యేసు వారు ఎందుకు స్వస్థత లు ప్రకటింప వద్దు అన్నారు?



యేసు వారు ఎప్పుడు ఎవరిని శ్వస్త పరచిన వారికి ఖండితంగా చెప్పే వారు " ఎవనికి చెప్ప వద్దు " అని. ఆయన ఎందుకు చెప్ప వద్దు అనేవారు?

యేసు వారు ఇలోకానికి రాజ్య సువార్త ప్రకటించడానికి వచ్చారు. అందులో ఒక బాగమే శ్వస్తత, అద్భుత కార్యాలు గానీ అదియే సువార్త కాదు. మానవుడు మనసు నిలుపవలసింది రాజ్య సువార్త మీద గానీ లోక సంబంధ మయిన వాటి మీద కాదు. ఆత్మ విడుదల, ఆత్మీయ శ్వస్తత ముఖ్య మయ్యింది కానీ క్షయమయిపోయే శారీరక విషయాలు కాదు. మానవ నైజం వలన వీటినే మనసున పెట్టీ అసలు యేసు వారి రాకకు అసలు కారణం ను పేడ చెవిన పెడతారని ఆయన వాటిని ప్రకటించ వద్దు అన్నారు. స్వస్థ పొందిన వారు వెళ్ళీ ప్రకటించుట వలన అనేకులు యేసును వెంబడించారు, అనేకులకు యేసు వారి గురుంచి తెలిసింది కానీ అసలు యేసు వారి రాజ్య సువార్త ను గ్రహించింది 120 మంది మాత్రమే. మిగిలిన వారు భౌతిక స్వస్థత, విడుదల, అద్భుతాలు జరుగుతాయి అని వచ్చిన వారే. 

ఈరోజు జనాన్ని పోగు చేసుకోవడం కోసం స్వస్థత లు అద్భుతాలు జరుగుతాయి అని ప్రకటించడం జరుగుతుంది అని ఉద్దేసం. అందులో గుంపులు గుంపులు గా జనం ప్రోగు పడుతున్నారు. కానీ నిజముగా దేవుని రాజ్య సువార్త ను గ్రహించే వారు ఎంత మంది. ఒక సేవకుని గా నీ పిలుపు ఏమైపోతుందో, మన తండ్రి మీ మీద పెట్టుకున్న ఆశలు నడి ఆశలు గానే మిగిలి పోతున్నాయి. 

ఒక విశ్వాసి గా నీవు దేని మీద మనసు పెడుతున్నవు? దేవుని రాజ్యం మీద ఉంచాలి ఆయన కోరుతున్నారు. అందుకే ఆయన ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని మొదట వేదకమని చెప్పారు. అప్పుడు అవన్నియు మీకు దేరుకుతాయి అన్నారు. 

ప్రభువు మిమ్మును దీవుంచును గాక! 

ఆపొస్తులు నాని బాబు నెల్లి.




నీవు ఏమి కలిగి ఉండవు , కాని సంతోషంగా ఉంటావు - ప్రపంచ ఎకానమీక్ ఫోరం, “ ది గ్రేట్ రీసెట్ “

 



నీవు ఏమి కలిగి ఉండవు , కాని సంతోషంగా ఉంటావు -  ప్రపంచ ఎకానమీక్ ఫోరం, “ ది గ్రేట్ రీసెట్ “

 

ప్రస్తుత బయనిక తెగులు దేశాన్ని, ప్రపంచాన్ని కుదిపేస్తుంది, అనేక మరణాలు, అనేక మంది అనాదులుగా, విధవరాండ్రు గా మిగిలిపోతున్నారు. అనేక మంది తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం జీవితాంతం కస్టపడి సంపాదించిన ఆస్తినంత హాస్పటల్ లో అప్పగించి పిల్లలకు అప్పులు మిగిల్చి వెళ్ళిపోతున్నారు. మనం అంత బయనక స్థితి లో ఉన్నాము. ఎప్పుడు ఎవరికీ ఏమి అవుతుందో అని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు ప్రజలు. అయితే ఇ భయాన్ని తెగులును అవకాశంగా వాడుకుని ప్రజలను తప్పు త్రోవలో దేవునికి ఇష్టం లేని మార్గం లో నడిపించడానికి మరోపక్క ప్రపంచ దేశాల నాయకులు కుట్రలు పన్నుతున్నారు.

 

“ ది గ్రేట్ రీసెట్ “  “ THE GREAT RESET” అనే నినాదం తో ప్రపంచ ఎకనామిక్ ఫోరం ఒకటి ఏర్పడింది. దిని ప్రధాన ఉద్దేశ్యాలు, ప్రపంచ ఆర్ధిక పని తీరును మార్చుట, ప్రజలకు ఆరోగ్యం, వసతి, విద్య అందించడం. అయితే ఇది కనిపించడానికి చేసే ప్రతిజ్ఞలు, కాని వారి ఉద్దేశ్యాలు పెత్తందారి వ్యవస్థను, అంటే క్యాప్టలిసం మరియు మార్క్స్ వ్రాసిన కమ్మునిసం ను ప్రపంచమంతా అమలు చేసేలా ఉంది అని చాల మంది తెలియ జేస్తున్నారు.

ప్రపంచ ధనవంతులు వారి గుర్తింపును కోల్పోవడం వలన తిరిగి ఇ కోవిడ్ ను అడ్డం పెట్టుకుని మరల ఆర్ధిక వ్యవష్టలో ఉన్నత శిఖరాలు ఎక్కడం వారి ఉద్దేశ్యం. ప్రపంచ ఎకానమీ ఫోరం యొక్క ఉద్దేశ్యం ప్రకారం  2030 నాటికి “ ది గ్రేట్ రీసెట్ “  అమలుకావడం. దానిలో ప్రముక్యంగా వినిపించే మాట  “నీవు ఏమి కలిగి ఉండవు అయితే నీవు సంతోషంగా ఉంటావు”.  మన ఆస్తులు, వనరులు, ఏమి మన సొంతం కాదు కాని మనం సంతోషం గా ఉంటాము అనేది వారి నినాదం. మన ఏమీ కలిగి ఉండనప్పుడు మనము ఎలా సంతోషం గా ఉంటాము. అంటే మనకు కావలసినదంత వాళ్ళే ఇస్తారు. అంటే మనం ఏమి తినాలి, ఏమి కలిగి ఉండాలి, ఏ బట్టలు ధరించాలి, అంతా వాళ్ళే నిర్ణయిస్తారు, వాళ్ళే నియంత్రిస్తారు. మనం అంత వాళ్ళ స్వాధీనం లోనే ఉంటాము.  మనం ఆ దనం ఆస్తి కలిగిఉండక పోతే మరి ఎవరు కలిగి ఉంటారు. అంటే  నాయకులు, వ్యాపార వేత్తలు కలిగి ఉంటారు. అంతేకాదు దేవుని వ్యతిరేక ఆలోచనలను అందులో ఉన్నాయి. స్త్రీ స్త్రీ వివాహాలు, పురుష పురుష వివాహాలు, ప్రజల మనోభిస్తానికి స్వేచ్చగా వదిలేయడం వంటివి.  ప్రపంచ దనం, అధికారం  అంతా వారి చేతిలోకి తీసుకోవడం, వాళ్ళే దేవుళ్ళుగా ఉండిపోవాలని  ఆశ. ఎప్పుడైతే ఇది ఏర్పడిందో ప్రజలలో కట్లు తెగిన జంతువుల వాలే ప్రవర్తించే అవకాసం ఎంతో ఎక్కువగా ఉంది. ఒక రకంగా సోదోమ గోమేర్ర వంటి దేశాల వాలే దేవుని కోపాన్ని ఉగ్రతను కొని తెచ్చుకున్న వారివలె ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వాక్సిన్ పాస్ పోర్ట్ అనేది అందులోని బాగామనే కొంతమంది ఆలోచన.

ఒకవేళ ఇది గాక ఏర్పడితే దేశంలోని ప్రతి జాతి అనేక కస్టాలు బరించక తప్పదు.  ఇప్పటికే ౩౦౦౦ మందికి పైగా అందులో బాగాస్తులై ఉన్నారు. దేశాల ప్రధానులు కుడా అటువైపు మొగ్గు చూపిస్తున్నారు.  చైనా ప్రధానితో పాటు మన దేశ ప్రధాని మోడీ గారు కుడా అందులో కనిపంచడం దురదృష్టకరం.

మనం కుడా రాబోయే రోజుల్లో మరల మన పూర్వికుల వలే కొత్త రకంగా మరల ధాస్యత్వం లోకి వెళ్లి పోయే ప్రమాదం పొంచి ఉంది.

దిని విషయంలో మనం ప్రార్ధన చెయ్యాల్సిన వారమై ఉన్నాము. కీర్తనలు 17:1. హగ్గాయి 1:3-10.

హగ్గాయి 2:4-7 లో ఆయన ఇచ్చిన వాగ్ధానము ను ఎత్తి బట్టి ప్రార్ధన చేదం. ( కీర్తనలు 9:15-16 , యేహేజ్కేల్ 17:19-20.,  కీర్తనలు 35:1- 18, ద్వితి 8:18, సామెతలు 13:22.

ఇవన్ని అయన రాకడకు ముంగుర్తులు కాగా అనేక ఆత్మల రక్షణ కలిగి దేవుని రాజ్యం కట్టబడునట్లు ప్రార్ధన చెద్దము.....

 

 

అపోస్తులు నాని బాబు నెల్లి,

ఇండియా ప్రార్ధన కూటమి

 

ఎరైజర్ నుండి పాఠం

 



నిన్నటి దినాన నా కుమార్తె బొమ్మలు గీస్తూ ఉంది. అయితే తనకు నేను కొత్త ఎరైజర్ కొని ఇచ్చాను కానీ ఇప్పుడు చాలా చిన్నగా అయిపోయింది. మామూలు విషయమే కదా అని వదిలేసాను. కానీ దేవుడు అదే విషయాన్ని పదే పదె గుర్తు చేస్తూ వచ్చారు. ఇరోజటికి దేవుడు ఎదో చెప్ప బోతున్నారు అని గ్రహించి, ధ్యానించడం, ఆలోసించడం , ప్రార్థన చెయ్యడం మొదలు పెట్టాను.

అప్పుడు తండ్రి నా మనస్సు లో ఒక సాదృష్యాన్ని దానికి అన్వహించమన్నరు.

 

ఏరైజర్ ( పెన్సిల్ వ్రాతలను చేరుపునది ) ఎపుడెప్పుడు వాడతారు? ముఖ్యంగా పిల్లలు తప్పులు వ్రాసినప్పుడు వాటిని చెరిపి మరల ప్రయతించ డానికి ఉపయోగిస్తారు. వాళ్ళు తప్పులు చెరపడానికి ఉపయోగించిన ప్రతిసారీ ఎరైజర్ రా తప్పును చేరుపుతు అరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకు అంది పూర్తిగా అరిగిపోతుంది.

 

ఇక్కడ నమ్మకం ఒక ఎరైజర్ అయితే నీవు చేసే తప్పులు క్షమించేటప్పుడు అధి అరిగిపోతుంది. కొంత కాలానికి నీ తప్పులు సరిదిద్దు కోవడానికి ఎదుటవానిలోని నమ్మకం పూర్తిగా కోలిపోతావు.

నమ్మకం ఉంచుతున్నారు కదా అని కావాలని పొరపాట్లు చెయ్యకు, ఒకరోజు అనాధగా మిగిలిపోతారు.

 

యేసు వారు నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చెయ్యబడి, తిరిగి లేచి మనలను క్షమించి దేవుని రాజ్యానికి వారసుడని చేశారు. మరలా తిరిగి పాపం చెయ్యకు, మరణమే గతి.

 

( హెబ్రి 10: 26,27 )

 

ప్రభువు మిమ్మును మీ విశ్వాసమును బట్టి దీవించును గాక!

 

అపొస్తులు నాని బాబు నెల్లి,