ఇస్త్రీ చేసేటప్పుడు

  




ప్రతి రోజు నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకోవడం నాకు అలవాటు. నిన్న సాయంత్రం బయటకు వెళ్ళాలి అని బట్టలు ఇస్త్రీ చేసుకునే బల్ల మీద వేసి, ఇస్త్రీ పెట్టి యొక్క ప్లగ్ పెట్టీ, వెడెక్కే లోపు మంచి నీళ్లు తాగి వద్దామని పక్కనే ఉన్న వంట గదిలోకి వెళ్ళాను. నీళ్ళు తాగి వచ్చి ఇస్త్రీ చేస్తుంటే చొక్కాయి ఇస్త్రీ అవ్వడం లేదు, ఎంటా అని చూస్తే ఇస్త్రీ పెట్టీ వెడెక్క లేదు. అయ్యో ఇస్త్రీ పెట్టీ పోయింది అని బాధపడుతూ, స్విచ్ వెయ్యలేదేమో అని అనుమానం వచ్చి స్విచ్ చూస్తే బాగానే ఉంది. చాలా సేపు బాధపడ్డాను, ఇస్త్రీ పెట్టీ పాడైపొయ్యింది, ఇప్పుడు బట్టలు ఇస్త్రీ ఎలా అని. ఎందుకో అసలు ప్లగ్ సరిగా పెట్టానో లేదో అని చూసాను అప్పుడు అర్ధం అయ్యింది. ప్లగ్ సరిగానే పెట్టాను, స్విచ్ వేసాను కానీ నిన్ను పెట్టిన ప్లగ్ ఇస్త్రీ పెట్టిధి కాదు ప్రక్కన ఉన్న వేరే వస్తువుది అని. మరి ఇలా అయితే ఇస్త్రీ పెట్టీ ఎందుకు, ఎలా పని చేస్తుంది?

క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని లోకానికి, లోక నటనకు, లోక సంప్రదాయాలు, అలవాట్లకు అప్పగించి, దేవునికి దూరంగా ఉంటూ, దగ్గరగా ఉన్నాము అనే బ్రమలో ఉంటూ, నా జీవితం మారడం లేదు, దేవుడు నన్ను దీవించడం లేదు అని బాధ పడితే ప్రయోజనం ఏమిటి?. నీ జీవితం దేవునితో లేదు! నీ అలవాట్లు దేవునికి ఇష్ట మయినవి కాదు! నీ జీవితాన్ని దేవునికి అనుసంధానం చెయ్యి అప్పుడు నిజ దీవెన నీలో ఫలిస్తుంది.

ప్లగ్ ఒక దానిది పెట్టీ వేరొకటి పనిచేయలనీ కొరువడం ఎంత మూర్ఖత్వమే, నీ జీవితం దేవునికి ఇవ్వకుండా దేవుడు దీవించడం లేదని అనడం కూడా అంతే…


మత్తయి 15:6-10

ప్రభువు మిమ్మును మీ విశ్వాస జీవితాన్ని బట్టి దీవించి ఆశీర్వదించును గాక!

అపొస్తులలు నాని బాబు నెల్లి

9908823196


పరీక్ష గదిలో




ఈరోజు ఉదయాన్నే ప్రార్థనలో మన తండ్రి నాకు నా డిగ్రీ కాలేజ్ లో పరీక్ష వ్రాస్తున్న సమయాన్ని గుర్తు చేశారు. నాకు కొంచెం ఆలోచనలో పడ్డాను. తండ్రి ఎప్పుడు అనవసరంగా గుర్తు చెయ్యరు దిని వెనుక ఎదో ఒక విషయం ఉంది, దానిని చెప్పాలి అనుకుంటున్నారు అని ధ్యానించడం మొదలు పెట్టాను.

 

కొంచెం సేపు ఆలోచనల తరువాత నా మధి మా పరీక్ష గదిలో ఉన్న ఇన్విజిలేటర్ వైపు వెళ్ళింది. ఆయన చాలా కట్టినంగ వ్యవహరించే వారు. అసలు అతు ఇటు కధలనిచ్చే వారు కాదు. ఇంకొంచెం అలోసిస్తే ఆ ఇన్విజిలేటర్ మాకు తెలియని వారు కాదు, గడచిన సంవత్సరం అంతా మాకు బోధించిన సారే

 

ఆయన సంవత్సరం అంతా బోధించి, మమ్ములను ఎంతగానో ప్రేమించి, బరించి, అర్ధం కాకపోతే మరల మరల అర్ధం అయ్యేవరకు వరకు చెప్పిన అధ్యాపకుడు. కానీ ఇప్పుడు ఆయన వేరే స్థానం లో ఉన్నారు. మేము పరీక్షలు వ్రాసేటప్పుడు ఆయన చెప్పినవన్నీ మేమే వ్రాయాలి. ఆయన ఇప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు.

 

అలాగే దేవుడు బోధించినప్పడు, నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాలి, శ్రమలలో ఆ బోధలు మనకు సహాయంగా ఉంటాయి. ఆయన మనలను చూస్తూ ఉంటారు. మనం ఏవిధంగా నడుస్తున్నాము, ఏవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామో, ఆయన చెప్పిన మార్గం లో నడుస్తున్నాము లేనిది పరీక్షిస్తారు. ఇవన్నీ ముందుగానే మనకు బోధించారు కదా….

మనకు బోధించిన అధ్యాపకుడు మనంపరిక్ష కాలంలో మౌనాన్ని వహించినట్టే ఇయన మౌనాన్ని వహించి మనలను పరిశీలిస్తారు

సూర్యుని నుండి పాఠం


మనకు సూర్యుని గురుంచి చాలా విషయాలు తెలుసు కానీ ఇంకా తెలియాల్సిన వి కూడా చాలా ఉన్నాయి.

 ఒకరోజు నేను ప్రార్ధన చేస్తుంటే నా దృష్టిని దేవుడు సూర్యుని మీదకు తిప్పారు. సూర్యుని గురుంచి చాలా విషయాలు అలోసించను, అయిన నాకుదేవుడు చెప్పదలసిన విషయం నాకు రావడం లేదు. చాలా విషయాలు చదివాను. ఒకొక్కసారి లోతైన విషయాలు కాకుండా చాలా సాధారణ విషయాలతో కూడా దేవుడు మనతో మాట్లాడతారు.

 నేను సూర్యుని గురుంచి ఎంత అలోసించిన నాకు లోటు గానే ఉంది. అప్పుడు సాధారణ విషయాలు అలోసించడం మొదలు పెట్టాను. అందులో ఒకటి సూర్యోదయం, సూర్యాస్తమయము. సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించడం, కనిపించడం. భూమి సూర్యుని తట్టు ఉన్న బాగం మీద సూర్య కంటి పడుతుంది, కనపడుతుంది. మరో బాగం లో సూరీడు కనపించడు. అంటే సూర్యుడు లేడు అని కాదు కదా…. సూర్యుని వైపు మనం లేము గనుక మనకు చీకటి.

 అలాగే దేవుడు మనకు కనిపించ నంత మాత్రాన ఆయన లేరు అని కాదు. ఒకటి మనం ఆయనకు మన వెనుక చూపిస్తున్నాం కాబట్టి మనకు చీకటి కలుగుతుంది, అంటే శ్రమలు, కష్టాలు, వేదనలు, శోధనలు. అదే మనం ఆయన వైపు ఉంటే మనకు వెలుగు, అంటే ఆశీర్వాదం, సమయోచిత మయిన ఆలోచనలు, సందర్బాయోచిత మయిన సహాయం కలుగుతుంది. అంటే కానీ ఆయన లేనట్టు కాదు, మనలను విడచినట్టు కాదు.

రెండు, అధి దేవుడు పెట్టిన క్రమం. ఎలా అంటే మనకు చీకటి కలగడం అంటే శ్రమలు, వేదనలు కలగడం వలన మనం నిరీక్షణ ను, విశ్వాసాన్ని అల్వరచుకుంటాము. సూర్యుడు ఉదయించక పోతాడా అని.

 దేవుని వైపు మనం తిరుగుదాము, ఆయన మనవైపు ఎల్లప్పుడూ చేతులు చాపి ఎదురు చూస్తున్నారు.

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

 

అపోస్తులు నెల్లి నాని బాబు

9908823196

మన దేశంలో దేవుని సింహాసనం! ఎలా?


భూత,వర్తమాన,భవిష్యత్ కాలములలో ఉన్న ఎల్ - రోయి, ఎల్ - షద్ధయీ దేవునికే మహిమ,

ప్రభువు నామమున మీకు శుభాలు,

ప్రతి ఒక్కరికీ తెలుసు ప్రార్ధన శక్తి వంతమయింది అని, కొంత మందికి తెలుసు గొలుసు ప్రార్ధన మరింత శక్తివంతమైనది అని. గొలుసు ప్రార్ధన వలన జరగని కార్యం అంటూ లేదు. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. ఇధి కొంతమంది తెలియక పోవచ్చు. ఎలా అంటారా? యెషయా 6:1-3, ప్రకటన 4:8;5:9-14; 8: 1 లోని వాక్యాల ఆధారంగా, పరలోకం లో దేవుని సింహాసనం ఎదుట నిలచున్న దేవుని దూతలు, సెరాపులు, కేరాపులు నిత్యం ప్రభువుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు. అంటే పరలోకంలో నిత్య స్తుతి జరుగుతుంది.

 అదే నిత్య స్తుతి భూమి మీద రాజైన దావీదు సీయోను పర్వతం మీద, దేవుని ప్రత్యక్ష గుడారం నందు ఏర్పాటు చేశాడు.(  1దిన 16 ). అందుకోసమే దేవుడు అప్పటివరకు ఏ ప్రాంతాన్ని కూడా నా నివసస్థలం అని చెప్పలేదు, గానీ సీయోను తన నివాసముగా, అయన సీయోను వాసిగా చెప్పుకున్నారు. యెషయా 8:18, కీర్తనలు 74:2. అందుకోసమే దావీదును నా హృదయ అనుసారుడు అని సాక్ష్యం, బిరుదు ఇచ్చారు. అప్పుడు మొదలైనది నిత్య ఆరాధన, ప్రార్ధన భూమిమీద. అది కాస్త మార్పు చెందుతూ ఇప్పుడు గొలుసు ప్రార్ధన గా పిలువబడుతుంది. 

అంటే భూమి మీద ఎక్కడైతే నిత్య స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ ఆయన నివాసముంటారు. దానిని తన నివాస స్థలము గా చేసుకుంటారు. ఆ స్థలం నుండి తన పరిపాలన చేస్తారు. 


వాక్యం లో ఆయన నివాసం ఉన్న చోట స్తుతులు ఆయన సింహాసనం ( కీర్తనలు 22:3 ) అయితే ఆయన పాద పీఠం తన శత్రువులు ( కీర్తనలు 110:1 ) అని ఉంది. తన బిడ్డలం అయిన మన శత్రువు తన శత్రువు ( రోమా 12:19 ) ఇప్పుడు మనను బాధించు వారు, మనను శ్రమ పెట్టువారు, నిందించు వారు, మనలను బాధించు రోగములు, శాపములు, తెగులు దేవుని పాదముల క్రింద ఉంటే మనకు విడుదల, విజయం, సమాధానం, రక్షణ. 

అయితే ఆయనకు మనం సింహాసనం వెయ్యాలి కదా.... అలా ఆయనకు మన దేశం లో సింహాసనం వెయ్యడానికి దీర్ఘకాల, నిత్య గొలుసు ప్రార్థన చెయ్యాలని దర్శనం తో మా పరిచర్య జరుగుతుంది. 

ఇప్పటికే 70+ సేవకులు, మరికొంత మంది విశ్వాసులు కలసి ప్రతి నెల 1 వ తారీకు నుండి 5 వ తారీకు వరకు గొలుసు ప్రార్ధన జరుగుతుంది. మా ప్రాణాలిక దర్శనం ప్రాకారం ఈ ప్రార్ధన 30 రోజులు ఆగకుండా జరగాలి. 

అయితే మిమ్ములను కూడా ఇందులో పాలి బాగాస్తులు గా ఉండుటకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సంఘ, సిద్ధాంతం, ప్రాంతం, మిషన్ బేధం లేదు, పెంతుకొస్తు నుండి రోమన్ కేథలిక్, బిషప్ లనుండి సువార్తికుని వరకు అందరు రండి మనం అందరం కలసి మన సర్వలోక నిర్మానకుడు, ఆదిసంబుతుడు, సర్వశక్తుడు అయిన దేవునికి ఒక బలమైన సింహాసనం మన దేశం లో వెద్ధం..... 

ఈ సహవాసం లో  నెలకు ఒకరు  ఒక గంట, సంఘ ముగా ఒక రోజు గొలుసు ప్రార్ధన లో ఏకీభవించ గలిగితే చాలు... 



మరిన్ని సహవాస వివరాలు, కోసం
మీ వివరాలు, ఇష్టత  మాతో పంచుకోండి..... 

𝐈𝐍𝐃𝐈𝐀 𝐏𝐑𝐀𝐘𝐄𝐑 𝐋𝐄𝐀𝐆𝐔𝐄,

9908823196



మన గ్రూప్ లి జాయిన్ అవ్వండి. వాటిపై క్లిక్ చెయ్యండి.




స్తుతి ప్రార్ధన శక్తి నిరూపణ

ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.

ఒక యదార్ధ విషయాన్ని  మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే  20%  పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది.  CBN NEWS ప్రకారం  2017  లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు  2016  లో మొత్తం  జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది.  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు  ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.

మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్  ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో,  ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన  హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.

ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.
ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.

పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం  ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి  స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి  నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.

ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు  మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె  ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు  జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి  ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే  ఒక రోజు లేక  వ్యక్తి గతం గా అయితే  ఒక గంట / అర గంట  సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.

ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.

ప్రభువు సేవలో,
అపొస్తులు నాని బాబు నెల్లి,
స్థాపితులు,

ఇండియా ప్రేయర్ లీగ్,




దీప స్తంభం

 




ఒక వేసవి కాలములో పిల్లలకు సెలవు రోజుల్లో, మేము మా పిల్లలతో అంతర్వేది బీచ్ కు వెళ్ళాము. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. దానిని చూడటానికి వెళ్ళాము, పిల్లలు దాని గురించి చెప్పండి నాన్న అని అడిగారు. అప్పుడు దాని గురించి చెప్పడం మొదలు పెట్టాను. సముద్రం లో ప్రయాణం చేసే ఓడలుకి, చేపల వేటకు వెళ్లే మత్యకారులకు ఒడ్డుకు చేరడానికి ఒక దిక్షుచి అని చెప్పాను. ఎందుకలా వాళ్లకు తెలియదా? అన్నారు. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం కణపడదు, అలాంటప్పుడు ఈ దీపం వెలుగు వారికి తీరం ఎటువైపు ఉందో చూపిస్తుంది అని చెప్పాను. నిజమే కదా, సువిశాలమైన సముద్రం లో ఓడలు, పడవలు, నావలు ఒడ్డుకు నడిపించే దీపం, వెలుగు తీరాన్ని ఉండాలి. అప్పుడే తీరానికి చెరగలరు.

అలాగే యేసు వారు మనకు దీపం, వెలుగై ఉండి, మనకంటే ముందుగా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి, తీరానికి చేరి మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ జీవన సముద్రం లో మన జీవిత పడవ ప్రయాణం వెలుగై, దీప స్తంభం అయ్యి ఉన్న యేసు వైపు చూస్తూ నడిస్తే మనం కూడా యేసు వారి వలె పాపం, మరణం, లోకం జయించ గలము. నిత్య తీరమయిన పరముకు చెరగలం. మరణమును, నరకనును తప్పించు కొగలము.

ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక!