ్డుకు నడిపించే దీపం, వెలుగు తీరాన్ని ఉండాలి. అప్పుడే తీరానికి చెరగలరు.
అలాగే యేసు వారు మనకు దీపం, వెలుగై ఉండి, మనకంటే ముందుగా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి, తీరానికి చేరి మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ జీవన సముద్రం లో మన జీవిత పడవ ప్రయాణం వెలుగై, దీప స్తంభం అయ్యి ఉన్న యేసు వైపు చూస్తూ నడిస్తే మనం కూడా యేసు వారి వలె పాపం, మరణం, లోకం జయించ గలము. నిత్య తీరమయిన పరముకు చెరగలం. మరణమును, నరకనును తప్పించు కొగలము.
ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక!
దేవుని అద్భుతం
ఒకసారి ఒక వృద్ధుడు
దేవుడు తనకు ఇచ్చిన పిలుపు, బారాన్ని బట్టి రైలు లో సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి కంపార్ట్మెంట్ లోకి వెళ్లి నిలువబడి “ యేసు రక్షకుడు, మన పాపముల కొరకు చనిపోయి, తిరిగి లేచారు, ఆయన మరల వస్తున్నారు, మారుమనస్సు పొందండి” అంటూ గట్టిగ అరుస్తూ చెపుతున్నాడు. ఇంతలో అక్కడ ఉన ఒకావిడ అతని మీద కేకలు వేస్తూ, నోరుమూయి, నీ చెప్పే యేసు అసలు లేరు అని గట్టిగ అరిచింది. ఆ ముసలాయన ఏమి చెయ్యలేని పరిస్థితిలో, భయపడి కూర్చుండి పోయాడు.
గానీ దేవుడు తనను
బలవంతం చేస్తున్నారు, సువార్త ప్రకటించడం
అపవద్దు అని. దేవునికి భయపడి, లోబడి మరల నిలువబడి వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడు. మరల ఆ స్త్రీ తనమీద కోపం తో విరుచుకు పడి, దాడి చెయ్యడం మొదలు పెట్టింది. ఇంతలో తనకుడ కూడా వచ్చిన తన కుమారుడు గట్టిగా “ అమ్మ, తనను ఏమీ చెయ్యొద్దు, అతను దేవుని చేత పంపబడిన వాడు” అని చెప్పాడు అంట.
వెంటనే ఆ స్త్రీ మోకాళ్ళ
మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది. రొమ్ము కొట్టుకుంటూ
ఏడుస్తూ, తన పాపాలను ఒప్పుకుంటూ, యేసు ను అంగీకరించడం మొదలు పెట్టింది.
ఆ వృద్ధుడు ఏమైదీ
అని అడిగితే, “ నా కుమారుడు పుట్టి మూగవాడు” అని ఏడ్చింది.
ప్రభువు మిమ్మును
దీవించి, అంగీకరించును గాక!
రేమిడిసివర్ ఇంజక్షన్
ప్రస్తుతం బాగా
వినపడుతున్న మాట రిమిడిసేవిర్. కొవిడ్ వచ్చిన వారికి
ఇచ్చే ఇంజక్షన్. ఇధి ఒకోసారి లక్షలలో
పలుకుతుంది. ఎందుకంటే అది లోపల ఉన్న వైరస్
పెరగకుండా ఆపుతుంది. అయితే కొన్ని కేసులలో
ఆ ఇంజిక్షన్ ఇచ్చినా చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే వైరస్ వంటి నిండా వ్యాప్తి చెందిన
తరువాత దానిని వాడుతున్నారు. దానిని వైరస్ సోకిన
వెంటనే ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దాని పని సక్రమంగా
చెయ్యగలిగుతుంది.
శత్రువుల బయమా?
బెతనియలో క్రైస్త్వవ్యం మార్కు 14 : 3 -10
బెతనియ లో క్రైస్తవ్యం?
బెతనియలోని సిమోను?
విలువయిన అత్తరు ఎలా ఇవ్వగలిగింది?
దేవుని దృష్టిలో ఆమె తెచ్చిన అత్తరు ఎలా కనిపించింది?
6డిసెంబర్ 2020 ఆదివారం ఆరాధనలో అందించిన వాక్యం లైవ్ ...
పట్టుకున్న దానిని కూడా వదిలేయ్
వర్షా
కాలం లో ఒక వ్యక్తి ఏటిగట్టున నడుకుంటూ వెళ్తుండగా కాలు జారి ఏటిగట్టుకు క్రిందన
ఉన్న నేల నూతిలో పడిపోసాగాడు, ప్రాణబయంతో అక్కడ చేతికి అందిన ఒక మొక్కను
పట్టుకున్నాడు. అయితే కురుస్తున్న వార్షానికి నెల మెత్తన పడి అది కుడా ఒకో వేరు
ఒకో వేరు తెగిపోవడం మొదలు పెట్టింది. వేర్లు తెగుతున్న కొలది వాని ప్రాణాలు
జారిపోతున్నాయి. ఎంత కేకలు పెట్టిన ఎవ్వరు రావడం లేదు. ఇక ప్రాణ భయంతో ఉండగా దేవుడు
గుర్తుకు వచ్చారు, వెంటనే ప్రార్ధన చెయ్యడం మొదలు పెట్టాడు. కాపాడమని అడగడం మొదలు
పెట్టాడు. అయితే అది అత్యవసర పరిస్థితి గనుక దేవుని ప్రత్యక్షత దొరికింది.
ఏమికావాలని ప్రభువు అడగగా? నన్ను కాపాడు అన్నాడు. నేను నిన్ను కాపాడగలనని నమ్ముతున్నావా?
అడిగారు ఆయన, నమ్ముతున్నాను అన్నాడు, నిజంగా నమ్ముతున్నావా? నీవు మాత్రమె కాపడగలవు
అన్నాడు. అప్పుడు దేవుడు నా మీద అంత నమ్మకం ఉంటె నీవు పట్టుకున్న చెట్టు వద్దిలేయ్
అన్నారు......
నిజమయిన,
ధృడ మయిన నమ్మకం ఉంటె అప్పటివరకు పట్టు
కున్నదాన్ని వదిలివేయ గలుగుతాడు? లేక పోతే దేవున్ని వదులుకోవలసి వస్తుంది.
ఈరోజుల్లో
కుడా ప్రతి క్రైస్తవుడు కుడా దేవుని మీద నమ్మకం అంటారు కాని లోక సంప్రాదాయాలు(
సంస్కృతి కాదు, అది వేరు ), కట్టు బాట్లు, ముహూర్తాలు, ఎదురులు, శకునాలు,
తాయిత్తులు, మంత్రాలు, ఎలా చాలా ఉన్నాయి వాటిని వదలడం లేదు, వాళ్లకు తెలియకుండానే
దేవున్ని వదులుకుంటున్నారు, కాని దేవునిలోనే ఉన్నాము అనుకుంటున్నారు. దేవుని శక్తి
పరిపూర్ణంగా చూడాలి అంటే పరిపుర్ణమయిన నమ్మకం ఆయనమీద పెట్టగలగాలి.
క్రియలు
లేని విశ్వాసం మృతము యాకోబు 2: 26
మీ
కొరకు ప్రార్ధించు
అపోస్తులు
నాని బాబు నెల్లి
990882316
క్రమ శిక్షణ
దేవుడు
నాకు ఇద్దరు బిడ్డలను ఇచ్చారు. వారు దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. అయితే వాళ్ళు
అప్పుడప్పుడు నేను వాడే కంప్యుటర్ వాడుతుంటారు. నేను నా లాప్టాప్ కి బ్లుటూత్ కీ
బోర్డ్, మౌస్ వాడుతున్నాను. రెండు సంవత్సరాల క్రితం వాళ్లకు ఒక మాట చెప్పాను.
ఏంటంటే ఎప్పుడైనా మీరు కంప్యుటర్ వాడటం అయిపోయాక కీ బోర్డ్ మౌస్ స్విచ్ లు ఆఫ్ చెయ్యండి అని
చెప్పాను. నేను అయిన అప్పుడప్పుడు మరచి పోతాను. నేను కంప్యుటర్ ఆన్ చేసి మౌస్, కీ
బోర్డ్ పని చెయ్యడం లేదు ఏంటి అనుకుంటాను. కాని అంతకు ముందు నా పిల్లలు వాడి అఫ్
చేసి ఉంటారు. వాళ్ళు కంప్యూటర్ వాడినప్పుడు నాకు తెలిసి పోతుంది. అదే వాక్యం కుడా
చెపుతుంది. బాలుడు నడువవలసిన మార్గం వాడికి నేర్పు అని. మనం మరి ఏమి చేస్తున్నాము.
దేవుడు నీకు ఒక బాధ్యత ఇచ్చారు అది ఒక మంచి పౌరిడిని, ఒక మంచి అన్నను, తమ్ముడిని,
అక్కను, అమ్మను, చెల్లిని, స్నేహితురాలును, ఒక మంచి బర్తను, బార్యను తయారు చేయాల్సిన
బాధ్యత. నీవు చిన్న నాటి నుండి వారిని ఎలా పెంచావో అలానే వారు పెద్ద వారు అయ్యాక
ఉంటారు. వాళ్ళు ఎవరి మాట వినరు నీ మాట తప్ప. అలాంటిది నీవు ఏమి నేర్పిస్తున్నావు.
రేపటికి, బవిష్యత్ కు ఆలోసించి వారిని సిద్ధం చెయ్యి.
సామెతలు
22:6; 23:13; 29:15; ఎపేసి 6:1 ; తప్పక చదవండి
ప్రభువు
మిమ్మును మీ పిల్లలను దీవించును గాక.
మీ సహోదరుడు,
అపోస్తులు నాని బాబు నెల్లి