లోక మాటలు క్రైస్తవునికి పట్టవు

 

లోక మాటలు క్రైస్తవునికి పట్టవు

చాల పర్యాయాలు స్నేహితులు, బంధువులు ఇచ్చిన సలహాలను మనం పాటించాము, వాటిని అనుసరించి నడవలేము. వారు కోపపడి మేము చెప్పేది అర్ధం కావడం లేదా? అని మనకు విసుకు పుట్టిస్తూ ఉంటారు. వాళ్లకు బయపడి క్రైస్తవులు లోక రీతిలో జీవిస్తుంటారు. అయితే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఒకసారి నేను కార్యక్రమమును నడిపిస్తుండగా కరెంటు పోయింది. మందిరం లో నేను కార్యక్రమమును నడిపిస్తుండగా బయట నుండి చీకటిలో యోవనస్తులు జెనరేటర్ ను సిద్ధం చేస్తూ సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న యోవనస్తునికి ఏదో సంజ్ఞలు చేస్తున్నారు. కాని తనకు కనపడటం లేదు అందువలన అర్ధం కావడం లేదు. అప్పుడే దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. దేవుడు మనలను వెలుగు సంబందులుగా చేసాడు. చీకటి లో ఉన్న వారి ఆలోచనలు, మాటలు, విషయాలు మనకు అర్ధం కావు. ఒకవేళ మనకు అర్ధం కావాలంటే వారు వెలుగు లోనికి రావలసి ఉంటుంది. దేవునిలోకి వచ్చిన మనలను లోక తలంపులు, లోక విధానాలు అర్ధం కావు, మనలను మార్చలేవు. మనం చికటి లోనికి పడిపోకుండా జాగ్రత్త పడుధము.

 

వెలుగై ఉన్న మన దేవుని కృప మీకు తోడై ఉండును గాక!

 

మీ సహోదరుడు

అపోస్తులు నెల్లి నాని బాబు 

8 లో దాగిన మర్మం

 




ప్రతి వ్యక్తి లో ప్రత్యేకమయిన తలంతు ఉంటుంది. ప్రత్యేక మయిన తలంతులు కలిగి ఉండటం అనేది దేవుని చిత్తము. ఒక మొదటి వ్యక్తి లో ఒక ప్రత్యేక మయిన తలంతు తన చుట్టూ వలయంగా మనం చూడగలిగితే అతను 0 మాదిరి కనిపిస్తున్నాడు. ఆదే విధమయిన తలంతులు ఆలోచనలు, క్రియలు  కలిగిన వారు ఎంతమంది ఉన్న అది 0 గానే ఉంటుంది.  అదే మరో ప్రత్యేకమయిన తలంతు, ఆలోచనలు, క్రియలు  కలిగిన వ్యక్తి తనకు తోడైతే 8 అవుతుంది. అంటే వారి ఐక్యత అనేక రెట్లు అవుతుంది. ఇద్దరి వేరు వేరు సామార్ధ్యాలు ఒక గొప్ప పనిని చెయ్య గలుగుతాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఒక ప్రోడక్ట్ తయారు చెయ్యగలడు, మరొక వ్యక్తి దానిని ప్రజలకు తెలివిగా అమ్మగలడు. వారిద్దరు  ఒకటైతే ఒక మంచి లాబాలతో కూడిన ఒక కంపెనీ తయారు అవుతుంది. కస్టపడి సంపాదించ గలిగే బర్త, తెలివిగా కుటుంబాన్ని నడపగల భార్య కలిస్తే ఒక విలువైన కుటుంబం.  అయితే వారి మధ్య ఐక్యత ముక్యం.. అది లేకపోతే మరల వారు 0 లాగానే మిగిలి పోతారు. అది కుటుంబం అయిన సరే, అన్నదమ్ములు అయిన సరే, సంఘం అయిన సరే, ఒక వ్యాపారం అయిన సరే..... అందుకే వాక్యం చెపుతుంది సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరం ( కీర్తనలు 133 ).

 

ప్రబువు మీకు అట్టి ఆసీర్వాదం అనుగ్రహించును గాక....

 

మీ సహోదరుడు ,

 

అపోస్తులు నాని బాబు నెల్లి

 

శిక్ష (న)

 





ఈరోజు నా మనస్సు ను చాలా బాధ పెట్టిన విషయం లో ఒక మంచి పాఠం మీకోసం….

 

నా కుమారుని క్రమశిక్షణ లో బాగంగా తాను ప్రతి రోజు చెయ్యవలసిన కొన్ని పనులు చెయ్యడం మానేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని తనకు అందులో ఉన్న తీవ్రత ను తెలపడం కోసం మోకాళ్ళు వెయ్యమని శిక్ష వేసాను. కొంచెం సేపు బాగానే వేసి ఉన్నాడు కానీ నా మనస్సు లో చాలా బాధగా ఉంది. అయ్యో కొడుకు ఇబ్బంది పడుతున్నాడని మనస్సు నొచ్చుకుంది. కానీ కటినంగా ఉండక పోతే కొన్ని విషయాలు పిల్లలకు నేర్పలేము. ఇంతలో నా కూతురు, బార్య, చెల్లి వచ్చి తనను వదిలేమని చెప్పారు. వాళ్లకు వాడిని నన్ను అడిగితే, మరల తప్పు చెయ్యను అని చెపితే వదిలేస్తాను అని చెప్పాను. వీళ్ళు వెళ్లి చెప్పారు. వాళ్ళు బాధపడుతున్నారు. నేను బాధ పడుతున్నాను. నా కొడుకు బాధ పడుతున్నాడు. వాడు అడుగుతాడు అని నా కొడుకు చుట్టూనే తిరుగుతున్నాను. కానీ వాడికి నన్ను అడగటానికి భయం, ఎలా అడగాలి అనె భయం. అడిగితే వదులుధమని నా ఆశ. ఈలోపు ఎప్పుడు కొట్టుకునే తన అక్క వాడి కోసం ఏడుస్తుంది. వాడికి అర్థం అయ్యింది, అక్కకు తను ఎంత ఇష్టమో, వాడికి బదులు తను మోకాళ్ళు వెయ్యడానికి సిద్ధం అయ్యింది. కొంచెం సేపటికి తను మెల్లగా డాడీ నీ మాట వింటాను అని చెప్పగానే నా కళ్ళల్లో నీళ్ళు, తనను కౌగలించుకున్నాను. అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. వాడికి ఇష్టమయిన వస్తువు వెంటనే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాను.

మన దేవుడు ఇంతకన్నా ప్రేమమయుడు, ఆయన మనలను శిక్షించి, మన పశ్చాతాపం తో చేసే ప్రార్ధన కోసం ఎదురు చూస్తుంటాడు. ( కీర్త 103:13 ) మనలను పాడు చెయ్యాలని కాదు గానీ మనలను బాగు చెయ్యాలని తన ఆశీర్వాదమునకు వారసులను చెయ్యాలని తన తపన. అందుకే ఒక పాపి తన పాపంలో మరనించుట తనకు ఇష్టం లేదు అని, ఒక పాపి రక్షింప బడితే పరలోకం లో దేవతలు ఆనందిస్తారని, ప్రభువు శిక్షించు నరుడు ధన్యుడు అని వాక్యం చెపుతుంది.  ( యెహే 18:30-32, లూకా 15:10, యోబు 5:17,18 )

 

నిబంధన ను జ్ఞాపకము చేసుకును దేవుడు


 


చాల పర్యాయాలు మనం దేవుని మీద కోపగించుకుని నాకు దేవుడు ఏమి చేసారు అని మాట్లాడుతూ ఉంటాము. అలాగే వాక్యములో చాలా వాగ్దానాలు ఉన్నాయి కదా ఏది నా జీవితం లో జరగడం లేదు అని విశ్వాసం లో దిగజారిపోతు ఉంటాము.   ఒకసారి ఇది చదవండి....

 

ఒకసారి అవసరం ఉండి 13 దినాల కొరకు ఒక కారు మాట్లాడుకున్నాను. అయితే అన్ని విషయాలు ముందుగానే మాట్లాడుకున్నాము. నాతో పాటు మా బంధువు కుడా ఉన్నారు.  13 రోజులు పూర్తి అయిన తరువాత మేము మాట్లాడుకున్నట్టు లెక్కలు కట్టి మొత్తం సొమ్ము కారు యజమానునికి ఇచ్చాను. అయితే అతను వేరే లెక్క కట్టి ఇంకా డబ్బులు వస్తాయి అని గొడవ పెట్టాడు. అప్పుడు గుర్తు వచ్చి మాట్లాడిన రోజున నాతో ఉన్న మా బండువుకు పోన్ చేసాను, తను నాకు ఒక వాయిస్ రికార్డింగ్ పంపించారు. అది కారు యజమానితో మేము మాట్లాడినది. అది ఆ యజమానునికి వినిపించగా అతడు ఏమి మాట్లాడలేక పోయాడు. ఆనాటి నుండి నేను ఏదైనా ఇలాంటి విషయాలు ఉంటె కచ్చితంగా వ్రాయించి ఇద్దరం సంతకాలు పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. అది నన్ను చాల నష్టాల నుండి కాపాడింది.

 

ఇదంతా మాకెందుకు అనుకుంటున్నారా? ఇలాంటి విషయాల పట్టిక ఈ పరిశుద్ధ గ్రంధం. ఇందులో ఉన్న వాగ్దానాలు అన్ని నిబంధనలు మాత్రామే. మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తామనే దేవుడు ముందుగా ఈ నిబంధనలన్నీ వ్రాయించి పెట్టాడు. నిబంధన ఆయన తప్పార? నీవే నిబంధన మీరవా? ఒకసారి గుర్తుకు తెచ్చుకో.... ఒకసారి కీర్తనలు 115:5 చదవండి.

 

దేవుడు మీ పట్ల తన నిబందను గుర్తుకు తెచ్చుకోనును గాక !

 

మీ సహోదరుడు

అపోస్తులు నెల్లి నాని బాబు

990 882 3196

మానవునికి ధాన్యపు గింజ నేర్పే బోధ

 

 


మన్నైన మానవ శరీరం మరల మట్టి కి మారుతుంది. మానవుడు మట్టి నుండి చెయ్యబడ్డాడు కాబట్టి మరల మన్నుకు మారుతున్నాడు. ఇది సత్యం. అయితే పుట్టిన నాటి నుండి మరణించే వరకు మానవునికి కొంత ఆయుష్షు దేవుడు ఇస్తున్నాడు. కొంత మందికి దీర్గ ఆయుష్షు, కొంత మందికి అల్ప అయుస్శును ఇస్తారు. కాని ప్రతి మనిషి ఈ భూమి మీద నిర్వర్తించవలసిన కర్తవ్యం ఒకటి ఉంటుంది. అది పూర్తి చేస్తున్నామా ? అసలు నీ జన్మకు సార్ధకత ఉందా?

 

రైతు పండించే ప్రతి ధాన్యపు గింజ మట్టినుండి పుట్టి మరల మట్టికే చేరుతుంది. కాని అది పుట్టిన నాటి నుండి మట్టికి చేరే లోపు రైతుకు ఆదాయం, ప్రతి మనిషికి ఆహారం, ఆరోగ్యం, వ్యాపార వేత్తకు లాబాన్ని, ఇలా చెప్పుకు పోతే అది మరల మన్నుకు చేరే సరికి ఎన్నో రూపాలలో సమస్త మానవాళికి ఉపయోగపడి తిరిగి మన్నుకు చేరుతుంది. ఆహారం గా మారిన ధాన్యం శరీరం లో ఆరోగ్యానికి అవసరమయిన రక్తాన్ని, ప్రోటిన్స్ ఇంకా అందించి కరిగి మలినమై మట్టికి చేరుతుంది. కొంత ధాన్యం మరల పురుత్పత్తి చేసి మరింత ధాన్యం కొరకు విత్తనం గా మారుతుంది. అల్ప ఆయుష్షు ఉన్న ధాన్యం పక్షులకు ఆహరం గా మారుతుంది, కొంత ధాన్యం చేలోనే రాలి మరల పెరిగి పశువులకు ఆహారం అవుతుంది.

 

అయితే మానవునిగా పుట్టిన నీవు మరనించే లోపు ఎంత మందికి ఉపయోగ కరంగా ఉన్నావు, నీ వలన దేవుని ఉద్దేశ్యం నెరవేరిందా? నీ ఆయుష్షు ఎంతో నీకు తెలియదు కదా మరి ఎందుకు సమయాన్ని పాడు చేస్తూ రేపు రేపు చేద్దాం అని వాయదాలు వేస్తావు. నీ జన్మ కు సార్ధకత చేసుకో....... సమయాన్ని వృద్ధా పరచకు.....

 

దేవుడు నిన్ను ప్రయోజన కరునిగా మార్చును గాక....

 

మీ సహోదరుడు

అపోస్తులు నెల్లి నాని బాబు


రోడ్డు నిర్మాణం లో మనకు ఒక పాఠం





ఒకరోజు నేను రోడ్డు నిర్మాణం పనులు జరిగే స్థలం మీదుగా వెళ్ళవలసి వచ్చింది. ప్రభువు నన్ను ఒక్క నిముషం ఇక్కడ ఆగి చూడు అన్నారు. ఏమి చూడాలి? సరే అని ఆగి రోడ్డు నిర్మాణం కొరకు వాడే మెటీరియల్ ని చూడటం మొదలు పెట్టాను. అక్కడ ఉన్న వన్ని రాళ్ళు, కానీ అవి ఒకొట్టి ఒకో పరిమాణం లో ఉన్నాయి. బాగా పెద్ద రాళ్ళు మొదట వేసి తరువాత చిన్న రాళ్ళు తరువాత బాగా చిన్న రాళ్ళు, మధ్యలో మట్టి, ఇసుక, లాంటివి వాడతారు. ఒకవేళ అవే రాళ్ళను తారు మారుగా వాడితే పరిస్థితి ఏమిటి? సాపిగా రావాల్సిన రోడ్డు ప్రయాణానికి అనువుగాని రోడ్డు గా ఉంటుంది. క్రింద వెయ్యవలసిన పెద్ద రాళ్ళు పైన వేసి పైన వేయ వలసిన చిన్న చిన్న రాళ్ళు క్రింద వేస్తే ?

అప్పుడు దేవుడు మనం జీవితం లో ఇవ్వవలసిన ప్రాధాన్యత లను గురుంచి నాతో మాట్లాడటం మొదలు పెట్టారు. చాలా మంది మొదట ఇవ్వ వలసిన వాటికి చివ్వరిలో, చివర ఇవ్వవలసిన వాటికి మొదటిలో ప్రాధాన్యత లను ఇస్తూ ఉంటారు.

మనం మొదట దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వ గలిగితే అధి మన జీవితం లో బలమయిన పునాదిగా, స్థిరత్వం కొరకు మూల రాయిగా ఉంటుంది.

కయీను, హెబెలు ల అర్పన లలో దేవుడు హేబెలు అర్పనను లక్ష్య పెట్టడానికి గల కారణం ఇదే. తను తోలుచులిలో, కొవ్విన వాటిని దేవుని యొద్ధకు తెచ్చాడు. అక్కడ దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, విలువ, స్థానం కనపడుతున్నాయి.

మీ జీవితం లో దేవునికి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నారు.

ప్రభువు మిమ్మును దీవించు ను గాక!

అపొస్తులు నాని బాబు నెల్లి

9908823196


యేసు వారు ఎందుకు స్వస్థత లు ప్రకటింప వద్దు అన్నారు?



యేసు వారు ఎప్పుడు ఎవరిని శ్వస్త పరచిన వారికి ఖండితంగా చెప్పే వారు " ఎవనికి చెప్ప వద్దు " అని. ఆయన ఎందుకు చెప్ప వద్దు అనేవారు?

యేసు వారు ఇలోకానికి రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చారు. అందులో ఒక బాగమే శ్వస్తత, అద్భుత కార్యాలు గానీ అదియే సువార్త కాదు. మానవుడు మనసు నిలుపవలసింది రాజ్య సువార్త మీద గానీ లోక సంబంధ మయిన వాటి మీద కాదు. ఆత్మ విడుదల, ఆత్మీయ శ్వస్తత ముఖ్య మయ్యింది కానీ క్షయమయిపోయే శారీరక విషయాలు కాదు. మానవ నైజం వలన వీటినే మనసున పెట్టీ అసలు యేసు వారి రాకకు అసలు కారణం ను పేడ చెవిన పెడతారని ఆయన వాటిని ప్రకటించ వద్దు అన్నారు. స్వస్థ పొందిన వారు వెళ్ళీ ప్రకటించుట వలన అనేకులు యేసును వెంబడించారు, అనేకులకు యేసు వారి గురుంచి తెలిసింది కానీ అసలు యేసు వారి రాజ్య సువార్త ను గ్రహించింది 120 మంది మాత్రమే. మిగిలిన వారు భౌతిక స్వస్థత, విడుదల, అద్భుతాలు జరుగుతాయి అని వచ్చిన వారే. 

ఈరోజు జనాన్ని పోగు చేసుకోవడం కోసం స్వస్థత లు అద్భుతాలు జరుగుతాయి అని ప్రకటించడం జరుగుతుంది అని ఉద్దేసం. అందులో గుంపులు గుంపులు గా జనం ప్రోగు పడుతున్నారు. కానీ నిజముగా దేవుని రాజ్య సువార్త ను గ్రహించే వారు ఎంత మంది. ఒక సేవకుని గా నీ పిలుపు ఏమైపోతుందో, మన తండ్రి మీ మీద పెట్టుకున్న ఆశలు నడి ఆశలు గానే మిగిలి పోతున్నాయి. 

ఒక విశ్వాసి గా నీవు దేని మీద మనసు పెడుతున్నవు? దేవుని రాజ్యం మీద ఉంచాలి ఆయన కోరుతున్నారు. అందుకే ఆయన ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వేదకమని చెప్పారు. అప్పుడు అవన్నియు మీకు దేరుకుతాయి అన్నారు. 

ప్రభువు మిమ్మును దీవుంచును గాక! 

ఆపొస్తులు నాని బాబు నెల్లి.




నీవు ఏమి కలిగి ఉండవు , కాని సంతోషంగా ఉంటావు - ప్రపంచ ఎకానమీక్ ఫోరం, “ ది గ్రేట్ రీసెట్ “

 



నీవు ఏమి కలిగి ఉండవు , కాని సంతోషంగా ఉంటావు -  ప్రపంచ ఎకానమీక్ ఫోరం, “ ది గ్రేట్ రీసెట్ “

 

ప్రస్తుత బయనిక తెగులు దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది, అనేక మరణాలు, అనేక మంది అనాదులుగా, విధవరాండ్రు గా మిగిలిపోతున్నారు. అనేక మంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం జీవితాంతం కస్టపడి సంపాదించిన ఆస్తినంత హాస్పటల్ లో అప్పగించి పిల్లలకు అప్పులు మిగిల్చి వెళ్ళిపోతున్నారు. మనం అంత బయనక స్థితి లో ఉన్నాము. ఎప్పుడు ఎవరికీ ఏమి అవుతుందో అని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు ప్రజలు. అయితే ఇ భయాన్ని తెగులును అవకాశంగా వాడుకుని ప్రజలను తప్పు త్రోవలో దేవునికి ఇష్టం లేని మార్గం లో నడిపించడానికి మరోపక్క ప్రపంచ దేశాల నాయకులు కుట్రలు పన్నుతున్నారు.

 

“ ది గ్రేట్ రీసెట్ “  “ THE GREAT RESET” అనే నినాదం తో ప్రపంచ ఎకనామిక్ ఫోరం ఒకటి ఏర్పడింది. దిని ప్రధాన ఉద్దేశ్యాలు, ప్రపంచ ఆర్ధిక పని తీరును మార్చుట, ప్రజలకు ఆరోగ్యం, వసతి, విద్య అందించడం. అయితే ఇది కనిపించడానికి చేసే ప్రతిజ్ఞలు, కాని వారి ఉద్దేశ్యాలు పెత్తందారి వ్యవస్థను, అంటే క్యాప్టలిసం మరియు మార్క్స్ వ్రాసిన కమ్మునిసం ను ప్రపంచమంతా అమలు చేసేలా ఉంది అని చాల మంది తెలియ జేస్తున్నారు.

ప్రపంచ ధనవంతులు వారి గుర్తింపును కోల్పోవడం వలన తిరిగి ఇ కోవిడ్ ను అడ్డం పెట్టుకుని మరల ఆర్ధిక వ్యవష్టలో ఉన్నత శిఖరాలు ఎక్కడం వారి ఉద్దేశ్యం. ప్రపంచ ఎకానమీ ఫోరం యొక్క ఉద్దేశ్యం ప్రకారం  2030 నాటికి “ ది గ్రేట్ రీసెట్ “  అమలుకావడం. దానిలో ప్రముక్యంగా వినిపించే మాట  “నీవు ఏమి కలిగి ఉండవు అయితే నీవు సంతోషంగా ఉంటావు”.  మన ఆస్తులు, వనరులు, ఏమి మన సొంతం కాదు కాని మనం సంతోషం గా ఉంటాము అనేది వారి నినాదం. మన ఏమీ కలిగి ఉండనప్పుడు మనము ఎలా సంతోషం గా ఉంటాము. అంటే మనకు కావలసినదంత వాళ్ళే ఇస్తారు. అంటే మనం ఏమి తినాలి, ఏమి కలిగి ఉండాలి, ఏ బట్టలు ధరించాలి, అంతా వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే నియంత్రిస్తారు. మనం అంత వాళ్ళ స్వాధీనం లోనే ఉంటాము.  మనం ఆ దనం ఆస్తి కలిగిఉండక పోతే మరి ఎవరు కలిగి ఉంటారు. అంటే  నాయకులు, వ్యాపార వేత్తలు కలిగి ఉంటారు. అంతేకాదు దేవుని వ్యతిరేక ఆలోచనలను అందులో ఉన్నాయి. స్త్రీ స్త్రీ వివాహాలు, పురుష పురుష వివాహాలు, ప్రజల మనోభిస్తానికి స్వేచ్చగా వదిలేయడం వంటివి.  ప్రపంచ దనం, అధికారం  అంతా వారి చేతిలోకి తీసుకోవడం, వాళ్ళే దేవుళ్ళుగా ఉండిపోవాలని  ఆశ. ఎప్పుడైతే ఇది ఏర్పడిందో ప్రజలలో కట్లు తెగిన జంతువుల వాలే ప్రవర్తించే అవకాసం ఎంతో ఎక్కువగా ఉంది. ఒక రకంగా సోదోమ గోమేర్ర వంటి దేశాల వాలే దేవుని కోపాన్ని ఉగ్రతను కొని తెచ్చుకున్న వారివలె ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వాక్సిన్ పాస్ పోర్ట్ అనేది అందులోని బాగామనే కొంతమంది ఆలోచన.

ఒకవేళ ఇది గాక ఏర్పడితే దేశంలోని ప్రతి జాతి అనేక కస్టాలు బరించక తప్పదు.  ఇప్పటికే ౩౦౦౦ మందికి పైగా అందులో బాగాస్తులై ఉన్నారు. దేశాల ప్రధానులు కుడా అటువైపు మొగ్గు చూపిస్తున్నారు.  చైనా ప్రధానితో పాటు మన దేశ ప్రధాని మోడీ గారు కుడా అందులో కనిపంచడం దురదృష్టకరం.

మనం కుడా రాబోయే రోజుల్లో మరల మన పూర్వికుల వలే కొత్త రకంగా మరల ధాస్యత్వం లోకి వెళ్లి పోయే ప్రమాదం పొంచి ఉంది.

దిని విషయంలో మనం ప్రార్ధన చెయ్యాల్సిన వారమై ఉన్నాము. కీర్తనలు 17:1. హగ్గాయి 1:3-10.

హగ్గాయి 2:4-7 లో ఆయన ఇచ్చిన వాగ్ధానము ను ఎత్తి బట్టి ప్రార్ధన చేదం. ( కీర్తనలు 9:15-16 , యేహేజ్కేల్ 17:19-20.,  కీర్తనలు 35:1- 18, ద్వితి 8:18, సామెతలు 13:22.

ఇవన్ని అయన రాకడకు ముంగుర్తులు కాగా అనేక ఆత్మల రక్షణ కలిగి దేవుని రాజ్యం కట్టబడునట్లు ప్రార్ధన చెద్దము.....

 

 

అపోస్తులు నాని బాబు నెల్లి,

ఇండియా ప్రార్ధన కూటమి

 

ఎరైజర్ నుండి పాఠం

 



నిన్నటి దినాన నా కుమార్తె బొమ్మలు గీస్తూ ఉంది. అయితే తనకు నేను కొత్త ఎరైజర్ కొని ఇచ్చాను కానీ ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయింది. మామూలు విషయమే కదా అని వదిలేసాను. కానీ దేవుడు అదే విషయాన్ని పదే పదె గుర్తు చేస్తూ వచ్చారు. ఇరోజటికి దేవుడు ఎదో చెప్ప బోతున్నారు అని గ్రహించి, ధ్యానించడం, ఆలోసించడం , ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాను.

అప్పుడు తండ్రి నా మనస్సు లో ఒక సాదృష్యాన్ని దానికి అన్వహించమన్నరు.

 

ఏరైజర్ ( పెన్సిల్ వ్రాతలను చేరుపునది ) ఎపుడెప్పుడు వాడతారు? ముఖ్యంగా పిల్లలు తప్పులు వ్రాసినప్పుడు వాటిని చెరిపి మరల ప్రయతించ డానికి ఉపయోగిస్తారు. వాళ్ళు తప్పులు చెరపడానికి ఉపయోగించిన ప్రతిసారీ ఎరైజర్ రా తప్పును చేరుపుతు అరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకు అంది పూర్తిగా అరిగిపోతుంది.

 

ఇక్కడ నమ్మకం ఒక ఎరైజర్ అయితే నీవు చేసే తప్పులు క్షమించేటప్పుడు అధి అరిగిపోతుంది. కొంత కాలానికి నీ తప్పులు సరిదిద్దు కోవడానికి ఎదుటవానిలోని నమ్మకం పూర్తిగా కోలిపోతావు.

నమ్మకం ఉంచుతున్నారు కదా అని కావాలని పొరపాట్లు చెయ్యకు, ఒకరోజు అనాధగా మిగిలిపోతారు.

 

యేసు వారు నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చెయ్యబడి, తిరిగి లేచి మనలను క్షమించి దేవుని రాజ్యానికి వారసుడని చేశారు. మరలా తిరిగి పాపం చెయ్యకు, మరణమే గతి.

 

( హెబ్రి 10: 26,27 )

 

ప్రభువు మిమ్మును మీ విశ్వాసమును బట్టి దీవించును గాక!

 

అపొస్తులు నాని బాబు నెల్లి,

ఇస్త్రీ చేసేటప్పుడు

  




ప్రతి రోజు నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకోవడం నాకు అలవాటు. నిన్న సాయంత్రం బయటకు వెళ్ళాలి అని బట్టలు ఇస్త్రీ చేసుకునే బల్ల మీద వేసి, ఇస్త్రీ పెట్టి యొక్క ప్లగ్ పెట్టీ, వెడెక్కే లోపు మంచి నీళ్లు తాగి వద్దామని పక్కనే ఉన్న వంట గదిలోకి వెళ్ళాను. నీళ్ళు తాగి వచ్చి ఇస్త్రీ చేస్తుంటే చొక్కాయి ఇస్త్రీ అవ్వడం లేదు, ఎంటా అని చూస్తే ఇస్త్రీ పెట్టీ వెడెక్క లేదు. అయ్యో ఇస్త్రీ పెట్టీ పోయింది అని బాధపడుతూ, స్విచ్ వెయ్యలేదేమో అని అనుమానం వచ్చి స్విచ్ చూస్తే బాగానే ఉంది. చాలా సేపు బాధపడ్డాను, ఇస్త్రీ పెట్టీ పాడైపొయ్యింది, ఇప్పుడు బట్టలు ఇస్త్రీ ఎలా అని. ఎందుకో అసలు ప్లగ్ సరిగా పెట్టానో లేదో అని చూసాను అప్పుడు అర్ధం అయ్యింది. ప్లగ్ సరిగానే పెట్టాను, స్విచ్ వేసాను కానీ నిన్ను పెట్టిన ప్లగ్ ఇస్త్రీ పెట్టిధి కాదు ప్రక్కన ఉన్న వేరే వస్తువుది అని. మరి ఇలా అయితే ఇస్త్రీ పెట్టీ ఎందుకు, ఎలా పని చేస్తుంది?

క్రైస్తవుడు కూడా తన జీవితాన్ని లోకానికి, లోక నటనకు, లోక సంప్రదాయాలు, అలవాట్లకు అప్పగించి, దేవునికి దూరంగా ఉంటూ, దగ్గరగా ఉన్నాము అనే బ్రమలో ఉంటూ, నా జీవితం మారడం లేదు, దేవుడు నన్ను దీవించడం లేదు అని బాధ పడితే ప్రయోజనం ఏమిటి?. నీ జీవితం దేవునితో లేదు! నీ అలవాట్లు దేవునికి ఇష్ట మయినవి కాదు! నీ జీవితాన్ని దేవునికి అనుసంధానం చెయ్యి అప్పుడు నిజ దీవెన నీలో ఫలిస్తుంది.

ప్లగ్ ఒక దానిది పెట్టీ వేరొకటి పనిచేయలనీ కొరువడం ఎంత మూర్ఖత్వమే, నీ జీవితం దేవునికి ఇవ్వకుండా దేవుడు దీవించడం లేదని అనడం కూడా అంతే…


మత్తయి 15:6-10

ప్రభువు మిమ్మును మీ విశ్వాస జీవితాన్ని బట్టి దీవించి ఆశీర్వదించును గాక!

అపొస్తులలు నాని బాబు నెల్లి

9908823196


పరీక్ష గదిలో




ఈరోజు ఉదయాన్నే ప్రార్థనలో మన తండ్రి నాకు నా డిగ్రీ కాలేజ్ లో పరీక్ష వ్రాస్తున్న సమయాన్ని గుర్తు చేశారు. నాకు కొంచెం ఆలోచనలో పడ్డాను. తండ్రి ఎప్పుడు అనవసరంగా గుర్తు చెయ్యరు దిని వెనుక ఎదో ఒక విషయం ఉంది, దానిని చెప్పాలి అనుకుంటున్నారు అని ధ్యానించడం మొదలు పెట్టాను.

 

కొంచెం సేపు ఆలోచనల తరువాత నా మధి మా పరీక్ష గదిలో ఉన్న ఇన్విజిలేటర్ వైపు వెళ్ళింది. ఆయన చాలా కట్టినంగ వ్యవహరించే వారు. అసలు అతు ఇటు కధలనిచ్చే వారు కాదు. ఇంకొంచెం అలోసిస్తే ఆ ఇన్విజిలేటర్ మాకు తెలియని వారు కాదు, గడచిన సంవత్సరం అంతా మాకు బోధించిన సారే

 

ఆయన సంవత్సరం అంతా బోధించి, మమ్ములను ఎంతగానో ప్రేమించి, బరించి, అర్ధం కాకపోతే మరల మరల అర్ధం అయ్యేవరకు వరకు చెప్పిన అధ్యాపకుడు. కానీ ఇప్పుడు ఆయన వేరే స్థానం లో ఉన్నారు. మేము పరీక్షలు వ్రాసేటప్పుడు ఆయన చెప్పినవన్నీ మేమే వ్రాయాలి. ఆయన ఇప్పుడు ఒక్క మాట కూడా చెప్పలేదు.

 

అలాగే దేవుడు బోధించినప్పడు, నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాలి, శ్రమలలో ఆ బోధలు మనకు సహాయంగా ఉంటాయి. ఆయన మనలను చూస్తూ ఉంటారు. మనం ఏవిధంగా నడుస్తున్నాము, ఏవిధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నామో, ఆయన చెప్పిన మార్గం లో నడుస్తున్నాము లేనిది పరీక్షిస్తారు. ఇవన్నీ ముందుగానే మనకు బోధించారు కదా….

మనకు బోధించిన అధ్యాపకుడు మనంపరిక్ష కాలంలో మౌనాన్ని వహించినట్టే ఇయన మౌనాన్ని వహించి మనలను పరిశీలిస్తారు

సూర్యుని నుండి పాఠం


మనకు సూర్యుని గురుంచి చాలా విషయాలు తెలుసు కానీ ఇంకా తెలియాల్సిన వి కూడా చాలా ఉన్నాయి.

 ఒకరోజు నేను ప్రార్ధన చేస్తుంటే నా దృష్టిని దేవుడు సూర్యుని మీదకు తిప్పారు. సూర్యుని గురుంచి చాలా విషయాలు అలోసించను, అయిన నాకుదేవుడు చెప్పదలసిన విషయం నాకు రావడం లేదు. చాలా విషయాలు చదివాను. ఒకొక్కసారి లోతైన విషయాలు కాకుండా చాలా సాధారణ విషయాలతో కూడా దేవుడు మనతో మాట్లాడతారు.

 నేను సూర్యుని గురుంచి ఎంత అలోసించిన నాకు లోటు గానే ఉంది. అప్పుడు సాధారణ విషయాలు అలోసించడం మొదలు పెట్టాను. అందులో ఒకటి సూర్యోదయం, సూర్యాస్తమయము. సూర్యోదయం అంటే సూర్యుడు ఉదయించడం, కనిపించడం. భూమి సూర్యుని తట్టు ఉన్న బాగం మీద సూర్య కంటి పడుతుంది, కనపడుతుంది. మరో బాగం లో సూరీడు కనపించడు. అంటే సూర్యుడు లేడు అని కాదు కదా…. సూర్యుని వైపు మనం లేము గనుక మనకు చీకటి.

 అలాగే దేవుడు మనకు కనిపించ నంత మాత్రాన ఆయన లేరు అని కాదు. ఒకటి మనం ఆయనకు మన వెనుక చూపిస్తున్నాం కాబట్టి మనకు చీకటి కలుగుతుంది, అంటే శ్రమలు, కష్టాలు, వేదనలు, శోధనలు. అదే మనం ఆయన వైపు ఉంటే మనకు వెలుగు, అంటే ఆశీర్వాదం, సమయోచిత మయిన ఆలోచనలు, సందర్బాయోచిత మయిన సహాయం కలుగుతుంది. అంటే కానీ ఆయన లేనట్టు కాదు, మనలను విడచినట్టు కాదు.

రెండు, అధి దేవుడు పెట్టిన క్రమం. ఎలా అంటే మనకు చీకటి కలగడం అంటే శ్రమలు, వేదనలు కలగడం వలన మనం నిరీక్షణ ను, విశ్వాసాన్ని అల్వరచుకుంటాము. సూర్యుడు ఉదయించక పోతాడా అని.

 దేవుని వైపు మనం తిరుగుదాము, ఆయన మనవైపు ఎల్లప్పుడూ చేతులు చాపి ఎదురు చూస్తున్నారు.

 

దేవుడు మిమ్మును దీవించును గాక!

 

అపోస్తులు నెల్లి నాని బాబు

9908823196

మన దేశంలో దేవుని సింహాసనం! ఎలా?


భూత,వర్తమాన,భవిష్యత్ కాలములలో ఉన్న ఎల్ - రోయి, ఎల్ - షద్ధయీ దేవునికే మహిమ,

ప్రభువు నామమున మీకు శుభాలు,

ప్రతి ఒక్కరికీ తెలుసు ప్రార్ధన శక్తి వంతమయింది అని, కొంత మందికి తెలుసు గొలుసు ప్రార్ధన మరింత శక్తివంతమైనది అని. గొలుసు ప్రార్ధన వలన జరగని కార్యం అంటూ లేదు. ఎందుకంటే అది దేవుడు ఏర్పాటు చేసిన విధానం. ఇధి కొంతమంది తెలియక పోవచ్చు. ఎలా అంటారా? యెషయా 6:1-3, ప్రకటన 4:8;5:9-14; 8: 1 లోని వాక్యాల ఆధారంగా, పరలోకం లో దేవుని సింహాసనం ఎదుట నిలచున్న దేవుని దూతలు, సెరాపులు, కేరాపులు నిత్యం ప్రభువుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు. అంటే పరలోకంలో నిత్య స్తుతి జరుగుతుంది.

 అదే నిత్య స్తుతి భూమి మీద రాజైన దావీదు సీయోను పర్వతం మీద, దేవుని ప్రత్యక్ష గుడారం నందు ఏర్పాటు చేశాడు.(  1దిన 16 ). అందుకోసమే దేవుడు అప్పటివరకు ఏ ప్రాంతాన్ని కూడా నా నివసస్థలం అని చెప్పలేదు, గానీ సీయోను తన నివాసముగా, అయన సీయోను వాసిగా చెప్పుకున్నారు. యెషయా 8:18, కీర్తనలు 74:2. అందుకోసమే దావీదును నా హృదయ అనుసారుడు అని సాక్ష్యం, బిరుదు ఇచ్చారు. అప్పుడు మొదలైనది నిత్య ఆరాధన, ప్రార్ధన భూమిమీద. అది కాస్త మార్పు చెందుతూ ఇప్పుడు గొలుసు ప్రార్ధన గా పిలువబడుతుంది. 

అంటే భూమి మీద ఎక్కడైతే నిత్య స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ ఆయన నివాసముంటారు. దానిని తన నివాస స్థలము గా చేసుకుంటారు. ఆ స్థలం నుండి తన పరిపాలన చేస్తారు. 


వాక్యం లో ఆయన నివాసం ఉన్న చోట స్తుతులు ఆయన సింహాసనం ( కీర్తనలు 22:3 ) అయితే ఆయన పాద పీఠం తన శత్రువులు ( కీర్తనలు 110:1 ) అని ఉంది. తన బిడ్డలం అయిన మన శత్రువు తన శత్రువు ( రోమా 12:19 ) ఇప్పుడు మనను బాధించు వారు, మనను శ్రమ పెట్టువారు, నిందించు వారు, మనలను బాధించు రోగములు, శాపములు, తెగులు దేవుని పాదముల క్రింద ఉంటే మనకు విడుదల, విజయం, సమాధానం, రక్షణ. 

అయితే ఆయనకు మనం సింహాసనం వెయ్యాలి కదా.... అలా ఆయనకు మన దేశం లో సింహాసనం వెయ్యడానికి దీర్ఘకాల, నిత్య గొలుసు ప్రార్థన చెయ్యాలని దర్శనం తో మా పరిచర్య జరుగుతుంది. 

ఇప్పటికే 70+ సేవకులు, మరికొంత మంది విశ్వాసులు కలసి ప్రతి నెల 1 వ తారీకు నుండి 5 వ తారీకు వరకు గొలుసు ప్రార్ధన జరుగుతుంది. మా ప్రాణాలిక దర్శనం ప్రాకారం ఈ ప్రార్ధన 30 రోజులు ఆగకుండా జరగాలి. 

అయితే మిమ్ములను కూడా ఇందులో పాలి బాగాస్తులు గా ఉండుటకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సంఘ, సిద్ధాంతం, ప్రాంతం, మిషన్ బేధం లేదు, పెంతుకొస్తు నుండి రోమన్ కేథలిక్, బిషప్ లనుండి సువార్తికుని వరకు అందరు రండి మనం అందరం కలసి మన సర్వలోక నిర్మానకుడు, ఆదిసంబుతుడు, సర్వశక్తుడు అయిన దేవునికి ఒక బలమైన సింహాసనం మన దేశం లో వెద్ధం..... 

ఈ సహవాసం లో  నెలకు ఒకరు  ఒక గంట, సంఘ ముగా ఒక రోజు గొలుసు ప్రార్ధన లో ఏకీభవించ గలిగితే చాలు... 



మరిన్ని సహవాస వివరాలు, కోసం
మీ వివరాలు, ఇష్టత  మాతో పంచుకోండి..... 

𝐈𝐍𝐃𝐈𝐀 𝐏𝐑𝐀𝐘𝐄𝐑 𝐋𝐄𝐀𝐆𝐔𝐄,

9908823196



మన గ్రూప్ లి జాయిన్ అవ్వండి. వాటిపై క్లిక్ చెయ్యండి.




స్తుతి ప్రార్ధన శక్తి నిరూపణ

ప్రియ దైవ జనులకు మీ జత పని వాడనైన క్రీస్తు దాసుడను, మరియు తోటి క్రైస్తవ సహోదరి సహోదరులకు అపోస్తుల పిలుపుతో దేవుని సేవను కొనసాగిస్తున్న నాని బాబు నెల్లి భారముతో, హృదయ పూర్వక వందనములతో వ్రాయునది.

ఒక యదార్ధ విషయాన్ని  మీకు తెలియ జేయాలని ఆశ పడుతున్నాను. ఎస్తేరు ప్రాజెక్ట్ వారు ప్రచురించిన లెక్కల ప్రకారం 2016 లో 361 సఘంపై దాడులు నమోదు చేయ బడ్డాయి, 2016 నుండి సంఘం మీదకు శ్రమలు ఇంతకు ముందు కంటే  20%  పెరిగాయి, మరియు ప్రతి 40 గంటలకు ఒక సంఘ వ్యతిరేక సంఘటన జరుగుతుంది.  CBN NEWS ప్రకారం  2017  లో అర్ధ సంవత్సరనికే జరిగిన సంఘటనలు  2016  లో మొత్తం  జరిగిన సంఘటనలు తో సమానం. మరియు ఓపెన్ డోర్ వారి 2018 వాచ్ లిస్టు నందు ప్రపంచంలో 50 అతిగా క్రైస్తవ సమాజం హింసింప దేశాల జాబిత లో మన దేశం 11 వ స్థానం లో ఉంది.  ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగ చెప్పబడుచున్న మన దేశం లో ఇలా సంఘ వ్యతిరేక దాడులు జరగడం చాల అవమానకరం. మన దేశంలోని పరిస్థుతులు  ఇలా క్రైస్తవ సమాజానికి సంఘానికి సేవకు విరుధం గా మారుతున్నాయి. రాబోయే కాలం లో ఈలాంటి పరిస్థితి కొనసాగితే దేవుని సేవ చేయుటకు, ప్రభువును భాహిరంగంగా స్తుతించడానికి అవకాశాలు ఉండక పోవొచ్చు.

మరో మంచి ఉదాహరణ మీకు గుర్తు చేస్తాను. 2011 నుంది ఉతర కొరియా ను పాలించిన కిమ్ జోంగ్ ఉన్  ఎంతటి నియంతో, ఆ దేశాన్ని ఎల పాలించాడో,  ప్రపంచ పోలీస్ గా, శక్తీ వంత మయిన దేశం అమెరికా మీదకు ఎలా కాలు దువ్వాడో మనకు తెలిసిందే కాని మనకు తెలియని ఒక విషయం, అక్కడ క్రైస్తవ సమజాన్ని అతడు చిత్ర హింసలకు గురి చేసాడు. అనేక మంది వారి విశ్వాసం కోసం ప్రాణాలు బలి పెట్టారు, అక్కడ సంఘం కటిన  హింసలు అనుభవించారు, తాగడానికి నీళ్ళు లేక, సరియయిన వైద్య అందక జైల్లో చిత్ర హింసలకు గురి అయ్యారు. అయితే అద్బుత మయిన విషయం ఏమిటి అంటే హింస కాలం లోనే అక్కడ సంఘం 5 రెట్లు వృద్ది అయ్యింది. జూన్ 12 న జరిగిన అమెరికా ఉతర కొరియా ల ఒప్పందం వలన మరల సంఘానికి స్వేచ్చ కలిగింది. దానికి వారు చేసిన పనేంటో తెలుసా ప్రార్ధన.

ప్రార్ధనా వారికి కరడు గట్టిన నియంత నుండి స్వేచ్చ ను తీసుకు రాగలిగింది. ప్రార్ధనా అమెరికా పాలకులలో శాంతి భావాన్ని కలిగించి తిరుగు బాటు చేసినా శాంతిగా ఒప్పందం కుదుర్చుకునే టట్టు చేయగలిగింది. కిమ్ జోంగ్ ఉన్ మనస్సును మార్చగలిగింది. దేవుని సహాయాన్ని పొందుకునే టట్టు చేసింది. ఎక్కడైతే ప్రార్ధాన, స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఆశినుడు అవుతాడు.
ఆశినుడు అంటే కూర్చోవడం, వాక్యం లో చెప్పినట్టు మన స్తుతులే ఆయన కూర్చోడానికి సింహాసనం ( కీర్త 22 :3 ) . అయన అసినుడు అయిన చోట అయన కాళ్ళ క్రింద ఒక పాద పీటం ఉంటుంది. అదేంటో తెలుసా అయన శత్రువులు (కీర్త 110 ). అయన కు మనం సింహాసనం వెయ్య గలిగితే అయన శత్రువు, సంఘ వ్యతిరేకులును అయన పాద పీటం గ చేసుకుంటాడు. ఆయనను సేవించు వారిని తన ప్రక్కన కూర్చుండ బెట్టుకుంటాడు. అంతే కాదు మన శత్రువులను మను పాద పీటము గా చెయ్య గలడు. అయితే మనం ఆయనకు ఒక సింహాసనం వెయ్యాలి.

పరలోకం లో ఆయనకు ఒక సింహాసనం  ఉంది. ఆయనను మనం భూమి మీదకు తీసుకుని రాగలిగిన ఒకే ఒక్క మార్గం అది పరలోక మాదిరి  స్తుతి, ఆరాధన. ఆదే ఆయనకు ఒక సింహసనం. ప్రభువు తన వాక్యం లో నేను సియోను వాసిని అన్నారు. అంటే అయన సియోనులో సింహసనసినుడు అయ్యారు. ఎందుకంటే సియోనులో దావీదు ఒక గుడారాన్ని కట్టి అక్కడ పరలోక మాదిరి  నిత్య స్తుతి ఆరాధన క్రమాన్ని స్థాపించాడు.

ఈరోజు మనం కూడా అలాంటి ఎడతెగని స్తుతి ఆరాధన స్థాపించ గలిగితే అయనకు  మన దేశం లో, మన రాష్ట్రం లో, మన జిల్లాలో ఒక సింహాసనాన్ని వెయ గళం. ఆ సింహాసనాన్ని సిధపరచ డానికె  ఇండియా ప్రేయర్ లీగ్ స్థాపించా బడింది. ఇప్పటికే 64 సంఘాలు తూర్పు, పచ్చిమ గోదావరి, గుంటూరు  జిల్లా ల నుండి, 20 సంఘాలు కలకత్తా, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల నుండి  ఇందులో పాలి భాగస్తులై ఉన్నారు. మీరును కూడా ఇందులో పాలి భాగస్తులై భారత దేశ క్షేమం కొరకు మన దేవునికి ఒక సింహాసనాన్ని సిద్ధపరుచుధాం . అందుకు మీరు చేయాల్సినది నెలలో సంఘముగా అయితే  ఒక రోజు లేక  వ్యక్తి గతం గా అయితే  ఒక గంట / అర గంట  సమయం కేటాయించాడం. మీరు కేటాయించిన సమయానికి మీరు ఉన్న స్థలములో ఉండి ప్రార్ధనలో ఉంటె చాలు. అవ్విధముగా నెలలోని 30 దినములు, 72౦ గంటలు ఎడతెగని స్తుతి ఆరాధనా జరుగుతుంది.

ఇప్పటికే అనేకులు స్తుస్తితూ ప్రార్ధిస్తున్నారు. మీ ఫోన్ నుండి ఒక మిసిడ్ కాల్ గాని, మీరు ప్రార్ధించే సమయం మెసేజ్ గాని చేయుట ద్వార మాకు మీ అంగికారని తెలియ జేయండి. కలసి దేవుని సన్నిధిని అనుభవిద్దాము, అలగే మీ ప్రార్ధనా అవసరతలు ఉంటె మాకు తెలియ జేయండి మనతో కలసి ప్రార్ధించే వారికి మీ అవసరత తెలియ పరుస్తాము. ప్రతి గంటకు మీ నిమిత్తం ప్రార్ధనాలో దేవుని ఎదుట ప్రస్తావించ బడుతుంది.

ప్రభువు సేవలో,
అపొస్తులు నాని బాబు నెల్లి,
స్థాపితులు,

ఇండియా ప్రేయర్ లీగ్,




దీప స్తంభం

 




ఒక వేసవి కాలములో పిల్లలకు సెలవు రోజుల్లో, మేము మా పిల్లలతో అంతర్వేది బీచ్ కు వెళ్ళాము. అక్కడ ఒక లైట్ హౌస్ ఉంది. దానిని చూడటానికి వెళ్ళాము, పిల్లలు దాని గురించి చెప్పండి నాన్న అని అడిగారు. అప్పుడు దాని గురించి చెప్పడం మొదలు పెట్టాను. సముద్రం లో ప్రయాణం చేసే ఓడలుకి, చేపల వేటకు వెళ్లే మత్యకారులకు ఒడ్డుకు చేరడానికి ఒక దిక్షుచి అని చెప్పాను. ఎందుకలా వాళ్లకు తెలియదా? అన్నారు. సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు సముద్ర తీరం కణపడదు, అలాంటప్పుడు ఈ దీపం వెలుగు వారికి తీరం ఎటువైపు ఉందో చూపిస్తుంది అని చెప్పాను. నిజమే కదా, సువిశాలమైన సముద్రం లో ఓడలు, పడవలు, నావలు ఒడ్డుకు నడిపించే దీపం, వెలుగు తీరాన్ని ఉండాలి. అప్పుడే తీరానికి చెరగలరు.

అలాగే యేసు వారు మనకు దీపం, వెలుగై ఉండి, మనకంటే ముందుగా లోకాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించి, తీరానికి చేరి మనకు మార్గాన్ని చూపిస్తున్నారు. ఈ జీవన సముద్రం లో మన జీవిత పడవ ప్రయాణం వెలుగై, దీప స్తంభం అయ్యి ఉన్న యేసు వైపు చూస్తూ నడిస్తే మనం కూడా యేసు వారి వలె పాపం, మరణం, లోకం జయించ గలము. నిత్య తీరమయిన పరముకు చెరగలం. మరణమును, నరకనును తప్పించు కొగలము.

ప్రభువు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక!