దేవుని అద్భుతం

 



ఒకసారి ఒక వృద్ధుడు దేవుడు తనకు ఇచ్చిన పిలుపు, బారాన్ని బట్టి రైలు లో సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి కంపార్ట్మెంట్ లోకి వెళ్లి నిలువబడి యేసు రక్షకుడు, మన పాపముల కొరకు చనిపోయి, తిరిగి లేచారు, ఆయన మరల వస్తున్నారు, మారుమనస్సు పొందండిఅంటూ గట్టిగ అరుస్తూ చెపుతున్నాడు. ఇంతలో అక్కడ ఉన ఒకావిడ అతని మీద కేకలు వేస్తూ, నోరుమూయి, నీ చెప్పే యేసు అసలు లేరు అని గట్టిగ అరిచింది. ఆ ముసలాయన ఏమి చెయ్యలేని పరిస్థితిలో, భయపడి కూర్చుండి పోయాడు.

 

గానీ దేవుడు తనను బలవంతం చేస్తున్నారు, సువార్త ప్రకటించడం అపవద్దు అని. దేవునికి భయపడి, లోబడి మరల నిలువబడి వాక్యం ప్రకటించడం మొదలు పెట్టాడు. మరల ఆ స్త్రీ తనమీద కోపం తో విరుచుకు పడి, దాడి చెయ్యడం మొదలు పెట్టింది. ఇంతలో తనకుడ కూడా వచ్చిన తన కుమారుడు గట్టిగా అమ్మ, తనను ఏమీ చెయ్యొద్దు, అతను దేవుని చేత పంపబడిన వాడుఅని చెప్పాడు అంట.

వెంటనే ఆ స్త్రీ మోకాళ్ళ మీద పడి ఏడ్వడం మొదలు పెట్టింది. రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ, తన పాపాలను ఒప్పుకుంటూ, యేసు ను అంగీకరించడం మొదలు పెట్టింది.

ఆ వృద్ధుడు ఏమైదీ  అని అడిగితే, “ నా కుమారుడు పుట్టి మూగవాడుఅని ఏడ్చింది.

 

 ప్రియ చదువరి, యేసు నీ జీవితం లో అనేక అద్భుతాలు చేస్తూనే ఉన్నారు గానీ నీ మనసును ప్రభువుకు ఇవ్వలేక పోతున్నావు. ఆయన మరల రాబోతున్నారు, మారుమనస్సు పొంది రక్షణ పొందు. సమయం వుండగానే నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు.

ప్రభువు మిమ్మును దీవించి, అంగీకరించును గాక!

 


రేమిడిసివర్ ఇంజక్షన్



ప్రస్తుతం బాగా వినపడుతున్న మాట రిమిడిసేవిర్. కొవిడ్ వచ్చిన వారికి ఇచ్చే ఇంజక్షన్. ఇధి ఒకోసారి లక్షలలో పలుకుతుంది. ఎందుకంటే అది లోపల ఉన్న వైరస్ పెరగకుండా ఆపుతుంది. అయితే కొన్ని కేసులలో ఆ ఇంజిక్షన్ ఇచ్చినా చనిపోతున్నారు. కారణం ఏమిటి అంటే వైరస్ వంటి నిండా వ్యాప్తి చెందిన తరువాత దానిని వాడుతున్నారు. దానిని వైరస్ సోకిన వెంటనే ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. దాని పని సక్రమంగా చెయ్యగలిగుతుంది.

అలాగే, చాలా మంది చనిపోయిన వారి పేరున దాన ధర్మాలు చేస్తారు. మనిషి చనిపోయిన తరువాత ఆ వ్యక్తి పేరున ఏమి చేసినా తనకు ప్రతిఫలం దక్కదు. కానీ అది చేసే వ్యక్తి అకౌంట్ లో ఉంటాయి. ఒకటి అలోసించండి,  ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోయిన తరువాత పరలోకం వెళ్తాడు, తీర్పు ఉంటుంది. అక్కడ దేవుడు బహుమానాలు ఇస్తారు. కానీ అవి ఎవరికి, ఎలా ఇస్తారు, భూమి మీద ఒక మనిషి చేసిన క్రియలను ఆధారం చేసుకుని ఇస్తారు. అంటే మనం రేమిడిసిర్ ఇంజక్షన్ వాడినట్లే. కాబట్టి బ్రతికి వుండగానే నీవు సంపాదించిన దాంట్లో కొంత అయిన అవసరతలో ఉన్నవాడికి దానం చెయ్యండి.   నీవు చనిపోయాక నీ కొడుకు ఎంత దానం చేసిన నీకు ప్రయోజనం ఉండదు. నీవు చేసి నీ జాబితాలో వేసుకో…. ఇక్కడ ధనాన్ని పరలోక ధనం గా మార్చుకోడానికి ఇదే మంచి సమయం. వదులుకోకుండా వాడుకో….

2కోరింథీయులకు 5: 10
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును.

శత్రువుల బయమా?


ప్రతి మనిషికి శత్రువు ఉంటాడు, కొంతమంది తెల్లవారితే బూతులు తిడుతూ ఉంటారు ఎదో ఒకదానిని వంక పెట్టుకుని, కొంతమంది బయటకు కనపడకుండా ప్రత్యర్థిని ఎలా దెబ్బ కొట్టాలా అని ప్రయత్నాలు చేస్తుంటారు. అవకాశం వచ్చినప్పుడు ఎదో రీతిగా ప్రత్యర్థిని పడగొట్టడానికి,మరికొంత మంది చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు.ఒకొక్కసారి వాటిని ఎదుర్కోగల శక్తి ఉంటుంది, ఒకొక్కసారి ఎదుర్కోలేక పతనం కావలసి ఉంటుంది. అనుకోని సమయం లో మెరుపు దాడి చెయ్యొచ్చు, దానికి సిద్ధంగా ఇందాక పోవొచ్చు. ఒకవేళ నీవు అలాంటి శత్రువును కలిగి ఉంటే,నీకు ఒక జరుగుతున్న ఒక విషయాన్ని తెలియ జేస్తాను.

పాలస్తీనా కు ఇశ్రాయేల్ దేశాలకు చాలా భయంకర శతృత్వం ఉందిి. ఇజ్రాయిల్ దేశ శత్రువులు అనుకోని సమయం లలోవారి మీద బాంబులు వేస్తూ ఉండేవారు. కానీ అవి ఇశ్రాయేల్ దేశం మీద పడేవి కావు, కొన్ని సార్లు అవి ప్రయోగించిన వారి మీదే పడుతూ ఉండేవి. శతృవు కు అర్ధం అయ్యింది. ఇశ్రాయేలీయుల దేవుడు వారికి సహాయం చేస్తున్నడు అని. పైన అది వాళ్ళు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్. “ ఇశ్రాయేలీయుల దేవుడు మేము పంపించే రాకెట్ల దారిని మళ్లిస్తున్నారు”.

తన ప్రజలు నిద్రపోతుంటే, బలహీనుడు గా ఉంటే, మెరుపు దాడిలో,దొంగ చాటున, సిద్ధం గా లేని సమయాన శతృవు నుండి తానే కాపాడుకుంటున్నారు. అలాంటి దేవుడు మనకంటే ఎంత బాగుణ్ణు. ఆయన వాళ్లకు మాత్రమే దేవుడు కాదు, ఆయనను అంగీకరించిన ప్రతిఒక్కరికి సర్వసృష్టికి దేవుడే, నీవు అంగీకరిస్తే నీకును ఆయన తన కాపుధల ఇవ్వగలరు.

రండి ఆయన దగ్గరకు యేసు ఒక్కడే మార్గం. యేసును అంగీకరించి దీవించ బడుదుము.
ప్రభువు మిమ్మును దేవించును గాక.

కీర్తనలు 121, హబకుకు 2:9, అపోస్తులూ 10:34-36, ద్వితి 11:12